ప్రజా సమస్యలపై వెంటనే స్పందన – సమర్థ పాలనకు మార్గదర్శి: ఎమ్మెల్యే జారె ఆదినారాయణ
27 ఏప్రిల్ 2026 – సోమవారం
చండ్రుగొండ మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో కాంగ్రెస్ ప్రభుత్వ 99 రోజుల కార్యాచరణలో భాగంగా గ్రామ పంచాయతీ సర్పంచులు, వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించబడింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జారె ఆదినారాయణ గారు ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు చురుకుగా వ్యవహరించాల్సిన అవసరాన్ని స్పష్టం చేశారు.
ప్రజలకు అందే త్రాగునీటి సరఫరా, ధాన్యం కొనుగోలు, పౌర సరఫరాలు, పంచాయతీ రాజ్ & గ్రామీణాభివృద్ధి వంటి కీలక సేవల్లో ఎలాంటి అలసత్వం లేకుండా బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ముందుకు సాగితేనే మండల అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
ప్రత్యేకంగా వేసవికాలాన్ని దృష్టిలో ఉంచుకుని తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, ఎక్కడైనా నీటి సరఫరాలో అంతరాయం కలిగితే వెంటనే స్పందించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో ఎంపీడీఓ అశోక్ కుమార్, ఎంఆర్ఓ జగదీష్ ప్రసాద్, అటవీ, పోలీస్ శాఖల అధికారులు, పంచాయతీ కార్యదర్శులు మరియు ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు. #🏛️రాజకీయాలు #🌍నా తెలంగాణ #🔹కాంగ్రెస్ #కాంగ్రెస్ పార్టీ తెలంగాణ #కాంగ్రెస్


