ShareChat
click to see wallet page
search
పోలీసులే ప్రజలకు ఆదర్శం – భద్రతలో రాజీకి తావులేదు : జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి, ఐపీఎస్ మహబూబ్నగర్ రూరల్ సర్కిల్ పరిధిలోని పోలీసు సిబ్బందికి హెల్మెట్ల పంపిణీ కార్యక్రమం ఏనుగొండలోని ఓం కన్వెన్షన్ హాల్‌లో ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి, ఐపీఎస్ గారు ముఖ్య అతిథిగా హాజరై సిబ్బందికి హెల్మెట్లను అందజేశారు. ఈ కార్యక్రమం రూరల్ సర్కిల్ సబ్ ఇన్స్పెక్టర్ల ప్రోత్సాహంతో నిర్వహించబడింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ – పోలీసు సిబ్బంది తమ భద్రతపై అత్యంత శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. హెల్మెట్ ధరించడం ద్వారా ప్రాణాపాయం నుండి రక్షణ పొందవచ్చని, అలాగే కార్లు నడిపేటప్పుడు సీట్ బెల్ట్ తప్పనిసరిగా వినియోగించాలని సూచించారు. జిల్లా ఎస్పీ గారు సిబ్బందికి ఇచ్చిన ముఖ్య సూచనలు: ప్రతి పోలీసు విధుల్లో ఉన్నప్పుడు మాత్రమే కాకుండా, వ్యక్తిగత ప్రయాణాల్లో కూడా హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, నాలుగు చక్రాల వాహనదారులు సీట్ బెల్ట్ వినియోగాన్ని కచ్చితంగా పాటించాలి. పోలీసుల ప్రవర్తనే ప్రజలకు మార్గదర్శకం అవుతుంది; అందువల్ల నియమ నిబంధనలను ముందుగా మనమే కచ్చితంగా అమలు చేయాలి. రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు పోలీసు సిబ్బంది చురుకుగా పనిచేయాలి. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంలో ఎలాంటి రాజీ పడకూడదు. విధుల్లో అప్రమత్తంగా ఉండటం ద్వారా ప్రమాదాలను నివారించడం సాధ్యమవుతుంది. “పోలీసులే ప్రజలకు రోల్ మోడల్‌గా నిలిస్తే, సమాజం మొత్తం నిబంధనలు పాటించే దిశగా ముందుకు సాగుతుంది” అని జిల్లా ఎస్పీ గారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎన్.బి.రత్నం, డీఎస్పీ వెంకటేశ్వర్లు, DCRB డీఎస్పీ రమణారెడ్డి, రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గాంధీ నాయక్, వన్ టౌన్ ఇన్స్పెక్టర్ అప్పయ్య, టూ టౌన్ ఇన్స్పెక్టర్ ఇజాజుద్దీన్, జడ్చర్ల టౌన్ ఇన్స్పెక్టర్ కమలాకర్, భూత్పూర్ సీఐ రామకృష్ణ, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ మోతిరామ్ మరియు రూరల్ సర్కిల్‌కు చెందిన సబ్ ఇన్స్పెక్టర్లు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. #MahabubnagarPolice #📰 వార్తలు
📰 వార్తలు - Ye ARRIVE ALIVE ಶಮೆಮ IPS Ye ARRIVE ALIVE ಶಮೆಮ IPS - ShareChat