వాగ్దేవి సాహితీ వేదిక కవితలు పోటీ కోసం
అంశం : ఐఛ్ఛికం
శీర్షిక : కవిత్వం
ఆశ ఫలించి ఉప్పొంగే ఉత్సాహం
ఉరుముల ఒంట్లోకి వచ్చేస్తే
దేహం మబ్బుల్లో తేలిపోతే
అక్షరాల పదనిసలు గళం నుంచి
అవలోలకగా వెలువడుతుంటే
తెల్లని కాగితం మెత్తని పువ్వుల్లాగా
చుట్టేసింది.
పకృతి ఇంటికి ఆహ్లాదం వచ్చినప్పుడు
పారవశ్యం మనసు తలుపు తట్టింది
పదాలు వాన కురిపించింది
కవిత్వం రాసే కలం వడుపుగా
అ సౌందర్యాన్ని పొట్లాలు కట్టేసింది.
మదిలో దైవ స్మరణ
దివ్య మంత్రాలై
రాలి పడుతుంటే,
ప్రసాదంగా భక్త సందోహానికి
పంచి పెట్టడానికి
అక్షరం కీర్తనలుగా
తాళ పత్రాలపై రాసి పెట్టింది.
మారిపోయే కాలాన్ని
మారని అక్షరముతో
ఊరగాయ పెట్టి
జ్ఞాపకాల అరల్లో భద్రపరిచింది,
సాంప్రదాయం స్ఫురణకు రానప్పుడు
తీసి వడ్డించుకోవడానికి.
చక్కని చుక్క
చూపుల సైగలతో
మనసు వీణను మీటితే
మధురంలో ములిగింది మనసు,
వలపు తుంపర్లు దేహాన్ని తడుపుతుంటే
పొంగిన అక్షరాలను
కూని రాగం తీసాయి
కోకిల స్వరంతో ప్రేమ పక్షులు.
కష్టం కన్నీటితో వికృతి క్రీడా చేసిన
ముసురు కప్పిన విషాదం
జ్ఞాపకమై తరుచుగా వేదించింది,
కాలగర్భంలో కలిసిపోకుండా
కవిత్వమై పుస్తకాల్లో దాక్కుని.
మల్లిన వీర వెంకట గణపతి
తోర్రేడు, రాజమహేంద్రవరం. #✍️కవితలు


