ShareChat
click to see wallet page
search
#EVM హాక్ ⁉️ *జనంలోకి వేగంగా ఓట్ల చోరీ వ్యవహారం❗* AUGUST 12, 2025🎯 పట్టణాలు, నగరాల్లో టీ షాపుల వద్ద ఏ నలుగురు కలిసినా ఓట్ల చోరీపై మాట్లాడుకుంటున్నారు. అలాగే పల్లెల్లో రచ్చబండలు, టీ దుకాణాల వద్ద రాహుల్ గాంధీ బయటపెట్టిన ఓట్ల చోరీపై చర్చిస్తుండడం ఆసక్తికర పరిణామం. ఇటీవల రాహుల్గాంధీ ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో కేంద్ర ఎన్నికల సంఘం తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ కోసం ఈసీనే ఓట్ల చోరీకి పాల్పడుతోందన్నది ఆయన ప్రధాన ఆరోపణ. అంతేకాదు, తాము డిజిటల్ ఓట్ల వివరాలను, సీసీ కెమెరాల ఫుటేజీని అడుగుతుంటే ససేమిరా అంటోందని ఆయన తప్పు పట్టారు. వివిధ రాష్ట్రాల్లో ఓటింగ్ నమోదు, ఒకే వ్యక్తికి దేశంలో వేర్వేరు చోట్ల ఓట్లు వుండడాన్ని ఆయన బయట పెట్టారు. సింగిల్ బెడ్ రూమ్ ఇంట్లో పెద్ద సంఖ్యలో ఓట్ల నమోదు గురించి చెప్పి, ఔరా అనిపించారు. అలాగే బెంగళూరు సెంట్రల్ పార్లమెంట్ పరిధిలోని మహదేవపుర అనే అసెంబ్లీ నియోజకవర్గంలో లక్షకు పైగా ఓట్ల చోరీ జరిగిందంటూ, ఆయన వెల్లడించిన వివరాలు జనాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ వివరాలు వెల్లడించడానికి ముందు, ఆ తర్వాత రాహుల్పై జనాభిప్రాయంలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ఇదే సందర్భంలో బీజేపీపై కూడా స్పష్టమైన మార్పు గమనించొచ్చు. కేంద్ర ఎన్నికల సంఘం విశ్వసనీయత పాతాళానికి పడిపోయింది. ఇలాగైతే బీజేపీ, ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నోళ్లు ఎన్నిసార్లైనా గెలుస్తారనే మాటలు వినిపిస్తున్నాయి. ఈసీపై కేవలం ఆరోపణలకే పరిమితం కాకుండా, ఆధారాలతో సహా రాహుల్ జనానికి వివరిస్తుండడం ఆకట్టుకుంటోంది, ఆలోచింపజేస్తోంది. ఇప్పటికైనా అనుమానాల్ని కేంద్ర ఎన్నికల సంఘం తొలగించకపోతే, భవిష్యత్లో తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుంది.
EVM హాక్ ⁉️ - UIIUIIDIID VOTEHASBEEN DeShtष FAKE & INVALID ORESSES 40,009 UIIUIIDIID VOTEHASBEEN DeShtष FAKE & INVALID ORESSES 40,009 - ShareChat