ShareChat
click to see wallet page
search
#రైతులు #రైతులు #రైతులు కస్టమైజ్ చేసిన ట్రాక్టర్లను నిరసనల్లో ఉపయోగిస్తూ #🆕Current అప్‌డేట్స్📢 #📰జాతీయం/అంతర్జాతీయం *వ్యవసాయ ​సిబ్బంది ఉన్నా.. సాయం సున్నా..!!!* *​మండలంలో ప్రకటనలకే పరిమితమైన వ్యవసాయ సేవలు...* *​అకాల వర్షాలతో వరి రైతు అతలాకుతలం..పట్టించుకోని యంత్రాంగం...* *​దళారుల చేతుల్లో నిలువు దోపిడీ.. ‘సచివాలయ’ సిబ్బంది నామమాత్ర సేవలే..!!!* *✍️..పై ప్రత్యేక కథనం..రిపోర్టర్ :- శేఖర్📲..9603197203..✍️* ​ గ్రామాల్లో రైతులకు సేవలందించేందుకు వ్యవసాయ సిబ్బందికి కొరత లేదు. గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల పుణ్యమా అంటూ కాట్రేనికోన మండలంలోని ప్రతి గ్రామంలోనూ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లు,మండల స్థాయిలో వ్యవసాయ అధికారులు అందుబాటులోనే ఉన్నారు. *ఈ యంత్రాంగం అంతా కేవలం కాగితాలకే తప్ప, క్షేత్రస్థాయిలో రైతులకు అందుతున్న సేవలు మాత్రం ‘శూన్యం’* అని ఇక్కడి అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. *ప్రస్తుతం తామంతా ‘జనగణన’ నమోదు విధుల్లో ఉన్నామంటూ తప్పించుకుంటున్న సిబ్బంది,* మిగతా రోజుల్లోనూ నామమాత్రంగానే కనిపిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ​మునిగిన పంట.. ముఖం చాటేసిన అధికారులు ​ఇటీవల కురిసిన అకాల భారీ వర్షాలకు ఆరుగాలం శ్రమించి పండించిన వరి పంట నీట మునిగింది. కళ్లాల్లోనే వరి కుప్పలు తేలిపోయాయి. రోజుల తరబడి నీటిలోనే నానడంతో ధాన్యం మొలకలు వచ్చే పరిస్థితి ఏర్పడింది. రైతులు ఎంతో కష్టపడి, మురుగు నీటిలో, మట్టిలో దేవుకుంటూ తడిసిన వరిని ఎలాగోలా గట్టుకు చేర్చారు. రంగు మారి, మొలకలు వచ్చి సగానికి పైగా పంటను రైతులు నష్టపోయారు. ఉన్న కాస్త ధాన్యాన్ని ఒబ్బిడి (భద్రపరుచుకోవడానికి) చేసుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో రైతులకు ధైర్యం చెప్పి, ఆదుకోవాల్సిన వ్యవసాయ శాఖ అధికారులు కన్నెత్తి కూడా చూడకపోవడం గమనార్హం.. *​సలహాలు లేవు.. ‘కొనుగోలు’ దిక్కు లేదు.!!* ​పంట నష్టాల నమోదు దేవుడెరుగు.. కనీసం నీటిలో పడిపోయిన వరి పంటను ఎలా కాపాడుకోవాలి.? రంగు మారి, మొలకలు వచ్చిన ధాన్యానికి మద్దతు ధర వచ్చేలా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో సూచనలు, సలహాలు ఇచ్చే నాథుడే కరువయ్యాడు. ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని ఎలా అమ్మాలో తెలియక, ఆర్బీకేల నుంచి సరైన మార్గదర్శకత్వం లేక రైతులు అయోమయంలో పడ్డారు. ఇదే అదునుగా భావిస్తున్న దళారులు రంగంలోకి దిగి, తక్కువ ధరలకే కొనుగోలు చేస్తూ రైతులను నిలువునా దోచుకుంటున్నారు. రంగు మారిన ధాన్యానికి మద్దతు ధర దక్కేలా అధికారులు ఎలాంటి చొరవ చూపకపోవడంపై రైతాంగం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.​"నేను రెండెకరాల్లో వరి సాగు చేశాను. అకాల వర్షాలకు పంట పూర్తిగా నీట మునిగింది. ఎంతో వ్యయప్రయాసలకోర్చి తడిసిన వరిని గట్టుపై ఆరబెట్టాను. ఉన్నదాన్ని కాపాడుకోవడానికి ప్రభుత్వ పరంగా ఎలాంటి సూచనలు, సలహాలు లేవు. కనీసం దెబ్బతిన్న పంటను చూడటానికి ఇపకూడా ఏ అధికారీ రాలేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి, రంగు మారిన మా ధాన్యానికి గిట్టుబాటు ధర వచ్చేలా సహకరించాలి." లక్ష్మీవాడ గ్రామానికి చెందిన బాధిత రైతు – కాండ్రేగుల సింహాద్రిరావు కోరుతున్నాడు.​మండల వ్యవసాయ అధికారి మృదుల తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలో కురిసిన వర్షాలకు 135 ఎకరాల్లో వరి పంట నీట మునిగిందని, కళ్లాల్లో 200 టన్నుల ధాన్యం తడిసిందని అధికారులు చెబుతున్నారు. అయితే, ఈ లెక్కలు చెప్పడానికే పరిమితమైన అధికారులు, క్షేత్రస్థాయిలో నష్టపోయిన రైతును గట్టెక్కించేందుకు తీసుకుంటున్న చర్యలు మాత్రం శూన్యమని స్పష్టమవుతోంది. ప్రతి గ్రామంలోనూ రైతులు తమ బాధను ఎవరికి చెప్పుకోవాలో తెలియక దయనీయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, కాట్రేనికోన మండలంలో క్షేత్రస్థాయి పర్యటనలు జరిపి, నష్టపోయిన వరి రైతులకు తక్షణమే న్యాయం చేయాలని, రంగు మారిన ధాన్యాన్ని ప్రభుత్వమే పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.. __________________________ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా :- ముమ్మిడివరం - నియోజకవర్గం *శేఖర్✍️ న్యూస్ 📹 గ్రూప్స్* 4️⃣ 👇 *వాట్సాప్ గ్రూప్ లింక్*👇 ______________________✍️ *ఫాలో అవ్వండి.* & *సబ్ స్క్రైబ్ చేసుకోండి...👇* ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼ Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/2opEPGh68Zq0FMQqQWreQy?mode=gi_t ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
రైతులు - ShareChat