ShareChat
click to see wallet page
search
*_శ్రీమహావిష్ణుపురాణం_* *_132 వ భాగం_* *_కల్కి అవతారం_ -* *_కుథోధరి రాక్షసి సంహారం.._* *_చక్రతీర్థంలో కల్కి మూర్తి స్నాన సంధ్యాది అనుష్టానాలు చేస్తుండగా అరవైవేల సంఖ్యలో ఉన్న సూక్ష్మ రూపులైన వాలిఖ్యాది మునులు కల్కి దర్శనానికి వస్తారు._* *_కల్కివిచారవదనాలలో ఉన్న వాలిఖ్య మునులు చూసి అందుకు కారణం అడుగుతాడు_*. *_వాలిఖ్యులు నమస్కరించి "కల్కిమూర్తీ కుంభకర్ణుని మనవరాలు, కుమార్తె పుత్రిక అయిన కుథోధరి అనే భయంకరమైన రాక్షసి ఉంది. కాలకుంజుడనే రాక్షసుడి భార్య అయిన కుథోధరి విశాలమైన, భీకరమైన ఆకారం కలిగి ఉంటుంది. ఆమె ఆకారం పొడవు ఆకాశం వరకు వ్యాపించి అంతరిక్షంలో సగం ఉంటుంది. ఆ రాక్షసి హిమాలయాన తల పెట్టుకుని కాళ్ళను నిషాధాద్రి వరకు చాపి పడుకుని ఉంటుంది. ఆమెకు ఐదు ఏళ్ల వికుంజుడు అనే కుమారుడు ఉన్నాడు. వికుంజుడు త్రాగగా వదిలిన తల్లి పాలు కారుతూ ఒక నదిలా ప్రవహిస్తుంటాయి. ఆమె ఉచ్ఛ్వాస నిశ్వాసలకు చుట్టు పక్కల నివసించే ప్రజలు, జంతువులు గాలిలో ఎగిరి ఆ నదిలో కొట్టుకు పోతుంటారు. సూక్ష్మరూపులమైన మేము ఆ విధంగాఎగిరి నదిలో పడి ఇక్కడకు కొట్టుకుని వచ్చాము. రోజు ఆ రాక్షసి వలన కొట్టుకుని దూరంగా వెళ్లడం, తిరిగి వెనక్కు వెళ్లడం జరుగుతోంది. మేము తపస్సులు చేయలేక పోతున్నాము. శ్రీహరి అవతారమైన మీరు ఆ రాక్షసిని సంహరించి మమ్మల్ని రక్షించాలి" అని ప్రార్ధిస్తారు_*. *_కల్కి అంగీకరించి తన సైన్యంతో వాలిఖ్య మునుల వెంట ఆరాక్షసి ఉండే ప్రదేశానికి వెళతాడు. రాక్షసిపాలతో ఏర్పడిన క్షీరనదిని చూశాడు. నది వెంట వెళ్ళి ఆ రాక్షసి నివసించే ప్రదేశానికి వెళతాడు_*. *_నిద్రపోతున్న ఆ భీకర భారీ భయంకర రాక్షసిని చూసి ఆశ్చర్యం చెందుతాడు. ఈ రాక్షసిని ఎలాసంహరించాలి అని ఆలోచిస్తుండగా, కుథోధరిరాక్షసి అశ్వాల,గజాల,మనుషుల వాసనకు నిద్రలేస్తుంది. ఆకలితో కనపడ్డ కల్కిమూర్తితో సహా వారందరిని నోరు తెరిచి గుటుక్కున మ్రింగివేస్తుంది_*. *_రాక్షసి కడుపులో చేరిన కల్కి మూర్తి ఆలోచించి తనఆకారాన్ని పెంచడం ప్రారంభిస్తాడు._* *_కల్కిఆకారం పెరిగిపెరిగి రాక్షసి కడుపును చీల్చివేస్తుంది. రాక్షసి మరణిస్తుంది_*. *_కల్కిమూర్తి,పరివారం, చతురంగ బల సైన్యం ఉదరం నుంచి బయటకు వస్తుంది._* *_దేవతలు ఆకాశం నుంచి చూసి ఆనందించి పుష్పవర్షం కురిపిస్తారు._* *_వాలిఖ్య మునులు కల్కిని స్తుతిస్తారు_*. *_కుథోధరి మరణానికి భర్త కాలకుంజుడు, కుమారుడు వికుంజుడు రాక్షస సైన్యంతో కల్కి పై దాడికి వస్తారు. కల్కి ఖడ్గంతో విజృంభించి కాల కుంజుని, అతనిరాక్షస సైన్యాన్ని సంహరిస్తాడు. బాలుడైన కుథోధరి పుత్రుని దయతో వదిలేస్తాడు. కానీ ఆ బాలుడు కొంతమంది రాక్షసులతో తిరిగి వచ్చి కల్కిని చంపడానికి ప్రయత్నం చేస్తాడు. కల్కి తన ఖడ్గాన్ని ప్రయోగించి స్వయంగా చంపకుండా, పరశురాముడు బోధించిన బ్రహ్మాస్త్రాన్ని మంత్రంతో ఆ బాలుని పై ప్రయోగించి చంపుతాడు_*. *_హిమాలయాలు రాక్షసుల నుండి విముక్తి పొందడంతో అక్కడ నివసించే మునులు వచ్చి కల్కికి కృతజ్ఞతలు తెలుపుతారు._* *_కల్కి మూర్తి హరిద్వారం వచ్చి గంగాస్నానం చేస్తాడు. గంగ స్త్రీ రూపంలో ప్రత్యక్షంగా వచ్చి పుండరీక వనంలో కల్కికి సేవలు చేస్తూ అర్చిస్తుంది._* *_నారాయణుని అవతారమైన కల్కి పుండరీక వనంలో ఉన్నారని తెలిసి చుట్టుపక్కల ఆశ్రమాల నుంచి మునులు, ప్రజలు వచ్చి దర్శించి పూజలు, స్తుతులు చేస్తుంటారు_*. *_మరుత్తుడు దేవాపి వచ్చి కల్కిని సేవిస్తుండగా వారి వంశ చరిత్ర తెలుసుకుని ఆనందిస్తాడు. మరుత్తుని అయోధ్యకు, దేవాపిని హస్తినాపురానికి రాజులుగా పట్టాభిషేకం చేస్తాడు. విశాఖయూపుని కుమార్తెను మరుత్తునికి, రుచిలశ్వుని కుమార్తెను దేవాపికి ఇచ్చి వివాహం చేస్తాడు_*. *_తరువాత ఆకాశం వంక చూసి కల్కి సంకల్పించగా రెండు దివ్య విమానాలువస్తాయి._* *_మరుత్తుని, దేవాపిని ఆ విమానాలు ఎక్కి దుష్ట సంహారం చేసి కలి పురుషుని ప్రభావం అంతం చేయమని చెబుతూ "మరుత్తదేవాపిలారా! ఈ విమానాలు కామగమనం కలవి. ముల్లోకాలు మూడు నిమిషాలలో తిరిగి రాగలవు. ఈ విమానాలలో అనేక దివ్య ఆయుధాలు ఉన్నాయి. మీ దుష్ట సంహారానికి ఉపయోగ పడతాయి" అని ఇవ్వగా మరుత్త దేవాపిలు స్వీకరిస్తారు. కల్కి మూర్తికి నమస్కరించి ఆశీస్సులు తీసుకుని మరుత్త దేవాపిలు విమానాలపై దుష్ట సంహారానికి బయలుదేరి వెళతారు_*. *_కొంతకాలానికి కల్కి మూర్తి సభ జరపుతుండగా సభకు ఒకయతి పురుషుడు వస్తాడు_*. *_అతని దివ్య తేజస్సుకు కల్కిస్వాగతం పలికి అర్ఘ్యపాద్యములు ఇచ్చి ఉచితాసనుని చేసి రాకకు గల కారణం అడుగుతాడు_*. *_ఆయతి పురుషుడు కల్కికినమస్కరించి "ప్రభూనారాయణునిఅవతారమైన మీరు దుష్ట శిక్షణ చేసి భూభారం తగ్గించారు.వర్ణాశ్రమ ధర్మాలు,వేదవిధులు,యజ్ఞయాగాదులు రాజులు, ప్రజలు పాటించేలా, చేసేలా చేశారు_*. *_ఫలితంగా కలి ప్రభావం అంతరించి కలిపురుషుడు అంతమయ్యాడు. నేను రాబోయే కృతయుగానికి అధిపతినైన కృతయుగ పురుషుడిని. కలి భయం అంతరించడం చేత నేను భూమి పై అడుగు పెట్టాను, ప్రజలందరు కృతయుగధర్మాలు పాటించేలా చేయండి" అని అర్థిస్తాడు._* *_కల్కిమూర్తి సంతోషించి లోకంలో కృతయుగ ధర్మాలు పునః స్థాపించి ధర్మం నాలుగు పాదాలలో నడిచేలా చేస్తాడు_* #మన సంప్రదాయాలు సమాచారం