తెలంగాణ లో యుద్దానికి సిద్ధం చేస్తున్నా తెలుగుదేశం
ఘనంగా తెలంగాణ తెలుగుదేశం పార్టీ మహబూబ్నగర్ పార్లమెంట్ స్థాయి ముఖ్య నాయకుల సమావేశం
ఈరోజు తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మహబూబ్నగర్ పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల ముఖ్య నాయకుల సమావేశం ఘనంగా నిర్వహించబడింది. షాద్నగర్ నియోజకవర్గ కేంద్రంలోని వి-కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ఈ సమావేశానికి పార్టీ పోలిట్బ్యూరో సభ్యులు శ్రీ బక్కని నర్సింహులు అధ్యక్షత వహించారు.
ఈ కార్యక్రమానికి పార్టీ పోలిట్బ్యూరో సభ్యులు శ్రీ అరవింద్ కుమార్ గౌడ్, మాజీ రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షులు శ్రీ సామా భూపాల్ రెడ్డి, మాజీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ నెల్లూరు దుర్గా ప్రసాద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మహబూబ్నగర్ పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
సమావేశంలో పార్టీ బలోపేతం, గ్రామస్థాయి నుంచి పార్టీ కార్యకలాపాల విస్తరణ, భవిష్యత్ కార్యాచరణ, ప్రజా సమస్యలపై పోరాట కార్యక్రమాలు తదితర అంశాలపై నాయకులు విస్తృతంగా చర్చించారు. రానున్న రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేసి ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సమిష్టిగా పనిచేయాలని నాయకులు పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి ప్రజల్లో మంచి ఆదరణ ఉందని, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని సూచించారు.
– టీటీడీపీ
షాద్నగర్ ముఖ్య నాయకులు చల్ల వెంకటేశ్వర్ రెడ్డి కుమార్ గౌడ్ మహబూబ్నగర్ బాలప్ప సాయి అన్న గౌడ్ దేవరకద్ర జనార్ధన్ నాయుడు కిషన్ నాయక్ మక్తల్ అశోక్ అడ్వకేట్ ఎస్టిడి శ్రీనివాస్ నారాయణపేట ఓం ప్రకాష్ రాములు యాదవ్ కొడంగల్ వెంకటప్రసాద్ అచ్యుతారెడ్డి జడ్చర్ల పెండ్యాల రాజేష్
#iTDPTelangana #TDPTelangana #iTDPCatalyst #🎯AP రాజకీయాలు #📰ప్లాష్ అప్డేట్స్ #📰ఆంధ్రా వాయిస్ #✊నారా లోకేష్ #🏛️రాజకీయాలు


