ShareChat
click to see wallet page
search
#ఏపి న్యూస్ ఏపీ పాలిటెక్స్🎯 #చంద్రబాబు *బాబుపై ప్రజలకెంత కోపం వుండాలో❗* JUNE 8, 2026🎯 టీడీపీ, జనసేనలో రాజ్యసభ సీట్ల రచ్చ ఓ రేంజ్లో వుంది. అయితే అసంతృప్తవాదులంతా కడప టీడీపీ నేత శ్రీనివాస్ రెడ్డి మాదిరిగా బయట పడడం లేదు. ఎందుకంటే, ఇంకా కూటమి అధికారం మూడేళ్ల పాటు వుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం నష్టపోయిన దాని కంటే, మూడేళ్లలో మరింత పోగొట్టుకోవాల్సి వస్తుందనే భయం……… అసంతృప్తి నోటికి కళ్లెం వేసింది. ఇదే సందర్భంలో నాణేనికి రెండో వైపు కూడా టీడీపీ పెద్దలు తెలుసుకోవాల్సిన అవసరం వుంది. కడప లాంటి ప్రత్యేక రాజకీయ పరిస్థితులు నెలకున్న చోట వైసీపీకి ఎదురొడ్డి నిలిచానని, ఆర్థికంగా, ఇతరత్రా కూడా ఎంతో వెచ్చించానని, మాట ఇచ్చి తప్పారని, తన జీవితంలో అత్యంత బాధాకరమని శ్రీనివాన్రెడ్డి ఆవేదనంతా వెళ్లగక్కారు. ఇక్కడ హామీ లేదా మాట ఇచ్చి తప్పడాన్ని నాయకుల్లో ఎంత ఆవేదన, ఆగ్రహం సృష్టించిందో చంద్రబాబు, లోకేశ్, పవన్కల్యాణ్ గమనించాలి. ఇదే రీతిలో ప్రజలు కూడా ఆలోచిస్తుంటారని ముగ్గురు ముఖ్య నాయకులు గుర్తు పెట్టుకోవాలి. ఎన్నికల ముందు సామాన్య ప్రజలకు, అలాగే ప్రభుత్వ ఉద్యోగులు, నిరుద్యోగ యువతకు చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఇవ్వని హామీ అంటూ లేదు. ఆకాశం నుంచి చంద్రుడిని తీసుకొచ్చి మీ చేతుల్లో పెడతామని కూటమి నేతలు ఎన్నికల ముందు నమ్మబలికారు. అయితే కూటమి పాలన రెండేళ్లు పూర్తి చేసుకుంటున్న తరుణంలో వాటిలో ఎన్ని హామీలను నెరవేర్చారో ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన బాధ్యత పాలకులపై వుంది. మరీ ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు, నిరుద్యోగ యువత ప్రభుత్వంపై తీవ్రంగా రగిలిపోతున్నారు. పీఆర్సీ, ఐఆర్, సరెండర్ లీవ్స్, డీఏలు, ప్రభుత్వం బకాయి పడ్డ సొమ్ము తదితర సమస్యలపై ఉద్యమ బాట పట్టేందుకు ఉద్యోగులు తాజాగా హెచ్చరిక జారీ చేశారు. ఉద్యోగులు చాలా కోపంగా ఉన్న వాస్తవాన్ని సంబంధిత నాయకులు బయట పెట్టారు. అలాగే నిరుద్యోగులకు ప్రతినెలా రూ.3 వేలు చొప్పున ఇస్తామన్న హామీ ఏమైందో ఎవరికీ తెలియదు. తల్లికి వందనం పథకాన్ని ఇంట్లో ఎంత మంది విద్యార్థులుంటే అందరికీ అమలు చేస్తామన్న హామీ సగం మాత్రమే నెరవేరుతోంది. సీబీఎస్ఈ సిలబస్ చదువుతున్న 11వ తరగతి విద్యార్థులకు పథకం అందడం లేదు. అలాగే 18-59 సంవత్సరాల మధ్య వయసున్న మహిళలకు ప్రతి నెలా రూ. 1500 ఇస్తామన్న హామీ అటకెక్కింది. ఇక పింఛన్ల కోసం రెండేళ్లుగా ఎదురు చూపే తప్ప, ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి స్పందన రాలేదు. అలాగే పింఛన్లు తొలగింపు మాత్రం సక్సెస్ఫుల్గా సాగింది. ఇలా అనేక హామీల్ని ప్రభుత్వం నెరవేర్చలేదు. తమ నాయకులకు పదవుల హామీ ఎలాగో, ప్రజలకు సంక్షేమ పథకాలు, ఇతరత్రా భరోసా కూడా అలాంటిదే అని పాలకులు గుర్తించుకోవాలి. పదవులు దక్కకపోతే నాయకులు ఏ రకంగా తీవ్ర ఆగ్రహావేశాలకు గురి అవుతారో, ప్రజలు కూడా తాము మోసపోయామని భావిస్తే, బుద్ధి చెప్పడానికి సమయం కోసం ఎదురు చూస్తుంటారు. ఇందులో రెండో మాటకే చోటు వుండదు. కూటమి నేతలు ఎన్నికల సమయంలో ఆకాశమే హద్దుగా హామీలిచ్చి, ఓట్లు వేయించుకుని, గద్దెనెక్కి పబ్బం గడుపుకున్నారని ఇప్పుడిప్పుడే ప్రజలు ఆగ్రహిస్తున్నారు. ఇది ఇంతింతై అన్నట్టు, మరో మూడేళ్లు గడిచే సరికి తీవ్ర కోపంగా మారే ప్రమాదం వుంది. అందుకే హామీల విషయంలో ఇప్పటికైనా కూటమి పాలకులు సీరియస్గా ఆలోచించాలి. మాట నిలబెట్టుకోకపోతే, సొంత నాయకులైనా, ప్రజలైనా ఆగ్రహిస్తారనే చేదు నిజాన్ని గమనంలో పెట్టుకోవాలి. రాజకీయ అవసరం గడిచిందని, ఇక వారితో పనిలేదని పాలకులు అనుకుంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వుంటుంది. ఇప్పటికే వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు తదితర వర్గాల కోపాగ్నికి ప్రభుత్వం గురైంది. అది పెరిగి పెద్దదైతే, చావు దెబ్బతినడం ఖాయం. ఇక సామాన్య ప్రజలకు ఆశ చూపి, చివరికి అడియాస మిగిల్చిన వైనాన్ని పాలకులు తమ సౌకర్యం కొద్ది మరిచిపోయి వుండొచ్చు. కానీ తమ కడుపు కొట్టారని పేదలు ఎప్పుడూ గుర్తించుకుంటారు. అదొక్కటీ గమనంలో పెట్టుకుంటే, ఇప్పటికైనా సరైన నిర్ణయాలు పాలకులు తీసుకుంటారు.
ఏపి న్యూస్ ఏపీ పాలిటెక్స్🎯 - ShareChat