ShareChat
click to see wallet page
search
#🎶భక్తి పాటలు🔱 #📙ఆధ్యాత్మిక మాటలు #🕉️ గణపతి బప్పా మోరియా #🇮🇳 మన దేశ సంస్కృతి 15-04-2026 ప్రాత:మురళిఓంశాంతి"బాప్ దాదా" మధువనం ‘‘మధురమైన పిల్లలూ - మీ స్వధర్మము శాంతి, సత్యమైన శాంతి శాంతిధామములో లభించగలదు, ఈ విషయాన్ని అందరికీ వినిపించాలి, స్వధర్మములో ఉండాలి’’ ప్రశ్న:-ఏ జ్ఞానము ఒక్క తండ్రి వద్ద మాత్రమే ఉంది, దానిని మీరు ఇప్పుడు మాత్రమే చదువుకుంటారు? జవాబు:-పాప-పుణ్యాల జ్ఞానము. భారతవాసులు ఎప్పుడైతే తండ్రిని నిందించడము మొదలుపెడతారో, అప్పుడు పాపాత్ములుగా అవుతారు మరియు ఎప్పుడైతే తండ్రిని మరియు డ్రామాను తెలుసుకుంటారో, అప్పుడు పుణ్యాత్ములుగా అవుతారు. ఈ చదువును పిల్లలైన మీరు ఇప్పుడే చదువుకుంటారు. అందరికీ సద్గతినిచ్చేవారు ఒక్క తండ్రి మాత్రమేనని మీకు తెలుసు. మనుష్యులు, మనుష్యులకు సద్గతిని అనగా ముక్తి-జీవన్ముక్తులను ఇవ్వలేరు. పాట:-ఈ పాపపు ప్రపంచము నుండి... ▶ ఓంశాంతి. తండ్రి కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు - ఇది పాపాత్ముల ప్రపంచము, భారత్ పుణ్యాత్ముల ప్రపంచముగా ఉండేదని, అక్కడ దేవీ-దేవతల రాజ్యముండేదని భారత్ కోసమే చెప్తారు. ఈ భారత్ సుఖధామముగా ఉండేది, ఆ సమయములో ఇతర ఖండాలేవీ ఉండేవి కావు, ఒక్క భారత్ మాత్రమే ఉండేది. ప్రశాంతత మరియు సుఖము ఆ సత్యయుగములో ఉండేవి, దానిని స్వర్గమని అంటారు. ఇది నరకము. భారత్ యే స్వర్గముగా ఉండేది, ఇప్పుడు నరకముగా తయారయ్యింది. నరకములో ప్రశాంతత మరియు సుఖ-శాంతులు ఎక్కడి నుండి వస్తాయి. కలియుగాన్ని నరకము అని అంటారు. కలియుగ అంతిమాన్ని మరింత రౌరవ నరకము అని అనడము జరుగుతుంది, దుఃఖధామము అని అనడము జరుగుతుంది. లక్ష్మీ-నారాయణుల రాజ్యము ఉన్నప్పుడు భారత్ యే సుఖధామముగా ఉండేది. ఆ సమయములో భారతవాసుల గృహస్థ ధర్మము పవిత్రముగా ఉండేది. పవిత్రత కూడా ఉండేది, సుఖ-శాంతులు కూడా ఉండేవి, అపారమైన సంపద కూడా ఉండేది. ఇప్పుడు ఆ భారత్ యే పతితముగా అయ్యింది, అందరూ వికారులుగా అయ్యారు. ఇది దుఃఖధామము. భారత్ సుఖధామముగా ఉండేది మరియు ఎక్కడైతే ఆత్మలమైన మనము నివాసముంటామో - అది శాంతిధామము. శాంతి ఆ శాంతిధామములోనే లభించగలదు. ఆత్మ శాంతిగా అక్కడ మాత్రమే ఉండగలదు, దానిని స్వీట్ హోమ్ (మధురమైన ఇల్లు), నిరాకారీ ప్రపంచము అని అంటారు. అది ఆత్మల ఇల్లు. అక్కడ ఉన్నప్పుడు ఆత్మ శాంతిలో ఉంటుంది. అంతేకానీ, శాంతి అడవులకు వెళ్ళినంత మాత్రాన ఏమీ లభించదు. శాంతిధామమైతే అదే. సత్యయుగములో సుఖము కూడా ఉంటుంది, శాంతి కూడా ఉంటుంది. ఇక్కడ దుఃఖధామములో శాంతి ఉండదు. శాంతి శాంతిధామములో లభిస్తుంది. సుఖధామములో కూడా కర్మలు జరుగుతాయి, శరీరము ద్వారా పాత్రను అభినయించవలసి ఉంటుంది. ఈ దుఃఖధామములో సుఖ-శాంతులు ఉన్న మనుష్యులు ఒక్కరు కూడా లేరు. ఇది భ్రష్టాచారీ పతితధామము, అందుకే పతిత-పావనుడిని పిలుస్తారు. కానీ ఆ తండ్రి గురించి ఎవరికీ తెలియదు, అందుకే అనాథలుగా అయిపోయారు. అనాథలుగా అయిన కారణముగా పరస్పరములో కొట్లాడుకుంటూ-గొడవపడుతూ ఉంటారు. ఎంత దుఃఖము-అశాంతి, కొట్లాటలు ఉన్నాయి. ఇది ఉన్నదే రావణ రాజ్యము. రామ రాజ్యాన్ని కోరుకుంటారు. రావణ రాజ్యములో సుఖము లేదు, శాంతి లేదు. రామ రాజ్యములో సుఖము, శాంతి రెండూ ఉండేవి. అక్కడ పరస్పరములో ఎప్పుడూ కొట్లాడుకునేవారు కాదు, గొడవపడేవారు కాదు, అక్కడ 5 వికారాలు ఉండనే ఉండవు. ఇక్కడ 5 వికారాలు ఉన్నాయి. వాటిలో మొదట దేహాభిమానము ముఖ్యమైనది. ఆ తర్వాత కామము, క్రోధము. భారత్ స్వర్గముగా ఉన్నప్పుడు ఈ వికారాలు ఉండేవి కావు. అక్కడ దేహీ-అభిమానులుగా ఉండేవారు. ఇప్పుడు మనుష్యులందరూ దేహాభిమానులుగా ఉన్నారు. దేవతలు దేహీ-అభిమానులుగా ఉండేవారు. దేహాభిమానము కల మనుష్యులు ఎప్పుడూ ఎవరికీ సుఖాన్ని ఇవ్వలేరు. ఒకరికొకరు దుఃఖాన్నే ఇచ్చుకుంటారు. ఎవరైనా లక్షాధికారులుగా, కోటీశ్వరులుగా, పదమపతులుగా ఉన్నంత మాత్రాన వారు సుఖముగా ఉన్నారని అనుకోకండి. అలా కాదు. అదంతా మాయ ఆర్భాటము. ఇది మాయ రాజ్యము. ఇప్పుడు దీని వినాశనము కోసం ఈ మహాభారత యుద్ధము ఎదురుగా నిలబడి ఉంది. దీని తర్వాత మళ్ళీ స్వర్గ ద్వారాలు తెరుచుకోనున్నాయి. అర్ధకల్పము తర్వాత మళ్ళీ నరక ద్వారాలు తెరుచుకుంటాయి. ఈ విషయాలు ఏ శాస్త్రాలలోనూ లేవు. భక్తి చేసినప్పుడు భగవంతుడు లభిస్తారని భారతవాసులు అంటారు. బాబా అంటారు - ఎప్పుడైతే భక్తి చేస్తూ-చేస్తూ పూర్తిగా కిందకు వచ్చేస్తారో, అప్పుడు స్వర్గ స్థాపన చేయడానికి అనగా భారత్ ను స్వర్గముగా తయారుచేయడానికి నేను రావలసి ఉంటుంది. స్వర్గముగా ఉన్న భారత్ నరకముగా ఎలా తయారయ్యింది? రావణుడు తయారుచేశాడు. గీతా భగవానుడి ద్వారా మీకు రాజ్యము లభించింది, 21 జన్మలు స్వర్గములో రాజ్యము చేసారు. ఆ తర్వాత భారత్ ద్వాపరము నుండి కలియుగములోకి వచ్చింది, అనగా దిగే కళ ఏర్పడింది, అందుకే ఓ పతిత-పావనా రండి అని అందరూ పిలుస్తూ ఉంటారు. పతిత మనుష్యులకు పతిత ప్రపంచములో సుఖ, శాంతులు లభించనే లభించవు. వారు ఎంత దుఃఖాన్ని అనుభవిస్తారు. ఈ రోజు డబ్బు దొంగలించబడుతుంది, మరొక రోజు దివాలా తీస్తారు, ఇంకొక రోజు రోగగ్రస్థులుగా అవుతారు. అంతా దుఃఖమే దుఃఖము కదా. ఇప్పుడు మీరు సుఖ-శాంతుల వారసత్వాన్ని పొందేందుకు పురుషార్థము చేస్తున్నారు, తండ్రి నుండి స్వర్గ వారసత్వాన్ని తీసుకునేందుకు పురుషార్థము చేస్తున్నారు. సదా సుఖమయముగా చేసేవారు ఒక్క తండ్రి మాత్రమే. సదా దుఃఖమయముగా చేసేది రావణుడు. ఈ విషయాలు భారతవాసులకు తెలియదు. సత్యయుగములో దుఃఖపు విషయాలు ఉండవు. ఎప్పుడూ ఏడవవలసిన అవసరముండదు. సదా సుఖమే సుఖముంటుంది. అక్కడ దేహాభిమానము లేదా కామము, క్రోధము మొదలైనవి ఉండవు. ఎప్పటివరకైతే 5 వికారాలను దానమివ్వరో, అప్పటివరకు దుఃఖము యొక్క గ్రహణము తొలగదు. దానము ఇచ్చినట్లయితే గ్రహణము తొలగిపోతుందని అంటారు కదా. ఈ సమయములో మొత్తం భారత్ కు 5 వికారాల గ్రహణము పట్టి ఉంది. ఎప్పటివరకైతే ఈ 5 వికారాలను దానమివ్వరో, అప్పటివరకు 16 కళల సంపూర్ణ దేవతలుగా అవ్వలేరు. తండ్రి సర్వుల సద్గతిదాత. గురువు లేకుండా గతి లభించదని అంటారు. కానీ, గతి అనే మాట యొక్క అర్థాన్ని కూడా అర్థం చేసుకోరు. మనుష్యుల గతి-సద్గతి అనగా ముక్తి-జీవన్ముక్తి. అవి తండ్రి మాత్రమే ఇవ్వగలరు. ఈ సమయములో సర్వుల సద్గతి జరుగనున్నది. ఢిల్లీని కొత్త ఢిల్లీ, పాత ఢిల్లీ అని అంటారు. కానీ ఇప్పుడైతే అది కొత్తగా లేదు. కొత్త ప్రపంచములో కొత్త ఢిల్లీ ఉంటుంది. పాత ప్రపంచములో పాత ఢిల్లీ ఉంటుంది. తప్పకుండా యమునా నది తీరము ఉండేది, ఢిల్లీ పరిస్తాన్ (స్వర్గము) గా ఉండేది. సత్యయుగము ఉండేది కదా. అక్కడ దేవీ-దేవతలు రాజ్యము చేసేవారు. ఇప్పుడైతే పాత ప్రపంచములో పాత ఢిల్లీ ఉంది. కొత్త ప్రపంచములోనైతే ఈ లక్ష్మీ-నారాయణుల రాజ్యముండేది. భారతవాసులు ఇది మర్చిపోయారు. కొత్త భారత్, కొత్త ఢిల్లీ ఉన్నప్పుడు వారి రాజ్యముండేది, వేరే ఖండమేదీ ఉండేది కాదు. ఇది ఎవ్వరికీ తెలియదు. గవర్నమెంట్ ఇదంతా చదివించదు. వారు చదివించే హిస్టరీలో మొత్తమంతా లేదని వారికి తెలుసు. వారు చదివించే హిస్టరీలో ఇస్లాములు, బౌద్ధులు వచ్చినప్పటి నుండి ఉన్న విషయాలు ఉన్నాయి. లక్ష్మీ-నారాయణుల రాజ్యము గురించి ఎవ్వరికీ తెలియదు. మొత్తం సృష్టి చక్రము ఎలా తిరుగుతుంది అనేది తండ్రియే కూర్చుని అర్థం చేయిస్తారు. భారత్ స్వర్గముగా ఉన్నప్పుడు బంగారుయుగముగా ఉండేది. ఇప్పుడు ఆ భారత్ యే ఎలా అయిపోయిందో చూడండి. మళ్ళీ భారత్ ను వజ్ర సమానముగా ఎవరు తయారుచేస్తారు? తండ్రి అంటారు, మీరు చాలా పాపాత్ములుగా అయిపోయినప్పుడు మిమ్మల్ని పుణ్యాత్ములుగా చేయడానికి నేను వస్తాను. ఈ డ్రామా తయారై ఉంది, దీని గురించి ఎవరికీ తెలియదు. ఈ జ్ఞానాన్ని తండ్రి తప్ప ఇంకెవ్వరూ ఇవ్వలేరు. నాలెడ్జ్ ఫుల్ ఒక్క తండ్రి మాత్రమే, వారు వచ్చి చదివిస్తున్నారు. మనుష్యులు, మనుష్యులకు ఎప్పుడూ సద్గతిని ఇవ్వలేరు. దేవీ-దేవతలుగా ఉన్నప్పుడు అందరూ ఒకరికొకరు సుఖాన్ని ఇచ్చేవారు. ఎవ్వరూ అనారోగ్యముగా, రోగగ్రస్థులుగా అయ్యేవారు కారు. ఇక్కడైతే అందరూ రోగులే. దీనిని మళ్ళీ స్వర్గముగా తయారుచేయడానికి ఇప్పుడు తండ్రి వచ్చారు. తండ్రి స్వర్గాన్ని తయారుచేస్తారు, రావణుడు నరకాన్ని తయారుచేస్తాడు. ఇది ఒక ఆట, దీని గురించి ఎవ్వరికీ తెలియదు. శాస్త్రాల జ్ఞానము ఫిలాసఫీ, అది భక్తి మార్గము. అదేమీ సద్గతి మార్గము కాదు. ఇదేమీ శాస్త్రాల ఫిలాసఫీ కాదు. తండ్రి ఏ శాస్త్రాలను వినిపించరు. ఇక్కడ ఉన్నది స్పిరిచ్యువల్ నాలెడ్జ్. తండ్రిని స్పిరిచ్యువల్ ఫాదర్ అని అంటారు. వారు ఆత్మల తండ్రి. తండ్రి అంటారు, నేను మనుష్య సృష్టికి బీజరూపుడను కావున నేను నాలెడ్జ్ ఫుల్. ఈ మనుష్య సృష్టి రూపీ వృక్షము యొక్క ఆయువు ఎంత, ఇది ఎలా వృద్ధి చెందుతుంది, ఆ తర్వాత భక్తి మార్గము ఎలా మొదలవుతుంది, ఇదంతా నాకు తెలుసు. పిల్లలైన మీకు ఈ జ్ఞానాన్ని ఇచ్చి స్వర్గానికి యజమానులుగా తయారుచేస్తాను, ఇక మీరు యజమానులుగా అయిపోతారు. ఈ జ్ఞానము మీకు ఒక్కసారి మాత్రమే లభిస్తుంది, తర్వాత మాయమైపోతుంది. మళ్ళీ, సత్య, త్రేతాయుగాలలో ఈ జ్ఞానము యొక్క అవసరముండదు. ఈ జ్ఞానము కేవలం బ్రాహ్మణులైన మీకు మాత్రమే ఉంది. దేవతలలో ఈ జ్ఞానము లేదు. కావున ఈ జ్ఞానము పరంపరగా రాదు. ఇది పిల్లలైన మీకు కేవలం ఒక్కసారి మాత్రమే లభిస్తుంది, దీని ద్వారా మీరు జీవన్ముక్తులవుతారు, తండ్రి నుండి వారసత్వాన్ని పొందుతారు. మీ వద్దకు ఎంతోమంది వస్తారు, మనసుకు శాంతి ఎలా లభిస్తుంది అని అడుగుతారు. కానీ ఇలా అనడము తప్పు. ఎలాగైతే శరీరము యొక్క ఇంద్రియాలు ఉన్నాయో, అలా మనసు-బుద్ధి ఆత్మ యొక్క ఇంద్రియాలు. ఆత్మను రాతిబుద్ధి నుండి పారసబుద్ధి కలదిగా తండ్రియే వచ్చి తయారుచేస్తారు, అది సత్య, త్రేతాయుగాల వరకు కొనసాగుతుంది. మళ్ళీ రాతిబుద్ధి కలవారిగా అయిపోతారు. ఇప్పుడు మీరు మళ్ళీ రాతిబుద్ధి నుండి పారసబుద్ధి కలవారిగా అవుతారు. మీ పారసబుద్ధిలో మాలిన్యము చేరుతూ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ పారసబుద్ధి కలవారిగా ఎలా అవ్వాలి? తండ్రి అంటారు - హే ఆత్మ, నన్ను స్మృతి చేయండి. స్మృతియాత్రతో మీరు పవిత్రముగా అవుతారు మరియు నా వద్దకు వచ్చేస్తారు. ఇకపోతే, మనసుకు శాంతి ఎలా లభిస్తుంది అని ఎవరైతే అడుగుతారో, వారికి ఇలా చెప్పండి - ఇక్కడ శాంతి ఎలా ఉండగలదు, ఇది ఉన్నదే దుఃఖధామము, ఎందుకంటే ఇక్కడ వికారాలు ప్రవేశించి ఉన్నాయి. శాంతి వారసత్వము అనంతమైన తండ్రి నుండి మాత్రమే లభించగలదు. ఆ తర్వాత రావణుడి సాంగత్యము లభించడముతో పతితులుగా అయిపోతారు, మళ్ళీ తండ్రి ద్వారా పావనముగా అయ్యేందుకు ఒక్క క్షణము పడుతుంది. ఇప్పుడు మీరు తండ్రి నుండి జీవన్ముక్తి యొక్క వారసత్వాన్ని తీసుకునేందుకు వచ్చారు. తండ్రి జీవన్ముక్తి యొక్క వారసత్వాన్ని ఇస్తారు మరియు రావణుడు జీవనబంధనము యొక్క శాపాన్ని ఇస్తాడు, అందుకే దుఃఖమే దుఃఖము ఉంది. డ్రామాను కూడా తెలుసుకోవాలి. దుఃఖధామములో ఎవరికీ సుఖ-శాంతులు లభించవు. శాంతి అనేది ఆత్మలమైన మన స్వధర్మము, శాంతిధామము ఆత్మల ఇల్లు. ఆత్మ అంటుంది - నా స్వధర్మము శాంతి, అక్కడ ఈ వాయిద్యాన్ని (శరీరాన్ని) మోగించను, అక్కడ నేను కూర్చుండిపోతాను. కానీ ఎంతవరకని కూర్చుని ఉంటారు. కర్మలైతే చేయవలసిందే కదా. ఎప్పటివరకైతే మనుష్యులు డ్రామాను అర్థం చేసుకోరో, అప్పటివరకు దుఃఖితులుగా ఉంటారు. తండ్రి అంటారు, నేను ఉన్నదే పేదల పెన్నిధిని. ఇక్కడకు పేదలే వస్తారు. షావుకారుల కొరకైతే స్వర్గము ఇక్కడే ఉంది. వారి భాగ్యములో స్వర్గ సుఖము లేదు. తండ్రి అంటారు, నేను పేదల పెన్నిధిని. షావుకారులను పేదవారిగా మరియు పేదవారిని షావుకారులుగా చేస్తాను. షావుకారులు అంతటి ఉన్నత పదవిని పొందలేరు, ఎందుకంటే ఇక్కడ షావుకారులకు నషా ఉంటుంది. అయితే, ప్రజలలోకి వస్తారు. స్వర్గములోకైతే తప్పకుండా వస్తారు. కానీ ఉన్నత పదవిని పేదవారే పొందుతారు. పేదవారు షావుకారులుగా అవుతారు. ధనవంతులకు తాము ధనవంతులమనే దేహాభిమానము ఉంది కదా. కానీ బాబా అంటారు - ఈ ధనము-వస్తువులన్నీ మట్టిలో కలిసిపోనున్నాయి. వినాశనము జరగనున్నది. దేహీ-అభిమానులుగా అవ్వడములో చాలా శ్రమ ఉంది. ఈ సమయములో అందరూ దేహాభిమానులుగా ఉన్నారు. ఇప్పుడు మీరు దేహీ-అభిమానులుగా అవ్వాలి. నేను 84 జన్మలను పూర్తి చేసానని ఆత్మ అంటుంది. నాటకము పూర్తవుతుంది, ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాలి. ఇప్పుడిది కలియుగ అంతిమము మరియు సత్యయుగ ఆది యొక్క సంగమము. తండ్రి అంటారు, నేను ప్రతి 5 వేల సంవత్సరాల తర్వాత భారత్ ను మళ్ళీ వజ్ర సమానముగా తయారుచేయడానికి వస్తాను. ఈ చరిత్ర-భౌగోళికాల గురించి తండ్రి మాత్రమే తెలియజేయగలరు. అచ్ఛా! మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము:- 1. తండ్రి నుండి జీవన్ముక్తి యొక్క వారసత్వాన్ని తీసుకునేందుకు పావనముగా తప్పకుండా అవ్వాలి. డ్రామా జ్ఞానాన్ని బుద్ధిలో ఉంచుకుని దుఃఖధామములో ఉంటూ కూడా దుఃఖాల నుండి ముక్తులుగా అవ్వాలి. 2. ధన, సంపదలు మరియు షావుకారుతనము యొక్క నషాను వదిలి దేహీ-అభిమానులుగా ఉండేందుకు పురుషార్థము చేయాలి. వరదానము:-వికారాల వంశము యొక్క అంశాన్ని కూడా సమాప్తము చేసే సర్వ సమర్పణ మరియు ట్రస్టీ భవ ఎవరైతే సమయానికి పనికొస్తుందని పాత సంస్కారాల ఆస్తిని కొంత పక్కకు తీసి పెట్టుకుంటారో, వారిని మాయ ఏదో ఒక విధముగా పట్టుకుంటుంది. పాత రిజిస్టరుకు సంబంధించిన ఒక చిన్న భాగము మిగిలి ఉన్నా సరే పట్టుబడతారు. మాయ చాలా తీక్షణమైనది, దాని క్యాచింగ్ పవర్ తక్కువేమీ కాదు, అందుకే వికారాల వంశము యొక్క అంశాన్ని కూడా సమాప్తము చేయండి. కొద్దిగా కూడా ఏ మూలలోనూ పాత ఖజానా యొక్క గుర్తు కూడా ఉండకూడదు - అటువంటి వారినే సర్వ సమర్పణులు, ట్రస్టీలు మరియు యజ్ఞ స్నేహీలు, సహయోగులని అంటారు. స్లోగన్:-ఎవరి విశేషత కారణముగానైనా వారి పట్ల విశేషమైన స్నేహము ఏర్పడితే, అది కూడా మోహమే.   అవ్యక్త ప్రేరణలు - ‘‘మహానులుగా అయ్యేందుకు మధురత మరియు నమ్రత గుణాలను ధారణ చేయండి’’ మధురతయే మహానత, దీని ద్వారా మనసు మరియు మాటలలోని చేదుతనము సమాప్తమైపోతుంది, క్రోధాగ్ని శీతలమైపోతుంది. బాప్ దాదా తమ పిల్లలు ప్రతి ఒక్కరినీ శీతల దేవతలుగా తయారుచేయాలని అనుకుంటున్నారు, అందుకే మధురతా గుణాన్ని ధారణ చేయండి. మీ ముఖము కూడా మధురముగా ఉండాలి. మధురతా గుణముతో నిండుగా అవ్వండి, మీ సంపర్కములోకి ఎవరు వచ్చినా సరే వారిని మధురమైన మాటలు మరియు శక్తిశాలి దృష్టితో నిండుగా చేయండి. "