⛧ తీర్థము ⛧
తీర్థం యొక్క విశిష్ఠత ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇంట్లో, దేవాలయంలో లేదా ఇంకెక్కడైనా దేవుడి దర్శనం లేక పూజలు అయిన తర్వాత తీర్థం తీసుకుంటాం. కానీ తీర్థాన్ని మూడుసార్లు ఎందుకు తీసుకోవాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం..!!
దేవునికి పూజ చేసిన తర్వాత తీసుకునే తీర్థం లో పంచామృతాలు, తులసి దళాలు, సుగంధ ద్రవ్యాలు, మంత్ర శక్తులు ఉంటాయి. దీంతో ఆ తీర్థం అత్యంత పవిత్రంగా మారుతుంది. తీర్థం తీసుకోవడం ద్వారా మన ఆరోగ్యం, ఆధ్యాత్మికత మెరుగవుతాయి.
మొదటిసారి తీర్థం తీసుకుంటే శారీరక, మానసిక శుద్ధి జరుగుతుంది.
రెండవసారి తీర్థం తీసుకుంటే న్యాయ, ధర్మ ప్రవర్తనలు చక్కదిద్దుకుంటాయి.
ఇక మూడవది పవిత్రమైన పరమేశ్వరుని పరమ పాదోదకం అనుకుని తీసుకోవాలి.
మన పురాణాల ప్రకారం తీర్థం అంటే తరింపజేసేది అని అర్థం. దీన్ని మూడుసార్లు తీసుకుంటే.. భోజనం చేసినంత శక్తి వస్తుందని అంటారు.
తీర్థం తీసుకునేటప్పుడు ఆరోగ్యకరమైన భావంతో తీసుకోవాలి. ఈ తీర్థం నాకు మంచి చేస్తుంది, నా ఆరోగ్యానికి మరియు నా ఆధ్యాత్మికతను మెరుగు పరుస్తుంది అనే సద్భావంతో తీసుకోవాలి.
దేవుడికి పూజలు చేసే అర్చకులు ఈ శ్లోకాన్ని పఠిస్తూ భక్తులకు తీర్థాన్ని ఇస్తారు.
అకాల మృత్యు హరణం సర్వవ్యాధి నివారణం! సమస్త పాపక్షయకరం శ్రీ నారాయణ పాదోదకం పావనం శుభం!!
మూడు సార్లు కూడా కుడిచేయి కింద ఎడమ చేయిని ఉంచి తీర్థం తీసుకోవాలి. కుడిచేయి చూపుడు వేలు మధ్యలోకి బొటన వేలిని మడిస్తే గోముఖం అనే ముద్ర వస్తుంది. ఈ ముద్రతో తీర్థాన్ని తీసుకోవాలి.
తీర్థాన్ని తీసుకున్నాక తలపై తుడుచుకుంటారు. కాని అలా చేయకూడదు. తల పైన బ్రహ్మ దేవుడు ఉంటాడు. మన ఎంగిలిని బ్రహ్మకు అర్పణం చేసిన వారమవుతాము. కనుక కళ్లకద్దుకోని తీర్థాన్ని తీసుకోవాలి ....
#తెలుసుకుందాం #ఆచారాలు - సాంప్రదాయాలు #⚛️భారతదేశ ఆచారాలు🕉️ సాంప్రదాయాలు⚛️


