*వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి*
*మార్కాపురం జిల్లా, కంభం మండలం, కంభం పట్టణ స్థానిక సోమా శేషు కుమార్ వారి కుటుంబ ఆధ్వర్యంలో నూతనంగా వి.ఎస్.ఎస్. (VSS) కన్వెన్షన్ హాల్ భూమి పూజ కార్యక్రమం సోమవారం అత్యంత వైభవంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి గిద్దలూరు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా విచ్చేసి, శాస్త్రోక్తంగా భూమి పూజ నిర్వహించి శంకుస్థాపన చేశారు.*
*ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ.. గిద్దలూరు ప్రాంతం శరవేగంగా అభివృద్ధి చెందుతోందని, ప్రజల అవసరాలకు అనుగుణంగా అత్యాధునిక వసతులతో ఇలాంటి కన్వెన్షన్ హాల్స్ రావడం శుభపరిణామమని పేర్కొన్నారు. వ్యాపారవేత్తలు ఈ ప్రాంత అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.* #📰ఆంధ్రా వాయిస్ #🏛️రాజకీయాలు #📰ప్లాష్ అప్డేట్స్ #🎯AP రాజకీయాలు #✊నారా లోకేష్


