#🗞️డిసెంబర్ 2nd ముఖ్యాంశాలు💬 #🌍నా తెలంగాణ #🏛️పొలిటికల్ అప్డేట్స్ #🆕Current అప్డేట్స్📢 #BRS party కాంగ్రెస్ సర్కార్ భూదందాకు కాలుష్యం ముసుగు✅
హిల్ట్ పరిధిలో ఐడీఏ బొల్లారం లేకపోవడానికి కారణం అదే❓
🆘 ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర ఫార్మా, బల్క్ డ్రగ్ కంపెనీలున్న ప్రాంతంగా గుర్తింపు
📣 గజం ధర 3,100 ఉండటంతో సర్కారు వెనుకంజ. గిట్టుబాటు ఉండదనే జీవో పరిధి నుంచి తొలగింపు
💰 రియల్ఎస్టేట్ దందా కోసమే హిల్ట్ అనేది తేటతెల్లం
పారిశ్రామిక ప్రాంతాల్లో కాలుష్యం ఉన్నది కాబట్టి జనావాసాలకు దూరంగా నగరం బయటకు తరలిస్తున్నామని, అందుకోసమే హిల్ట్ పాలసీ తెచ్చామని చెప్తున్న రేవంత్రెడ్డి మాటల్లో ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా దేశంలోనే అత్యంత ప్రమాదకర స్థాయిలో కాలుష్య కారక పరిశ్రమలున్న ఐడీఏ బొల్లారంను నగరానికి దూరంగా తరలించాల్సి ఉన్నది.
హిల్ట్ పాలసీలో ఐడీఏ బొల్లారంను చేర్చలేదు. దానికి సమీపంలో బాంబే హైవేకు ఆనుకొని ఉన్న పటాన్చెరు పారిశ్రామిక వాడను మాత్రం పాలసీలో చేర్చారు. పైగా పటాన్చెరులో ఉన్న పరిశ్రమలు ఎక్కువగా గ్రీన్ క్యాటగిరీలోనే ఉన్నాయి. ఇక్కడ గజం ధర మార్కెట్ విలువ రూ.1.5 లక్షలు పలుకుతున్నదని చెప్తున్నారు. కానీ బొల్లారం పారిశ్రామిక వాడలో ఎస్ఆర్వో గజం ధర రూ.3,100 మాత్రమే ఉన్నది. హైదరాబాద్ సమీపంలోని 22 పారిశ్రామిక వాడల్లోని ధరల కంటే బొల్లారం పారిశ్రామిక వాడలోని భూముల ధర తక్కువ ఉన్నట్టు ప్రభుత్వ పరిశీలనలో తేలింది.
ప్రస్తుతం బొల్లారం పారిశ్రామిక వాడల్లో నడుస్తున్న ప్రమాదకరమైన పరిశ్రమల్లో ప్రముఖులకు చెందినవే ఎక్కువ ఉన్నాయి. ఇప్పట్లో వీళ్లు అక్కడి నుంచి కదిలే పరిస్థితి లేదని, ఇక్కడ హిల్ట్ పాలసీని అమల్లోకి తెచ్చినా ధర తక్కువ భూములతో పెద్దగా గిట్టుబాటు కాదనే నివేదికలు అందటంతో ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని పాలసీ నుంచి తప్పించినట్టు ప్రచారం జరుగుతున్నది.
#Bhoochodu


