#💪పాజిటీవ్ స్టోరీస్ #🏛️పొలిటికల్ అప్డేట్స్ #📰ఈరోజు అప్డేట్స్ #🆕Current అప్డేట్స్📢 #📰జాతీయం/అంతర్జాతీయం
*అభివృద్ధికి నోచుకోని ఇసుకపర్ర..*
*మత్స్యకారుల జీవనోపాధికి గండి..*
నిరసన వ్యక్తం చేసినానేటికీ దక్కని ఫలితం..
*✍️..పై ప్రత్యేక కథనం..రిపోర్టర్ :- శేఖర్📲..9603197203..✍️*
అసెంబ్లీలో లేవనెత్తిన ముమ్మిడివరం నియోజకవర్గం *ఎమ్మెల్యే దాట్ల* కాట్రేనికోన, మండల పరిధిలో గచ్చకాయలపోర,.పల్లం, చిర్రయానం, గెద్దనపల్లి, దొంతికుర్రు మొదలైన గ్రామ ప్రాంతాలను ఆనుకొని సుమారు నాలుగువేల హెక్టార్లలో పర్ర భూమి విస్తరించి ఉంది . దశాబ్దాలు తరబడి ఈ భూమి మట్టితో పూడికపోయింది. దీనికి తోడు సముద్రం నుండి ఈ పర్ర లోకి ప్రవేశించే నీరు మొగ మూసుకుపోవడంతో ఆగిపోయింది. ఈ పర్ర పై ఆధారపడి సుమారు *పదివేల మంది మత్స్యకారులు వారి కుటుంబాలు ప్రత్యక్షంగాను, పరోక్షంగాను ఆధారపడ్డాయి.*
*పర్ర ప్రత్యేకత* : పర్ర భూమి ప్రకృతి సిద్ధంగా ఏర్పడింది. ఒకే విధమైన లోతు కలిగి ఉండి మహిళలు,పిల్లలు సహా అందరూ వేట చేయడానికి అనువుగా ఉంటుంది. వేసవికాలంలో మోకాలు లోతు, వర్షాకాలంలో మొల లోతు మాత్రమే కలిగి ఉంటుంది. దీంతో స్థానిక మత్స్యకారులు చిన్నపాటి పడవలు, దోనెలు వంటి వాటిని ఉపయోగించి వేట కొనసాగిస్తారు. ఎక్కువ శాతం నడక, మోచేతి వలలు ఊస వలన వేట కొనసాగుతుంది.
*గతమెంతో ఘనం* *నేడు దైన్యం* : ఈ పర్ర గతంలో సముద్రపు ఆటుపోట్లకు నీరు వచ్చి వెళ్లే విధంగా ఉండేది. పూడికలు ఏర్పడిన ప్రతిసారి దివంగత లోక్ సభ స్పీకర్ జిఎంసి బాలయోగి వీటి అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచేవారు. డ్రెడ్జర్ల తొలగింపు చేసే కార్యక్రమాలను ప్రోత్సహించేవారు. దీంతో మత్స్య సంపద ఎక్కువగా లభించడంతో చేపల వేటలు కూడా ఎక్కువగా ఉండేవి. పరిస్థితుల్లో మార్పు కారణంగా మొగలు మూసుకుపోవడంతో సముద్రపు నీరు పర్ర లోకి చేరకపోగా నాచు విపరీతంగా పెరిగిపోయి పూడికలు పెరిగిపోయాయి. క్రమేపి ఈ పర్ర పై ఆధారపడి జీవించేవారు ఇతర జీవనోపాదులను వెతుక్కోవాల్సి వచ్చింది.
*పెరిగిన వలసలు* : స్థానిక మత్స్యకారుల జీవనోపాధికి గండిపడడంతో వలసలు మొదలయ్యాయి.హైదరాబాదు,గుంటూరు,విశాఖపట్నంవంటి పట్టణ ప్రాంతాలకు వలస వెళ్లిపోయారు.
*మొగ పునరుద్ధరణ* *పై* *ఉద్యమం* : పూడికపోయిన మొగను భవిష్యత్తులో పూడికకు అవకాశం లేకుండా పునరుద్ధరించాలని మండలానికి చెందిన పలువురు మత్స్యకారులు మత్స్యశాఖ కార్పొరేషన్ మాజీ చైర్మన్ నాగిడి నాగేశ్వరావు ఆధ్వర్యంలో సుమారు రెండు నెలల క్రిందట ఈ ప్రాంతంలో ఉద్యమం చేశారు. ఈ కార్యక్రమంలో మహిళలు, పిల్లలు సైతం పెద్ద ఎత్తున పాల్గొనడం విశేషం..మొగను పునరుద్ధరించడంతోపాటు,పర్రభూముల్లో ఆక్రమణలను పూర్తిగా తొలగించాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. కొంతమంది ఆక్రమణదారులు పర్ర భూములను ఆక్రమించుకుని రొయ్యల చెరువులుగా మార్చేశారని నాగిడి నాగేశ్వరరావు తదితరులు మండిపడ్డారు..
*అసెంబ్లీలో లేవనెత్తిన ఎమ్మెల్యే* : ముమ్మిడివరం ఎమ్మెల్యే,ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు మొగ పునర్ధరణ, ఆక్రమణల తొలగింపు విషయమై అసెంబ్లీలో మాట్లాడారు. కానీ నేటికీ ఇది కార్యరూపం దాల్చలేదు..
*మత్స్యకారుల* *డిమాండ్లు ఇవి* : పర్ర లోకి సముద్రపు నీరు వచ్చి పోయే విధంగా సముద్రపు మొగలను అభివృద్ధి చేయాలి, డ్రెడ్జర్ సహాయంతో పర్ర లో పూడికలను తొలగించాలి, కర్ర భూములో ఆక్రములను స్వాధీనం చేసుకోవాలి, చేపల వేటల విషయంలో గ్రామాల మధ్య వివాదాల తలెత్తకుండా శాంతి కమిటీలు వేయాలి..
__________________________
డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా :-
ముమ్మిడివరం - నియోజకవర్గం
*శేఖర్✍️ న్యూస్ 📹 గ్రూప్స్* 4️⃣
👇 *వాట్సాప్ గ్రూప్ లింక్*👇
______________________✍️
*ఫాలో అవ్వండి.* & *సబ్ స్క్రైబ్ చేసుకోండి...👇*
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/2opEPGh68Zq0FMQqQWreQy?mode=gi_t
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼


