బుగ్గన మధుసూదనరెడ్డి, ఎం.బి.ఏ
#💔సంగీత ప్రపంచాన్ని విషాదంలో ముంచిన 'గాన కోకిల'..ఎస్. జానకి కన్నుమూశారు లెజెండరీ గాయని,గాన విశ్వ విద్యాలయంగా,మాయా స్వర పేటిక గా పెరుగాంచిన ఎస్.జానకమ్మ గారు ఇకలేరు! ( 11 - 7 - 2026)!
లేదా
ప్రఖ్యాత గాయని,గానకోకిల ,క్వీన్ ఆఫ్ ఎక్స్ ప్రెషన్ గా తన కంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఎస్ జానకమ్మ గారు దివికేగడంతో తెలుగు పాట అమ్మ లేనిదైనా వైనం!
తేనేలూరు తెలుగు వారి గళ మదుర్యాన్ని అనేక భాషల్లో శ్రోతలకు రుచి చూపించి మన భారతదేశ కీర్తి పతాక ను దశ,దిశలా ఎగురవేసిన స్వర గాన కోకిల ఎస్ జానకి గారు మూగబోయిందన్న వార్త దేశ వ్యాప్తంగా ఉన్న కోట్లాదిమంది సంగీత ప్రియులను తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది అనే మాట అక్షర సత్యం.తన సుమధుర కంఠంతో ఆబాలగోపాలాన్ని ఓలఓల లాడించిన బహుభాషా గాయని ఎస్ జానకమ్మ ( 88) గుండెపోటుతో కన్నుమూయడం అనేది తీవ్ర బాధకు, ఆవేదనకు గురిచేసే విషయం.ముఖ్యంగా భారతీయ సినీ సంగీత ప్రపంచంలో తన అపూర్వ, సమ్మోహనమైన గాన మాధుర్యంతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్న ఎస్ జానకి గారి మరణం యావత్ భారతదేశ సంగీత సినీ ప్రపంచానికే తీరనిలోటు అనడంలో ఎలాంటి సందేహానికి తావులేదు.ఇక జానకమ్మ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టే నాటికి తెలుగు,తమిళ పరిశ్రమలను పి.సుశీల,పి.లీల వంటి గానంలో బాగా తలపండిన ఉద్దండులు సినీ పరిశ్రమను ఏలేవారు.ముఖ్యంగా పి.సుశీల స్వచ్ఛమైన తెలుగు ఉచ్ఛారణ,తిరుగులేని గానం మధ్య వచ్చిన జానకి నిలదోక్కుకోవడం అనేది ఆషామాషి, సామాన్యమైన వ్యవహారం కాదు.కానీ జానకమ్మ తనకంటూ ఓక ప్రత్యేక అస్రాన్ని ఎంచుకున్నారు.అదే వాయిస్ మాడ్యూలేషన్ ఎక్స్ ప్రెషన్.ఇక సుశీల గారు క్లాసిక్ గాంధర్వ గాత్రంతో అలరిస్తే,జానకి ఒకే రోజు రికార్డింగ్ లో అల్లరి,కరుణ,శోకం,శృంగారం పలికించేవారు.అంతేకాదు సుశీల గారితో పోటీని ఈర్ష్యతో కాకుండా తనకే సాధ్యమైన విలక్షణ గొంతు మార్పిడి విద్యతో ఎదుర్కొని ఎవరికీ సాధ్యం కాని క్వీన్ ఆఫ్ ఎక్స్ ప్రెషన్ గా తనకంటూ ఓ ప్రత్యేక సామ్రాజ్యాన్ని లిఖించుకున్నారు ఎస్ జానకమ్మ గారు.అలా తన అమూల్యమైన కెరీర్ కు అత్యంత ఘనంగా అంకురార్పణ గావించిన ఎస్ జానకమ్మ గారు తన అమోఘమైన సంగీత ప్రయాణంలో ఎన్నో హిట్ పాటలకు తన వెలకట్టలేని గాత్రం ద్వారా ఊపిరి పోశారు.వాటిలో ముఖ్యమైనవి ' పిలువకురా ఆడగకురా ', ' పగలే వెన్నెల ', ' నీలి మేఘాలలో గున్న మామిడి ', కొమ్మ మీద, 'నాంపల్లి టేషనుకాడి '.అంతేకాదు సుశీలను ఎంతో అభిమానించే ఎం.ఎస్. విశ్వనాథన్ జానకికి అద్భుతమైన పాటలు తెలుగు, తమిళంలో ఇచ్చారు.' అందమైన లోకమని రంగు రంగు లుంటాయనీ ',కన్నెపిల్లవని వన్నెలున్నవని ' వంటి పాటలు శ్రోతలకు అమితమైన ఇష్టం.మరోవైపు తెలుగులో చక్రవర్తి,రమేష్ నాయుడు తదితర దర్శకులు ఆమెకు ఎక్కువ పాటలు ఇచ్చారు.చక్రవర్తి సంగీత దర్శకత్వంలో పాడిన 'దుర్యోదన దుశ్యాసన ' పాట జాగృతి గీతంలా నిలిచింది.చక్రవర్తి సంగీతంలోనే ' జ్యోతి ' కోసం చేసిన ' సిరిమల్లె పువ్వల్లే నవ్వు ' పాటలో జానకి నవ్వు మరొకరు ఇమిటేట్ చేయలేనిది. రమేష్ నాయుడు సంగీతంలో పాడిన ' సిగ్గు పూబంతి ', అలివేణి ఆణిముత్యమా ' వంటివి క్లాసిక్స్ గా నిలిచాయి .ఇక రాజన్ నాగేంద్రలు ఎస్ జానకితో చాలా పాటలు పాడించారు.' ఆబ్బో నేరేడు పళ్ళు ', కాస్తందుకో ధరఖాస్తందుకో ' వంటి పాటలు ఎంతో మధురంగా,వినసొంపుగా ఉంటాయి.కానీ ఎస్ జానకిని తెలుగువారికి నిజంగా పరిచయం చేసింది మాత్రం ది గ్రేట్ సంగీత దర్శకుడు ఇళయరాజానే.
ఏదిఏమైనా ఎస్ జానకమ్మ గారి గాన ప్రత్యేకత, గొప్పతనం గురించి చెప్పాలంటే ' గోవులు తెల్లన గోపయ్య నల్లన ' పాటను ఆమె చిన్న పిల్లల పాడింది. ఓక తమిళ డబ్బింగ్ కోసం అబ్బాయి గొంతుతో ' పాప పేరు మల్లి,మా ఊరు కొత్త ఢిల్లీ ' పాడింది.ఇక శ్రీవారి శోభనం సినిమాలో ' అలక పానుపు ఎక్కనేల పాటలో పండు ముసలిలా గొంతును ఓణికించింది.ఇక ఆమె ఏది పాడిన భావం హృదయాన్ని తాకుతుంది.ఇళయరాజా గారి సంగీతంలో ' భావన లోక్కటై ' పాటలో బాబూ పాడుతుంటే పాటంతా హం చేస్తుంది జానకి.ఇవాల్టికీ కూడా మరొకరు ఎస్ జానకమ్మలా పాడలేరు అంటే ఆమె గాన శైలి ఎంతటి విభిన్నమైందో ఇట్టే మనం ఊహించవచ్చు.ఏమైనా అన్నింటికి మించి బాలూ జానకిలది అద్భుతమైన గాత్ర ద్వయం.వాళ్ళ డ్యూయెట్ లకు ఫ్యాన్స్ సైతం జాస్తే.' ఏమని నే చెలి పాడుదును ', ఊరకలై గోదావరి ', ' నిరంతరమూ వసంతములే ', ' మాట రాని మౌనమిది, ఎదలో తొలి వలపే ', ' నీ చేతులలో తల వాల్చి ', ' రాశాను ప్రేమలేఖలెన్నో ', ఇలా ఒకటా రెండా గూడూరు పాటల పోటీలో ' పాల కదలిపై శేషతల్పమున ' పాడిన నూనూగు మీసాల బాలూకు ఫ్రైజ్ ఇచ్చి ' పనికోస్తావ్ ' అని ఆశీర్వదించింది కూడా జానకమ్మే.ఇంకా చెప్పుకుంటూ పోతే తెలుగు నీరు తాగి,తమిళ నేలను, కన్నడ తీరాన్ని మళయాళ పచ్చదనాన్ని అచ్చంగా దక్షిణాదిని తన గొంతులో కలుపుకుంది.ఇక ఎస్ జానకమ్మకు వరించిన అవార్డుల విషయానికి వస్తే 4 నేషనల్ అవార్డులు,33స్టేట్ అవార్డులు వచ్చాయి. 2013లో పద్మ భూషణ్ ను ఇంకా పెద్దది డిజర్వ్ చేస్తాను అని సున్నితంగా తిరస్కరించిన,వద్దన్న గర్వం ఈ గాన మాయల మరాఠిగా పెరుగాంచిన ఎస్ జానకమ్మ గారిది.ఏమైనా ఈ ప్రత్యేక విషాద సమయాన భారతదేశ వ్యాప్తంగా ఉన్న అశేష,కోట్లాది సంగీతప్రియులు,అభిమానులు ఈ గాన గాందర్వురాలు అయిన ఎస్ జానకమ్మ గారికి అత్యంత ఘనంగా,గొప్పగా నివాళులు అర్పించాల్సిన సమయం ఇదే.అమర్ రహే అమర్ రహే! జోహార్ ఎస్ జానకమ్మ గారు.
- బుగ్గన మధుసూదనరెడ్డి,సామాజిక విశ్లేషకుడు, బేతంచెర్ల,నంద్యాల జిల్లా!