ShareChat
click to see wallet page
search
#వివేకా హత్య కేసు *ఈ పిటిషన్ నిలబడితే.. వివేకా హత్యకేసు జీడిపాకమే❗* NOVEMBER 5, 2025🎯 వైయస్ రాజశేఖర్ రెడ్డి తమ్ముడు వివేకానంద రెడ్డి హత్యకు గురై ఆరు సంవత్సరాలు కావస్తోంది. దర్యాప్తు మొత్తం పూర్తయి ఇక తీర్పు వెలువడడం ఒక్కటే పెండింగులో ఉన్నది అని అందరూ అనుకుంటున్న సమయంలో.. సిబిఐ ఈ కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగించాల్సిన అవసరం ఉన్నదని, ఇంకా అనేక కోణాలలో విచారణ జరగాల్సి ఉన్నదని ఆయన కుమార్తె సునీత కోర్టుకు వెళ్లారు. ఆరు సంవత్సరాలుగా జరిగిన దర్యాప్తులో అంతా పూర్తయిందని, ఈ కేసులో నిందితులుగా ఉంటూ జైలుకు వెళ్లి, మళ్లీ బెయిల్ మీద బయటకు వచ్చిన వారందరూ కూడా వాదిస్తున్నారు. అయితే ప్రధాన నిందితులలో ఒకరైన సునీల్ యాదవ్ మాత్రం.. భిన్నంగా స్పందిస్తున్నారు. సునీత కోరుతున్నట్లుగానే ఈ కేసులో తదుపరి దర్యాప్తు చేయవలసిందిగా.. సిబిఐ ను ఆదేశించాలని కోరుతూ కోర్టులో ఆయన కూడా ఒక పిటిషన్ వేశారు. మరణించిన వివేకానంద రెడ్డి కూతురు సునీతకు కూడా రాని (లేదా, ఆమె వ్యక్తం చేయడానికి ఇష్టపడని) సందేహాలు సునీల్ యాదవ్ కు వచ్చాయి. కేవలం సిబిఐ విచారణ కాదు, ఎన్ఐఏ సాయం కూడా తీసుకుంటూ సిబిఐ విచారణ సాగించాలని ఆయన కోర్టును అభ్యర్థించారు. సునీల్ యాదవ్ పిటిషన్ కు కోర్టులో మన్నన దక్కితే గనుక ఈ కేసు దర్యాప్తు మరో 10 ఏళ్ల పాటు జీడిపాకంలా సాగినా కూడా ఆశ్చర్యం లేదని పలువురు అంచనా వేస్తున్నారు. ఆ పిటిషన్ లో సునీల్ యాదవ్ లేవనెత్తిన సందేహాలు వాటన్నింటినీ తేల్చడానికి పూనుకుంటే పట్టగల సమయం ఇలాంటి అనుమానాలకు ఆస్కారం కల్పిస్తోంది. ఒకవైపు సునీల్ యాదవ్ వేసిన పిటిషన్, తదుపరి దర్యాప్తును కోరుతున్న వివేకా కుమార్తె సునీత రెడ్డి పిటిషన్ కు మద్దతుగా ఉన్నట్లుగానే అనిపిస్తుంది. అదే సమయంలో ఆయన పిటిషన్ లోని ఇతర అంశాలు గమనించదగ్గవి. ఈ హత్యలో సునీతా రెడ్డి కుటుంబ సభ్యుల పాత్ర కూడా ఉందని ఆరోపణలు ఉన్నట్లుగా సునీల్ యాదవ్ ప్రస్తావిస్తున్నారు. వారి విస్తృత కుటుంబ సభ్యుల అక్రమ చర్యలు, ఇస్లామిక్, క్రిస్టియన్ అతివాదుల చర్యలు సైతం బయటపడ్డాయని ఆయన సూత్రీకరిస్తున్నారు. వివేకా జీవితంలో ఇతర అంశాలను పట్టించుకోవాలంటూ.. అక్రమ సంబంధాలు, సెటిల్మెంట్ వ్యవహారాలు, అక్రమ సంబంధాలు ఉన్న మహిళలతో ఆర్థిక లావాదేవీలు వంటి అనేక అంశాలను తేల్చాలని కోరుతుండడం విశేషం. వివేకానంద రెడ్డి ఓ ముస్లిం మహిళను రహస్యంగా వివాహం చేసుకొని ఒక బిడ్డకు తండ్రి అయ్యారని, మరొక ముస్లిం యువతి తో సంబంధం కలిగి ఉన్నారని, వారిద్దరినీ కూడా సిబిఐ ప్రశ్నించాలని సునీల్ యాదవ్ అంటున్నారు. వివేకా హత్య వ్యవహారంలోకి 'లవ్ జిహాద్ ట్రాప్' కోణాన్ని జోడిస్తున్న సునీల్ యాదవ్ ఈ విషయంలో ఎన్ఐఏ సహాయం తీసుకుంటూ సిబిఐ పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టాలి అని తన పిటిషన్ లో కోరుతున్నారు. వివేకాను చంపిన ప్రధాన నిందితులలో ఒకడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సునీల్ వాదనను గమనిస్తే.. ఈ హత్య వెనుక ఇస్లామిక్ ఉగ్రవాదం పాత్ర కూడా ఉందని సూచించడానికి తపన పడుతున్నట్టు అర్థం అవుతుంది. ఆ విషయాలను కూడా తేల్చాలి అంటే గనుక ఈ హత్య కేసు దర్యాప్తు స్క్వేర్ వన్ కు వచ్చినట్లు అవుతుంది. అలాంటిదేమీ లేదని దర్యాప్తులో తేలవచ్చు. కానీ అందుకు కొన్ని సంవత్సరాల సమయం పడుతుంది. అంటే హత్య కేసు ఒక పట్టాన తేలకుండా జీడిపాకంలాగా సాగుతూనే ఉండాలనే ఉద్దేశంతోనే సునీల్ యాదవ్ ఈ పిటిషన్ వేసారేమో అని అనుమానం పలువురి లో కలుగుతుంది.
వివేకా హత్య కేసు - 8| 08| 03| 8| 08| 03| - ShareChat