ShareChat
click to see wallet page
search
శరణాగతి మనిషి పిలుపులో అనేక స్థాయులుంటాయి. అవసరం కోసం మరో వ్యక్తిని పిలిచే సంద ర్భంలో బాధ, భయం, ఆనందం, దుఃఖం-ఏదో ఒకటి వ్యక్తమవుతుంది. అవన్నీ లోక వ్యవహారాలకు సంబంధించినవి. పరిస్థితి చేయిదాటిపోయి భీతావహ స్థితిలో ఉన్నప్పుడు, మనిషి ఆర్తనాదం మిన్నంటు తుంది. 'అన్యథా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ అనే నిశ్చయానికి వస్తాడు. అతడిలో ఆర్తి అసంకల్పితంగా చోటు చేసుకుంటుంది. పిల్లవాడికి బాధ కలిగితే 'అమ్మా!' అనే అరుపు, తల్లి మనసును తాకుతుంది. ఆ పిలుపు తక్షణం ఆమెను బిడ్డ వద్దకు చేరు స్తుంది. అమ్మను పిలిచినంత అర్ధంగా, ఆర్తిగా - సాధకుడు భగవంతుణ్ని పిలవాలి. అప్పుడే అసంఖ్యాక ప్రకృతి జనిత శబ్దాల్లో అతడి హృద యవేదన స్వామి వీనులకు సోకుతుంది. సాధకుడు నిత్యమూ కీర్తన, శ్రవణం, ఆర్చన లతో దేవుణ్ని కీర్తిస్తూ తన భక్తిని ప్రకటిస్తుంటాడు. ఆపద ఎదురైన సమయాల్లో, తన హృదయాంతరాళాల్లోని బాధను అతడు ఎలుగెత్తి చాటుతాడు. తనను రక్షించే ఆర్తత్రాణ పరాయణుడి కోసం తల్లడిల్లుతాడు. అదే ఆర్తి! ఆర్తి, జిజ్ఞాస, అర్ధాసక్తి, జ్ఞానం- ఈ నాలు గింటినీ 'భక్తిహేతు చతుష్టయం' అంటారు. ఇందులో ఆర్తిదే మొదటి స్థానం. ఎడారిలో రోజుల తరబడి తీవ్ర దాహార్తితో గడిపిన వ్యక్తి, ఆ తరవాత నీటి చెలమ కనిపిస్తే ఆనంద పరవశుడవుతాడు. భగవంతుడి కరుణ పొందడానికి భక్తుడు అంతటి ఆర్తిని వ్యక్తీకరించాలని పెద్దల మాట. 'ఆర్తి లేనిదే ఆత్మ సాక్షాత్కారం కాదు' అని రమణ మహర్షి అనడంలోనూ అదే అంతరార్థం! ఎర్రగా కాల్చిన ఇనుముకు సమ్మెట దెబ్బల వల్ల ఓ రూపం వస్తుంది. అదే రీతిలో భక్తుడి ఆర్తి- ఆత్మసాక్షాత్కారం కలిగేలా చేస్తుంది. మోక్షమార్గానికి అదే సూచిక అవుతుంది. దప్పిక తీర్చుకోవాలని సరస్సులోకి దిగుతాడు గజరాజు. ఆ కాలును స్థానబలం కారణంగా ఓ మొసలి అమాంతం నోటితో దొరక బుచ్చుకొంటుంది. గజరాజు ఎంతో పెను గులాడతాడు. కాలు రక్తసిక్తమై అల్లాడిపోతాడు. తనను రక్షించే వారి కోసం దిక్కులు పిక్కటి ల్లేలా అరుస్తాడు. నారాయణుడు తప్ప తనను రక్షించే నాథుడే లేడని గ్రహించి ఆర్తనాదాలు చేస్తాడు. లక్ష్మీదేవికి మాట మాత్రం చెప్ప కుండా, పరుగు పరుగున భువికి వచ్చిన నారా యణుడు భక్తరక్షణ గావిస్తాడు. భగవంతుణ్ని కదిపి కుదిపిన గజరాజు ఆర్తి అలాంటిది! కురుసభలో అందరూ చూస్తుండగానే, ద్రౌప దికి అవమానం ఎదురవుతుంది. పౌరుషానికి మారుపేరైనప్పటికీ, ఆమె భర్తలు దిక్కుతోచని స్థితిలో ఉంటారు. ద్రౌపదిని దుశ్శాసనుడు జుట్టుపట్టుకొని ఈడ్చుకు వస్తుంటే, మానవతి అయిన ఆమె తనను శ్రీకృష్ణుడే రక్షించాలని దీనాలాపన చేస్తుంది. ఆలకించిన కృష్ణుడు ఆపద్బాంధవుడై, ఆమె వస్త్రాపహరణాన్ని అడ్డుకుంటాడు. ద్రౌపది ఆర్తికి అదీ ఫలితం! పలువురు వాగ్గేయకారులు తమ గీతాల్లో ఆర్తిని చొప్పించారు. మధుర గీతాలాపనతో భగవంతుడి మనసును చూరగొన్నారు. హృదయగత ఆస్తి వారి భక్తిమార్గాన్ని సుసంపన్నం చేసింది. దేవుడున్నాడా. లేదా అనే ఆలోచనతో మనసును కప్పల తక్కెడ చేసుకునే వారుం టారు. వారు అనునిత్యం శషభిషలతో కాలం గడుపుతుంటారు. ఆర్తి వారి అనుభవంలోకి అణుమాత్రమైనా రాదు. ఆర్తి అనేది నిజ భక్తులకు అనుభవైకవేద్యం! అందులో శ్రమ ఉండాలి. అంతకుమించి, భగ వంతుడి ఉనికి పట్ల సడలని నమ్మకం. కలగాలి. అది ఒకసారి కుదిరాక ఆగకూడదు. ఆర్తిని వీడకూడదు. మానవజన్మకు ఓ రూపమిచ్చే ప్రక్రియగా ఆ క్రియను మలచుకో వాలి. ఆర్తిని ప్రకటించే స్థాయి అప్పుడే అతడి స్వభావంగా మారుతుంది. భగవం తుడు అతడివాడే అవుతాడు! #💗నా మనస్సు లోని మాట #తెలుసుకుందాం #bhakti
💗నా మనస్సు లోని మాట - ShareChat