🚨 నోటి వెటకారాలు ఒక ప్రాణాన్ని బలితీసుకున్నాయి! ఉద్యోగం రాలేదని, బరువు ఉన్నాడని బంధువుల అవహేళన.. చివరకు ఉన్నత విద్యావంతుడు దారుణ నిర్ణయం! 💔👇
కొన్నిసార్లు ఒకరి ప్రాణం తీయడానికి కత్తులు, కటార్లు అక్కర్లేదు.. నోటి నుంచి వచ్చే నాలుగు వెటకారపు మాటలు చాలు, నిలువెత్తు మనిషిని నిలువునా పూడ్చేయడానికి! శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో జరిగిన ఈ విషాద ఘటన ప్రతి ఒక్కరినీ కదిలించి వేస్తోంది.
📌 అసలు ఏం జరిగిందంటే:
ఉన్నత చదువులు: గాండ్లపెంట మండలం ఎంఈఓ కృష్ణా నాయక్ కుమారుడు వంశీ కృష్ణ నాయక్ ఎన్ఐటీ సూరత్లో బీటెక్ పూర్తి చేసి, ప్రస్తుతం అనంతపురం జేఎన్టీయూలో ఎంటెక్ చదువుతున్నాడు.
స్నేహితులకు ఉద్యోగాలు: తనతో పాటు చదువుకున్న స్నేహితులందరికీ ఉద్యోగాలు వచ్చి స్థిరపడగా, వంశీకి ఉద్యోగం రాలేదనే చిన్న బాధ మనసులో ఉంది.
బంధువులు, ఇరుగుపొరుగు వెటకారం: సెలవులకు ఇంటికి వచ్చిన వంశీని చూసి.. బంధువులు "ఇంకా ఉద్యోగం రాలేదా?" అని, ఇరుగుపొరుగు వారు "లావుగా ఉన్నావు, బరువు తగ్గకపోతే పెళ్లి కాదు, పిల్లనివ్వరు" అంటూ నిరంతరం వెటకారంగా మాట్లాడటం మొదలుపెట్టారు.
రైలు కింద పడి ఆత్మహత్య: అసలే డిప్రెషన్లో ఉన్న ఆ యువకుడు.. ఈ సమాజం ఆడే పరాచకాలకు తీవ్రంగా కలత చెంది, కదిరి సమీపంలోని కూటాగుళ్ల వద్ద రైలు ఎదురుగా వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు.
📢 మనవి:
ఉద్యోగమే జీవితం కాదు తమ్ముళ్లూ! అలాగే బంధువులకు, పెద్దలకు ఒకటే విన్నపం.. చదువుకునే పిల్లలను వేరే వాళ్లతో పోల్చి, వాళ్ల రూపం గురించి, ఉద్యోగాల గురించి వెటకారాలు ఆడి వాళ్లను మానసిక క్షోభకు గురి చేయకండి. మీ నోటి మాటలు ఒకరి ప్రాణం తీసేలా ఉండకూడదు! 🙏🙏🙏🙏🙏
#💗నా మనస్సు లోని మాట #😃మంచి మాటలు #sad reality of life😔 #sad reality 💔 #నేటి లోకం తీరు...!!


