ShareChat
click to see wallet page
search
*శ్రీరామ పాదం...!!* అవతారపురుషుడైన శ్రీరాముని పాద స్పర్శతో పునీతమైన పుణ్యస్థలాలు, రాముని గాధతో ముడిపడివున్న ప్రదేశాలు ఎన్నో మన భరతభూమిలో వున్నాయి... శ్రీ రాముడు ఆవతరించిన అయోధ్య ముక్తినొసగే ఏడు పవిత్ర స్ధలాలో ఒకటి. బక్సార్.. గౌతమ మహర్షి ఆశ్రమం వున్న ప్రాంతం. ఇక్కడే శ్రీరామ పాద స్పర్శతో అహల్యకు మోక్షం లభించింది. సోనేపూర్... జనకుడు యాగం చేసి భూమిని దున్నిన ప్రాంతంలో సీతాదేవి లభించిన పుణ్యభూమి. భరత గుండం (నంది గ్రామం) - భరతుడు శ్రీ రాముని పాదుకులను సింహాసనంపైనుంచి రాజ్యాన్నేలిన స్ధలం. చిత్రకూటం... శ్రీరామ,సీతా,లక్షణులను భరతుడు కలుసుకున్న ప్రాంతం. ఇది అలహాబాద్ సమీపమున వున్నది. పంచవటి... సీతాదేవి, శ్రీ రాముడు, లక్ష్మణుడు నివసించిన ప్రాంతం.ఇక్కడ వున్న కాలారామ్ దేవాలయం మిక్కిలి ప్రసిధ్ధిచెందినది. తొడ్గుర్ ఘాట్... రావణునికి, జటాయువు కి పోరాటం జరిగిన ప్రాంతం. శ్రీరాముని చేతిలో జటాయువు కు మోక్షం కలిగిన భూమి. భద్రాచలం... దండకారణ్యంలో శ్రీ రాముడు బసచేసిన ప్రాంతం. ఇక్కడవున్న శ్రీరాముని పవిత్ర అడుగుజాడలు దర్శించడం పుణ్యప్రదం. రామేశ్వరం - భారతదేశానికి దక్షిణ కొసన విరాజిల్లుతున్న పరమ పవిత్రక్షేత్రం. శ్రీరాముడు రావణునితో యుధ్ధానికి వెళ్ళేముందు ఇక్కడ శ్రీరాముడు శివలింగాన్ని ప్రతిష్టించి పరమేశ్వరుని పూజించిన స్థలం. అలాగే వానరుల సహాయంతో సముద్రంపై సేతువును నిర్మించిన పుణ్యస్థలం కూడా ఇక్కడే వుంది. ఈవిధంగా రామాయణ కాలంనాటి అవశేషాలెన్నో ఈనాటికీ మన దేశమంతా గోచరిస్తాయి... స్వస్తి.. జై శ్రీరామ్...🙏🙏🙏🙏 #🚩జై శ్రీరామ 🕉️ #జై శ్రీరామ #జైయ్ శ్రీరామ #జై శ్రీరామ
🚩జై శ్రీరామ 🕉️ - ShareChat