#🇮🇳 మన దేశ సంస్కృతి #🕉️ గణపతి బప్పా మోరియా #📙ఆధ్యాత్మిక మాటలు #🎶భక్తి పాటలు🔱
14-04-2026 ప్రాత:మురళిఓంశాంతి"బాప్ దాదా" మధువనం
‘‘మధురమైన పిల్లలూ - దేవతలుగా అవ్వాలంటే, అమృతాన్ని తాగండి మరియు తాగించండి, అమృతాన్ని తాగేవారే శ్రేష్ఠాచారులుగా అవుతారు’’
ప్రశ్న:-ఈ సమయములో సత్యయుగీ ప్రజలు ఏ ఆధారముగా తయారవుతున్నారు?
జవాబు:-ఎవరైతే ఈ జ్ఞానముతో ప్రభావితులవుతారో, చాలా బాగుంది, చాలా బాగుంది అని అంటారో, కానీ చదువును చదవరో, శ్రమ చేయలేకపోతారో, వారు ప్రజలుగా అవుతారు. ప్రభావితులవ్వడమంటే ప్రజలుగా అవ్వడము. సూర్యవంశీ రాజా-రాణులుగా అయ్యేందుకైతే శ్రమించాలి. చదువు పట్ల పూర్తి అటెన్షన్ ఉండాలి. స్మృతి చేస్తూ మరియు చేయిస్తూ ఉన్నట్లయితే ఉన్నత పదవి లభించగలదు.
పాట:-నీవు నిదురించి రాత్రిని పోగొట్టుకున్నావు...
▶
ఓంశాంతి. మా జీవితము పూర్వము వజ్ర సమానముగా ఉండేది, ఇప్పుడు గవ్వ సమానముగా అయ్యింది అని పిల్లలు పాటలో విన్నారు. ఇదైతే సాధారణమైన విషయము. బాబా చాలా సులువైన పద్ధతిలో అర్థం చేయిస్తారు, అందుకు చిన్న పిల్లలు కూడా అర్థం చేసుకోగలరు. సత్యనారాయణుని కథను వినిపించినప్పుడు చిన్న-చిన్న పిల్లలు కూడా కూర్చుండిపోతారు. కానీ ఆ సత్సంగాలు మొదలైనవాటిలో ఏవైతే వినిపిస్తారో, అవన్నీ కథలు. ఆ కథలు జ్ఞానమేమీ కాదు, అవి తయారై, తయారుచేయబడిన కథలు. గీతా కథ, రామాయణ కథ, అలానే రకరకాల శాస్త్రాలు ఉన్నాయి, వాటిలోని కథలను కూర్చుని వినిపిస్తారు. అవన్నీ కథలే. కథల వలన లాభమేమైనా ఉంటుందా! ఇది సత్యనారాయణుని కథ అనగా నరుని నుండి నారాయణునిగా అయ్యే సత్యమైన కథ. ఇది వినడముతో మీరు నరుని నుండి నారాయణునిగా అవుతారు. ఇది అమరకథ కూడా. రండి, మీకు అమరకథను వినిపిస్తాము, దానితో మీరు అమరలోకానికి వెళ్ళిపోతారు అని మీరు ఆహ్వానాన్ని ఇస్తారు. ఇలా చెప్పినా కూడా ఎవరూ అర్థం చేసుకోరు. శాస్త్రాల కథలను వింటూ వస్తారు కానీ ఏమీ లభించదు. లక్ష్మీ-నారాయణుల మందిరాలకు వెళ్తారు, పదండి, దర్శనము చేసుకుని వద్దాము, మహాత్ముల దర్శనము చేసుకుని వద్దాము అని అంటారు. ఇది ఒక ఆచారము, పద్ధతి వలె కొనసాగుతూ వస్తుంది. ఋషులు, మునులు మొదలైనవారెవరైతే ఒకప్పుడు ఉండి వెళ్ళారో, వారికి తల వంచి నమస్కరిస్తూ వచ్చారు. రచయిత మరియు రచనల కథ గురించి తెలుసా అని అడిగితే, తెలియదు అని అంటారు. ఈ రచయిత మరియు రచనల కథ అయితే చాలా సహజమైనది అని పిల్లలైన మీరిప్పుడు అర్థం చేసుకున్నారు. ఇది అల్ఫ్ మరియు బే (భగవంతుడు మరియు రాజ్యాధికార వారసత్వము) యొక్క కథ. ప్రదర్శనీలకు ఎవరైతే వస్తారో, వారు కథను బాగానే వింటారు కానీ పవిత్రముగా అవ్వరు. ఈ వికారాలలోకి వెళ్ళే ఆచారము, పద్ధతి కూడా అనాది అయినదని వారు భావిస్తారు. మందిరాలలో దేవతల ఎదురుగా వెళ్ళి, మీరు సంపూర్ణ నిర్వికారులు... అని పాడుతారు, మళ్ళీ బయటకు వచ్చి ఏమంటారంటే - వికారాలలోకి వెళ్ళడమనేది అనాదిగా కొనసాగుతూ వస్తున్న పద్ధతి, వికారాలు లేకుండా ప్రపంచము ఎలా నడుస్తుంది, లక్ష్మీ-నారాయణులు మొదలైనవారికి కూడా పిల్లలుండేవారు కదా అని. ఇటువంటివారికి ఏమని చెప్పాలి! దేవతలను మనుష్యులతో సమానులని అనలేము కదా. దేవతలు కూడా మనుష్యులే, లక్ష్మీ-నారాయణుల రాజ్యములో ఎంత సుఖముగా ఉండేవారు. పిల్లలైన మీకు తండ్రి చాలా సహజమైన విషయాన్ని తెలియజేస్తున్నారు, తప్పకుండా ఇక్కడ భారత్ లోనే స్వర్గముండేది, లక్ష్మీ-నారాయణుల రాజ్యముండేది. వారి చిత్రాలు కూడా ఉన్నాయి, సత్యయుగములో వారి రాజ్యముండేదని అందరూ నమ్ముతారు. అక్కడ ఎవ్వరూ దుఃఖితులుగా ఉండేవారు కాదు, వారు సంపూర్ణ నిర్వికారులుగా ఉండేవారు, వారి మందిరాలు కూడా చాలా పెద్ద-పెద్దవి నిర్మించబడ్డాయి. వారు 5000 సంవత్సరాల క్రితం ఉండేవారు, ఇప్పుడు వారు లేరు. ఇప్పుడైతే ఇది కలియుగ అంతిమము. మనుష్యులు పరస్పరము కొట్లాడుకుంటూ-గొడవపడుతూ ఉంటారు. భగవంతుడైతే పైన నిర్వాణధామములోనే ఉంటారు. వాస్తవానికి ఆత్మలమైన మనము కూడా అక్కడే ఉండేవారము, పాత్రను అభినయించేందుకని ఇక్కడకు వస్తాము. మొదట మనము లక్ష్మీ-నారాయణుల రాజ్యములో ఉండేవారము. అక్కడ చాలా సుఖము, ఆనందము ఉండేవి, ఆ తర్వాత మనము 84 జన్మలు తీసుకోవాల్సి ఉంటుంది. 84 జన్మల చక్రమని అంటూ ఉంటారు కూడా. మనము సూర్యవంశములో 1250 సంవత్సరాలు రాజ్యము చేసాము. అక్కడ అపారమైన సుఖముండేది, సంపూర్ణ నిర్వికారులుగా ఉండేవారు, వజ్ర వైఢూర్యాల మహళ్ళు ఉండేవి. మనము రాజ్యము చేసాము, ఆ తర్వాత 84 జన్మలలోకి రావాల్సి ఉంటుంది. ఈ ప్రపంచ చరిత్ర-భౌగోళికాల చక్రము తిరుగుతూ ఉంటుంది. అర్ధకల్పము సుఖముండేది, రామ రాజ్యములో ఉండేవారము, ఆ తర్వాత మనుష్యుల సంఖ్య వృద్ధి అవుతూ వచ్చింది. సత్యయుగములో 9 లక్షల మంది ఉండేవారు. సత్యయుగ అంతిమానికి వృద్ధి చెంది, 9 లక్షల నుండి 2 కోట్ల మంది అయ్యారు, ఆ తర్వాత త్రేతాలో 12 జన్మలు చాలా సుఖ-శాంతులతో ఉండేవారు. ఒకే ధర్మముండేది. ఆ తర్వాత ఏమయ్యింది. రావణ రాజ్యము ప్రారంభమయ్యింది. రామ రాజ్యము మరియు రావణ రాజ్యము గురించి ఎంత సహజమైన పద్ధతిలో అర్థం చేయిస్తానో చూడండి. చిన్న-చిన్న పిల్లలకు కూడా ఇలా చెప్పాలి. ఆ తర్వాత ఏమి జరిగింది? బంగారము, వజ్ర-వైఢూర్యాలతో కూడిన పెద్ద-పెద్ద మహళ్ళు భూకంపాలలో లోపలికి వెళ్ళిపోయాయి. భారతవాసులు వికారులుగా అవ్వడం వలనే భూకంపాలు వచ్చాయి, ఆ తర్వాత రావణ రాజ్యము ప్రారంభమయ్యింది, పవిత్రుల నుండి అపవిత్రులైపోయారు. బంగారు లంక లోపలికి వెళ్ళిపోయిందని అంటారు కూడా. ఎంతోకొంత మిగిలి ఉంటుంది కదా, దానితోనే మందిరాలు మొదలైనవి నిర్మించి ఉండవచ్చు. భక్తి మార్గము ప్రారంభమయ్యింది మరియు మనుష్యులు వికారులుగా అవ్వడము మొదలుపెట్టారు. ఇక రావణ రాజ్యము కొనసాగడముతో ఆయుష్షు కూడా తగ్గిపోయింది. మనము నిర్వికారీ యోగుల నుండి వికారీ భోగులుగా అయిపోయాము, యథా రాజా-రాణి తథా ప్రజా, అందరూ వికారులుగా అయిపోయారు. ఈ కథ ఎంత సహజమైనది. చిన్న-చిన్న కన్యలు కూడా ఈ కథను వినిపించినట్లయితే, పెద్ద-పెద్ద వ్యక్తులు తల దించుకుంటారు. ఇప్పుడు తండ్రి కూర్చుని వినిపిస్తున్నారు, వారే జ్ఞానసాగరుడు, పతిత-పావనుడు. అచ్ఛా, ద్వాపరములో భోగులుగా, పతితులుగా అయిపోయారు, ఆ తర్వాత ఇతర ధర్మాలు కూడా ప్రారంభమవుతూ వచ్చాయి. అమృతము యొక్క నషా ఏదైతే ఉండేదో, అది సమాప్తమైపోయింది. కొట్లాటలు-గొడవలు మొదలయ్యాయి. ద్వాపరము నుండి మొదలుకుని మనము దిగజారుతూ వచ్చాము, కలియుగములో మనము ఇంకా వికారులుగా అయిపోయాము. హనుమాన్, గణేష్... మొదలైనవారి రాతి మూర్తులను తయారుచేస్తూ వచ్చాము. రాతి బుద్ధి కలవారిగా అవ్వడము మొదలయ్యింది కావున రాతి పూజను చేయడము మొదలుపెట్టారు. భగవంతుడు రాయి-రప్పలలో ఉన్నారని భావించేవారు. ఇలా చేస్తూ-చేస్తూ భారత్ పరిస్థితి ఇలా అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ తండ్రి చెప్తున్నారు - విషాన్ని వదిలి అమృతాన్ని తాగి పవిత్రముగా అవ్వండి మరియు మళ్ళీ రాజ్యాన్ని తీసుకోండి, విషాన్ని వదిలినట్లయితే మీరు మళ్ళీ మనుష్యుల నుండి దేవతలుగా అయిపోతారు. కానీ విషాన్ని వదలరు. విషము కోసం ఎంతగా కొడుతూ ఉంటారు, విసిగిస్తూ ఉంటారు. అందుకే ద్రౌపది పిలిచింది కదా. అమృతము తాగకుండా మనము దేవతలుగా అవ్వలేము కదా అన్నది మీరు అర్థం చేసుకున్నారు. సత్యయుగములోనైతే రావణుడు ఉండనే ఉండడు. తండ్రి అంటారు, ఎప్పటివరకైతే శేష్ఠాచారులుగా అవ్వరో, అప్పటివరకు స్వర్గములోకి రాలేరు. ఎవరైతే శ్రేష్ఠాచారులుగా ఉండేవారో, వారు ఇప్పుడు భ్రష్టాచారులుగా అయ్యారు. ఇప్పుడు మళ్ళీ అమృతాన్ని తాగి శ్రేష్ఠాచారులుగా అవ్వాలి. తండ్రి అంటారు, నన్నొక్కరినే స్మృతి చేయండి. మీరు గీతను మర్చిపోయారా ఏమిటి? గీతను రచించింది నేను కానీ పేరు శ్రీకృష్ణుడిది వేసారు. ఈ లక్ష్మీ-నారాయణులకు ఈ రాజ్యాన్ని ఎవరు ఇచ్చారు? తప్పకుండా భగవంతుడే ఇచ్చి ఉంటారు. ముందు జన్మలో భగవంతుడు రాజయోగాన్ని నేర్పించారు, కానీ పేరు శ్రీకృష్ణుడిది వేసారు. ఈ విషయాలను అర్థం చేయించే ప్రాక్టీస్ చేయాలి. ఇది చాలా సహజమైన కథ. బాబాకు ఎంత సమయము పట్టింది. ఇంత సహజమైన విషయాన్ని కూడా అరగంటలో అర్థం చేసుకోలేరు, అందుకే తండ్రి అంటారు - ఎవరికైనా కేవలం ఒక చిన్న కథను కూర్చుని అర్థం చేయించండి. చేతిలోకి చిత్రాన్ని తీసుకోండి. సత్యయుగములో లక్ష్మీ-నారాయణుల రాజ్యము ఉంటుంది, తర్వాత త్రేతాలో సీతా-రాముల రాజ్యము ఉంటుంది... ఆ తర్వాత ద్వాపరములో రావణ రాజ్యము మొదలైంది. ఇది ఎంత సహజమైన కథ. తప్పకుండా మనమే దేవతలుగా ఉండేవారము, తర్వాత క్షత్రియులుగా, వైశ్యులుగా, శూద్రులుగా అయ్యాము. ఇప్పుడు స్వయాన్ని దేవతలుగా భావించని కారణముగా హిందువులని చెప్పుకుంటారు. ధర్మ శ్రేష్ఠులుగా, కర్మ శ్రేష్ఠులుగా ఉన్నవారు ధర్మ భ్రష్టులుగా, కర్మ భ్రష్టులుగా అయిపోయారు. ఈ విధముగా చిన్న-చిన్న కుమారీలు కూర్చుని భాషణ చేసినట్లయితే, మొత్తము సభ అంతా బాగుంది, బాగుంది అని అంటారు.
బాబా అన్ని సెంటర్ల వారికి వినిపిస్తున్నారు. ఇప్పుడు ఈ పెద్ద-పెద్దవారు నేర్చుకోకపోతే, చిన్న-చిన్న కుమారీలకు నేర్పించండి. కుమారీల పేర్లు కూడా ఉన్నాయి. ఢిల్లీ, బొంబాయిలో చాలా మంచి-మంచి కుమారీలు ఉన్నారు, చదువుకున్నవారు ఉన్నారు. వారైతే లేచి నిలబడాలి. వారు ఎంతో చేయగలరు. ఒకవేళ కుమారీలు లేచి నిలబడినట్లయితే, పేరు ప్రసిద్ధమవుతుంది. షావుకారుల ఇళ్ళల్లో ఉండేవారు, కష్టం మీద ధైర్యము చేస్తారు. వారికి వారి షావుకారుతనము యొక్క నషా ఉంటుంది. కట్నము మొదలైనవి లభిస్తే ఇక అంతే. కుమారీలు వివాహము చేసుకుని నల్ల ముఖము చేసుకుంటారు, అప్పుడు అందరి ముందు తల వంచవలసి ఉంటుంది. తండ్రి ఎంత సహజముగా అర్థం చేయిస్తున్నారు. కానీ పారసబుద్ధి కలవారిగా అవ్వాలి అన్న ఆలోచనే రాదు. ఈ రోజుల్లో చదువుకోనివారు కూడా ఎమ్.పి లుగా, ఎమ్.ఎల్.ఎ లుగా అయ్యారు చూడండి. చదువు ద్వారా ఎలా అవుతారో చూడండి. ఈ చదువైతే చాలా సహజమైనది. దీనిని ఇతరులకు కూడా వెళ్ళి నేర్పించాలి. కానీ శ్రీమతమనుసారముగా నడుచుకోకపోతే చదువుకోరు కూడా. చాలా మంచి-మంచి కుమారీలు ఉన్నారు కానీ వారు వారి నషాలోనే ఉన్నారు. కొంచెం పని చేసి, మేము ఎంతో పని చేసామని అనుకుంటారు. ఇప్పుడింకా చాలా పని చేయాలి. ఈ రోజులలో కుమారీలు ఫ్యాషన్లలోనే ఉంటున్నారు. అక్కడైతే సహజమైన అలంకరణ ఉంటుంది. ఇక్కడైతే ఎంత కృత్రిమమైన అలంకరణను చేసుకుంటూ ఉంటారు. కేవలం జుట్టును అలంకరించుకునేందుకే ఎంత డబ్బును ఖర్చు పెడతారు. ఇదంతా మాయ ఆర్భాటము. మాయా రావణ రాజ్యము పతనమవుతుంది, మళ్ళీ రామ రాజ్యము ఉదయించడము జరుగుతుంది. ఇప్పుడు రామ రాజ్యము స్థాపనవుతుంది. కానీ మీరు శ్రమ అయితే చేయండి కదా, లేదంటే మీరు ఏమవుతారు! ఒకవేళ చదువుకోకపోతే, అక్కడకు వెళ్ళి సాధారణ ప్రజలుగా అవుతారు. నేటి గొప్ప-గొప్ప వ్యక్తులు అక్కడ ప్రజలలోకి వస్తారు. షావుకారులు కేవలం బాగుంది-బాగుంది అని చెప్పి, తమ-తమ వ్యాపారాలలో నిమగ్నమైపోతారు. చాలా బాగా ప్రభావితులవుతారు, ఆ తర్వాత ఏమిటి! ఆఖరికి ఏమి జరుగుతుంది. అక్కడకు వెళ్ళి ప్రజలుగా అవుతారు. ప్రభావితులవ్వడము అనగా ప్రజలుగా అవ్వడము. ఎవరైతే శ్రమిస్తారో, వారు రామ రాజ్యములోకి వస్తారు. వివరణ అయితే చాలా సహజమైనది. ఎవరైనా ఈ కథ యొక్క నషాలో ఉన్నట్లయితే, వారి నావ తీరానికి చేరుతుంది. మనము శాంతిధామములోకి వెళ్తాము, ఆ తర్వాత సుఖధామములోకి వస్తాము. కేవలం స్మృతి చేస్తూ, చేయిస్తూ ఉండాలి, అంతే, అప్పుడే ఉన్నత పదవిని పొందుతారు. చదువు పట్ల అటెన్షన్ పెట్టాలి. చిత్రాలు చేతిలో ఉండాలి. బాబా లక్ష్మీ-నారాయణులను పూజించేవారు, అప్పట్లో వారి చిత్రము జేబులో ఉండేది. చిన్న చిత్రాలు కూడా ఉంటాయి, లాకెట్ లో కూడా ఉంటాయి. వాటి గురించి అర్థం చేయించాలి. వీరు బాబా, వీరి నుండి వారసత్వము లభిస్తుంది. ఇప్పుడు పావనముగా అవ్వండి, తండ్రిని స్మృతి చేయండి. ఈ బ్యాడ్జిలలో ఎంత జ్ఞానము ఉంది. వీటిలో జ్ఞానమంతా ఉంది. వీటిపై అర్థం చేయించడము చాలా సహజము. సెకెండులో తండ్రి నుండి స్వర్గము యొక్క జీవన్ముక్తి వారసత్వము లభిస్తుంది. ఎవరైనా అర్థం చేయిస్తే, వారు జీవన్ముక్తి పదవికి అధికారులుగా అయిపోతారు. ఇకపోతే, చదువు అనుసారముగా ఉన్నత పదవిని పొందుతారు. స్వర్గములోకైతే అసలు వస్తారు కదా, చివరిలోనైనా వస్తారు కదా. వృద్ధి అయితే జరగనున్నది. దేవీ-దేవతా ధర్మము ఉన్నతమైనది, వారు కూడా తయారవుతారు కదా. ప్రజలైతే లక్షల సంఖ్యలో తయారవుతారు. సూర్యవంశీయులుగా అవ్వడములో శ్రమ ఉంది. సేవ చేసేవారే మంచి పదవిని పొందుతారు. వారి పేర్లు కూడా ప్రసిద్ధి చెందాయి - కుమారకా ఉన్నారు, జనక్ ఉన్నారు, వారు సెంటర్లను బాగా సంభాళిస్తున్నారు. ఎటువంటి గొడవలు లేవు.
తండ్రి అంటారు - చెడు చూడవద్దు, చెడు మాట్లాడవద్దు. అయినా అటువంటి మాటలను మాట్లాడుతూ ఉంటారు. అలాంటివారు అక్కడికి వెళ్ళి ఏమవుతారు. ఇంత సహజమైన సేవను కూడా చేయరు. చిన్న-చిన్న కుమారీలు కూడా అర్థం చేయించగలరు, వినిపించగలరు. వానర సైన్యము కూడా ప్రసిద్ధమైనది. రావణుడి జైలులో చిక్కుకుని ఉన్న సీతలను విడిపించాలి. కథలైతే ఏవేవో తయారుచేసేసారు. ఈ విధముగా ఎవరైనా భాషణ చేయాలి. భాషణ చేసిన తర్వాత కుమారీలు ఏమని చెప్తూ ఉంటారంటే - ఫలానావారు చాలా ప్రభావితులయ్యారు అని. అయితే, మీరు ఏమవ్వాలనుకుంటున్నారు అని వారిని అడగండి. వారు ఇతరులకు - వీరి జ్ఞానము చాలా బాగుందని కేవలం ఇంతే చెప్తారు. వారు స్వయము ఏమీ అర్థం చేసుకోరు. దాని వలన లాభమేముంది. అచ్ఛా!
మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. పారసబుద్ధి కలవారిగా అయ్యేందుకు చదువు పట్ల పూర్తి ధ్యానముంచాలి. శ్రీమతమనుసారముగా చదువుకోవాలి మరియు చదివించాలి. హద్దు సంపదల నషాను, ఫ్యాషన్లు మొదలైనవాటిని వదిలి, ఈ అనంతమైన సేవలో నిమగ్నమవ్వాలి.
2. చెడు వినవద్దు, చెడు చూడవద్దు... ఎలాంటి వ్యర్థమైన విషయాలు మాట్లాడకూడదు. ఎవరిపైనా ప్రభావితులవ్వకూడదు. అందరికీ సత్యనారాయణుని చిన్న కథను వినిపించాలి.
వరదానము:-కొత్త జీవితము యొక్క స్మృతితో కర్మేంద్రియాలపై విజయము ప్రాప్తి చేసుకునే మరజీవా భవ
ఏ పిల్లలైతే పూర్తిగా మరజీవాగా అయ్యారో, వారికి కర్మేంద్రియాల ఆకర్షణ ఉండదు. మరజీవాగా అయ్యారు అనగా అన్ని వైపుల నుండి మరణించారు, పాత ఆయువు సమాప్తమయింది. కొత్త జన్మ జరిగినప్పుడు కొత్త జన్మలో, కొత్త జీవితములో కర్మేంద్రియాలకు ఎలా వశమవ్వగలరు? బ్రహ్మాకుమార, కుమారీల కొత్త జీవితములో - అసలు కర్మేంద్రియాలకు వశమవ్వడమంటే ఏమిటి అనే జ్ఞానానికి కూడా అతీతముగా ఉండాలి. కొద్దిగా కూడా శూద్రత్వపు శ్వాస అనగా సంస్కారము లోపల ఎక్కడా ఆ శ్వాస మిగిలి ఉండిపోకూడదు.
స్లోగన్:-అమృతవేళ హృదయములో పరమాత్ముని స్నేహాన్ని ఇముడ్చుకున్నట్లయితే ఇంకే స్నేహము ఆకర్షించలేదు.
అవ్యక్త ప్రేరణలు - ‘‘మహానులుగా అయ్యేందుకు మధురత మరియు నమ్రత గుణాలను ధారణ చేయండి’’
సంగఠనలో సఫలతను ప్రాప్తి చేసుకునేందుకు సదా నమ్రచిత్తము అనే సింహాసనముపై విరాజమానమై ఉండండి. ఈ సింహాసనముపైనే కూర్చుని, బాధ్యత అనే కిరీటాన్ని ధారణ చేసి భవిష్య పదవిని తయారుచేసుకోండి. సింహాసనముపై నుండి దిగకండి, దానిపైనే కూర్చుని పని చేయండి, అప్పుడు సఫలత లభిస్తూ ఉంటుంది. దీని కొరకు ‘ముందు మీరు’ అన్న పాఠము పక్కాగా ఉండాలి, దీని ద్వారా మీ సంస్కారాలు అందరితోనూ సహజముగానే కలిసిపోతాయి.
"

