ShareChat
click to see wallet page
search
🪷193లింగమహాపురాణం🪷 🍀గజ దానము -లోకపాలాష్టక దానము -విష్ణు దానము🍀 #నూటతొంభైమూడవభాగం# గజదాన విధి : గజదానముచేయసంకల్పించిన భక్తుడు వేయి లేదాఐదువందల సువర్ణ నాణెములతో గానీ సమాన విలువగలవెండితోగానీ ఏనుగుప్రతిమచేయించాలి. విగ్రహము సుందరంగా సర్వ శుభ లక్షణములు కలిగి ఉండాలి. అష్టమి తిథి నాడు గజమును అలంకరించి శివుని సన్నిధిలో ఉంచిపూజచేయాలి. శివునికి హోమ, పూజ, అర్చన, అభిషేకాదులు విధి పూర్వకంగా నిర్వర్తించాలి. గజ ప్రతిమను శివునికి సమర్పించిన తరువాత శివభక్తుడు, వేదపండితుడు, పేదవాడు అయినబ్రాహ్మణునికి దక్షిణ సహితంగా దానము ఇవ్వాలి.  ఈ దానము చేసిన వ్యక్తి స్వర్గములో నివసించి భూమి పై రాజుగా జన్మించి గజపతి అవుతాడు. లోకపాలాష్టక దాన విధి : ఈ దానము రాజ్యమును రక్షిస్తుంది. శత్రువులను నశింప చేస్తుంది. సైన్య సంపదను పెంచుతుంది. గో బ్రాహ్మణులకు మరియు ప్రజలకు మంచి చేస్తుంది. పుత్ర పౌత్రాభివృద్థి కలిగిస్తుంది. పూర్వోక్త సమయము, స్థానములందు మండపములు ఏర్పాటు చేయాలి. మండపం మధ్యలో వేదిక మీద శివుని లింగము లేదా విగ్రహం ఏర్పాటు చేసి విధి విధానాలతో శివ పూజ చేయాలి.  మండపానికి అన్ని దిశలలో, విదిశలలో ఇసుకతో అష్ట దిక్పాలుర విగ్రహాలు ఏర్పాటు చేయాలి. జితేంద్రియులు, శివునితో సమానులైన ఎనిమిది మంది బ్రాహ్మణులను ఆహ్వానించి చక్కగా పూజించాలి. నూతన వస్త్రాలు, ఆభరణాలు, గంధ పుష్ప ధూప దీపాలతో లోకపాలక మంత్రములు చదువుతూ బ్రాహ్మణులను పూజించాలి.  తూర్పు దిశ నుండి ప్రారంభించి అన్ని దిశలలో హోమము చేయాలి. శివునికి హవనము సమర్పించిన తరువాత ఆచార్యుడు యజమానిని ఆహ్వానించి బ్రాహ్మణులందరికి తత్సంబంధ మంత్రములు పఠిస్తూ ధనమును బ్రాహ్మణులకు దక్షిణగా సమర్పింప చేయాలి. దక్షిణగా పది బంగారు నాణెములు ఇవ్వడం ఉత్తమం. భక్తి శ్రద్థలతో ఈ దానము చేసిన వ్యక్తి లోకపాలుర లోకాలలో చిరకాలం నివసించి భూమి పై జన్మించి సార్వభౌమ సామ్రాట్టు అవుతాడు. విష్ణు దానము : దానములన్నింటిలో ఈ దానము ఉత్తమోత్తమమైనది.  మండపంలో వేదిక పైన శివుని ఎదురుగా విష్ణువు విగ్రహము ఏర్పాటు చేసి పూజించాలి. విష్ణువుని విష్ణు గాయత్రి మంత్రం "నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్"  (మేము నారాయణుని ఎరుగుదుము! మేము నారాయణుని ధ్యానింతుము! నారాయణుడు మాకు దారి చూపించు గాక!) తో పూజించాలి. బ్రాహ్మణునికి స్వాహా, శివునికి హరికి "స్వాహా, వషట్, స్వధా" మంత్రాలతో విధి పూర్వకంగా పూజ చేయాలి. రెండు హోమ కుండాలలో హోమ ద్రవ్యాలతో  ఇద్దరు ఋత్విక్కుల ద్వారా హవనము చేయాలి.  ఋత్విక్కులలో ఒకరు ఆచార్యుడు, రెండవ వారు వేదాధ్యయనము చేసిన బ్రాహ్మణుడు అయి ఉండాలి. 108 స్వర్ణ నాణెములు ద్రవ్యదక్షిణగా నూతన వస్త్రములు, ఆభూషణాలతో మొదట బ్రాహ్మణునికి దానము ఇవ్వాలి. గురువు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురితో సమానము. ఆయనకు ద్రవ్య దక్షిణ ఆభరణాలు, వస్త్రములు ప్రత్యేకంగా సమర్పించాలి. బ్రాహ్మణులకు భోజనం ఏర్పాటు చేయాలి. చివరన శివునికి అభిషేకం చేసి పూజ చేయడంతో సమాప్తం అవుతుంది. https://chat.whatsapp.com/I9GuM11QcSYCmHyQXHO5cQ?mode=gi_t #🌅శుభోదయం #🙏శుభాకాంక్షలు #🙏ఓం నమః శివాయ🙏ૐ *తరువాతకధ రేపటి భాగంలో చదువుదాం*. 🌹శ్రీకాంత్ గంజికుంట కరణంగారి సౌజన్యంతో🌹 💜   ఓం శ్రీఉమా మహేశ్వరాయ నమ:💜 🙏లోకా:సమస్తాః సుఖినోభవన్తు🙏 రేపటి తరానికి బ్రతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*      (సర్వం శ్రీశివార్పణమస్తు)                 🌷🙏🌷 శుభమస్తు 🌹 🌷 ♥️ 🙏 స్వస్తి. 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺
🌅శుభోదయం - ShareChat
ॐ భగవాన్ శ్రీ మహా
WhatsApp Group Invite