ShareChat
click to see wallet page
search
#📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్ #ఏపీ అప్ డేట్స్..📖 #అసెంబ్లీ సమావేశాలు.. 🤠 *అసెంబ్లీకి గైర్హాజరు.. వైసీపీకి భారీ ప్రయోజనం❗* SEPTEMBER 28, 2025🎯 అసెంబ్లీ అనేది ప్రజా సమస్యల పరిష్కారానికి చక్కటి వేదిక. తమ సమస్యల్ని చట్టసభల్లో ప్రస్తావించి, వాటిని పరిష్కరిస్తారనే నమ్మకంతోనే ప్రజలు పట్టం కడుతుంటారు. అయితే గెలిస్తే తప్ప, అసెంబ్లీకి వెళ్లేది లేదనే ధోరణి నాయకుల్లో కనిపించడం విషాదం. ఇప్పుడు వైఎస్ జగనే కాదు, గతంలో అనేక మంది ప్రముఖులు వివిధ కారణాలతో అసెంబ్లీ గడప తొక్కేది లేదని ప్రతినబూనడం గురించి కథలుకథలుగా విన్నాం. ఇప్పుడు ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇవ్వలేదన్న కారణంతో వైఎస్ జగన్మోహన్రెడ్డి అసెంబ్లీకి వెళ్లడం లేదు. జగన్ను ఆయన పార్టీకి చెందిన మిగిలిన 10 మంది ఎమ్మెల్యేలు అనుసరిస్తుండడాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కాలం అనుకూలిస్తే తప్పులు కూడా ఒక్కోసారి కలిసి వస్తుంటాయి. ఏపీ అసెంబ్లీ సమావేశాలు వైసీపీకి రాజకీయంగా కలిసి రావడమే నిదర్శనం. ఏపీ అసెంబ్లీ సమావేశాలు 8 రోజుల పాటు జరిగాయి. వీటితో పాటు మండలి సమావేశాలు కూడా అంతేస్తాయిలో నిర్వహించారు. ఏపీ శాసనమండలి సమావేశాలకు వైసీపీ హాజరైంది. అందుకే మండలిలో కూటమి ప్రభుత్వం, వైసీపీ మధ్య పోరు హోరాహోరీని తలపించింది. మండలిలో వైసీపీ పక్ష నాయకుడు, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ నేతృత్వంలో కూటమి నేతలకు ముచ్చెమటలు పట్టించారు. రాష్ట్రంలోని ప్రతి ప్రజా సమస్యపై వైసీపీ సభ్యులు గట్టిగా నిలదీశారు. ఈ సందర్భంగా కూటమి, వైసీపీ సభ్యుల మధ్య డైలాగ్ వార్ చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని ఉద్దేశించి కుప్పం ఎమ్మెల్యే అంటూ వైసీపీ సభ్యుడు రమేశ్యాదవ్ అన్నది కూడా మండలిలోనే. వైఎస్ జగన్ను పులివెందుల ఎమ్మెల్యే అంటూ కించపరిచే కూటమి ప్రజాప్రతినిధులకు మండలి వేదికగా వైసీపీ దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చింది. ఇంకా వైద్య కళాశాలల ప్రైవేటీకరణ, రైతులకు యూరియా, పంటలకు గిట్టుబాటు ధరల్లేకపోవడంపై కూటమి సర్కార్ను వైసీపీ గట్టిగా నిలదీసింది. అందుకే కూటమి సభ్యుల తీరుపై మండలికి సంబంధించి ఎలాంటి ఫిర్యాదుల్లేవు. కానీ శానససభలో ప్రతిపక్షం లేకపోవడంతో ఆ పాత్రను కూటమి ప్రజాప్రతినిధులే కొద్దోగొప్పో పోషించారు. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం ఇరకాటంలో పడే పరిస్థితి. మరీ ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవనకల్యాణ్ను టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమా పొల్యూషన్ కంట్రోట్ బోర్డు విషయంలో ప్రశ్నించిన తీరు. విధుల నిర్వహణలో అందుబాటులో వుండడం లేదని సాక్ష్యాత్తు జనసేనానినే నిందింంచడం తీవ్ర చర్చనీయాంశమైంది. అలాగే కామినేని, బాలయ్య మధ్య సంవాదం మెగాస్టార్ చిరంజీవి లేఖ విడుదల, ఇవన్నీ కూడా అసెంబ్లీ సమావేశాల్లో కూటమి నేతల నిర్వాకమే కారణం. కూటమి ప్రభుత్వానికి, గతంలో వైసీపీ ప్రభుత్వ విధానాలకు తేడా ఏమీ లేదని సుజనా చౌదరి లాంటి సీనియర్ నాయకుడు అసెంబ్లీ వేదికగా ఘాటు వ్యాఖ్య చేశారు. అలాగే కూటమి ప్రభుత్వం ఏర్పడి 15 నెలలైనా అమరావతి రైతులకు ప్రయోజనం లేదని ఆయన అసెంబ్లీ వేదికగా నిరసించారు. అలాగే ప్రజా సమస్యలపై పలువురు కూటమి ప్రజాప్రతినిధులు అసెంబ్లీలో ధైర్యంగా ప్రస్తావించారు. తద్వారా కూటమి ప్రభుత్వ పనితీరును అందులో భాగస్వాములైన ప్రజాప్రతినిధులే ప్రస్తావిస్తూ, విమర్శించడం వల్ల రాజకీయంగా నష్టం జరిగిందన్న అభిప్రాయం వ్యక్తమైంది. అందుకే సీఎం చంద్రబాబుకు కోపం వచ్చింది. అసెంబ్లీలో సభ్యుల తీరుపై ఆయన ఆగ్రహంగా ఉన్నారంటూ కథనాలు వెలువడ్డాయి. ఒకవేళ వైసీపీ సభ్యులు అసెంబ్లీ సమావేశాలకు హాజరై వుంటే, రాజకీయంగా ఆ పార్టీకి మైలేజీ వచ్చి వుండేది కాదేమో! కూటమి ప్రజాప్రతినిధులంతా పూర్తిస్థాయిలో వైఎస్ జగన్, ఆయన పార్టీ ప్రజాప్రతినిధుల్ని తిట్టడానికే సమయాన్ని వెచ్చించేవారు. అయితే అసెంబ్లీలో అంతా కూటమి ప్రజాప్రతినిధులే ఉండడం, వ్యక్తిగత ఎజెండాలతో మాట్లాడ్డం వల్ల సమావేశాలు కాస్త రాజకీయంగా నష్టం తీసుకొచ్చాయంటున్నారు. అందుకే అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోయినా, వైసీపీ నేతల్లో జోష్ కనిపిస్తోంది.
📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్ - OOc OOc - ShareChat