వరంగల్ గడ్డపై కేసీఆర్ గారు నాటిన అభివృద్ధి ‘వృక్షం’
కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్!
గత బీఆర్ఎస్ ప్రభుత్వం విజన్తో నిర్మించిన ఈ పార్క్ను ఈరోజు తమ ఖాతాలో వేసుకోవాలని బీజేపీ చూస్తుండటం హాస్యాస్పదం.
నిజాలు ఇవే:
📍 1,357 ఎకరాల సువిశాల స్థలంలో దేశంలోనే అతిపెద్ద టెక్స్టైల్ పార్క్గా రికార్డు.
🗓️ 2017 అక్టోబర్ 22న స్వయంగా కేసీఆర్ గారు భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు.
💥 కేటీఆర్ గారి నిరంతర కృషితో కిటెక్స్, యంగ్ వన్, గణేశా వంటి దిగ్గజ కంపెనీలు ఇక్కడికి వచ్చాయి.
కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కును ఏర్పాటు చేస్తున్న సమయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అడుగడుగునా వివక్ష చూపినా.. మొక్కవోని దీక్షతో మన వరంగల్ యువతకు ఉపాధి కల్పించింది గత కేసీఆర్ సర్కార్. ఇప్పటికే వేల మందికి ఉపాధి కల్పిస్తూ విజయవంతంగా నడుస్తున్న పార్క్ను, ఈరోజు మళ్ళీ ఓపెన్ చేస్తూ మేమే కట్టామంటూ ప్రచారం చేసుకోవడం బీజేపీ దిగజారుడుతనానికి నిదర్శనం.
వంట అంతా అయ్యాక వచ్చి గరిటె తిప్పినట్టు ఉంది బీజేపీ వ్యవహారం!
పనులు చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం.. కంపెనీలు తెచ్చింది కేసీఆర్, కేటీఆర్..
కానీ క్రెడిట్ కొట్టేయాలని చూస్తోంది మోదీ ప్రభుత్వం!
#🆕Current అప్డేట్స్📢 #📽ట్రెండింగ్ వీడియోస్📱 #🏛️రాజకీయాలు #👨💼కె. టీ. రామారావు


