విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో గాయపడి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కార్మికులను మంత్రి నారా లోకేష్ పరామర్శించారు. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, హోంమంత్రి అనిత తదితరులతో కలిసి క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని, మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
#🆕Current అప్డేట్స్📢 #🆕షేర్చాట్ అప్డేట్స్


