దిన దిన వర్ధమానంగా వెలుగొందుతున్న ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం,ప్రశాంతతకు మారుపేరు,భక్తుల కొంగు బంగారం ఈ తిరుమల తిరుపతి దేవస్థానం!
లేదా
నిత్యకళ్యాణం పచ్చతోరణంలా తిరుమలకు పోటేత్తుతున్న భక్త జన సందోహం!
నిత్యం లక్షలాది మంది అశేష జనభక్త కోటి సందర్శించే తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క వైభవాన్ని, అత్యంత మహిమాన్వితమైన ఆ ఏడుకొండలవాడు, తెల్ల నామాల వాడు,వడ్డీ కాసులవాడు,ఎల్లరు ఏలేటి వాడు,శంఖు చక్రాల వాడు ఇక్కడ అవతరించిన అత్యంత అపురూపమైన గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రం, పుణ్య, కర్మభూమి,ప్రపంచంలోనే ఎక్కువమంది, మిక్కిలి భక్తులు సందర్శించే రెండవ అతి పెద్ద దేవాలయంగా ప్రసిద్ధి గాంచిన ఈ వెంకటరమణుని, పరందాముని,వరాలు ఇచ్చేవారైనా ఆ వెంకన్న స్వామి దివ్య మహిమలను గురించి వర్ణించడం ఎవరి తరం? ఎంత పొగిడిన తనివి తీరదు.ఏ క్షేత్రమేగిన,ఏ దేశమేగిన,ఎందుకాలిడిన పొగడరా ఈ భూమి భారతిని అంటారే ఆ విధంగా ఈ దీనజన వల్లభుడిని, అనాధ రక్షకుడిని,ఆపద మొక్కుల వాడిని,కరుణా కృప కటాక్షల గురించి ప్రతి ఓక్క హిందువు గర్వపడేలా చెప్పుకునే అత్యంత అపురూపమైన ఈ సర్వాంగ సుందరమైన అత్యంత ప్రశాంత వాతావరణంలో నిత్యం వేదాలను ఆపసోపాన పట్టిన వేద పండితులచే అంగ రంగ వైభవంగా అనేక శాస్రోక్తమైన పూజలు, కైంకర్యాలు,సేవలు అందుకుంటూ భక్తుల కోరికలు నెరవేరుస్తూ వారికి కొంగుబంగారంగా బాసిల్లుతున్న ఈ నల్ల నల్లని వాడు,నీలి మేఘశ్యాముడు, వేంకటరమణుడు ఇలా దిన దిన వర్ధమానంగా వెలుగొందుతున్న తీరుతెన్నులు నిజంగా నభూతో నభవిష్యత్ అని నిస్సందేహంగా చెప్పవచ్చు.ఇక సౌకర్యాల విషయానికి వచ్చేసరికి నిత్యం లక్ష మందిభక్తుల దాక సందర్శించే ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా అశేష జన భక్త సముహరానికి ఉచిత కాటేజీ,ఉచిత దర్శనం,ఉచిత భోజనం,ఉచిత ప్రసాద వితరణ,త్రాగునీరు ఇలా ఎలాంటి ఇబ్బందులు,లోటు లేకుండా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఎంతో అంకితభావంతో,దృఢదీక్షతో తమ విధులు నిర్వర్తిస్తున్న తీరు ఎంతో హర్షణీయం, అభినందనీయం.
ఏదిఏమైనా గతంలో ఓ రెండు సంవత్సరాలు( 2020 - 22) కరోనా మహమ్మారి విరుచుకుపడటంతో కోవిడ్ నిబంధనల మూలంగా భక్తుల సందడి,తాకిడి,రాకపోకలు తిరుమల తిరుపతి దేవస్థానానికి కాస్తంత తగ్గినా,ఈ మధ్యకాలంలో అంటే గత కొంత కాలంగా కరోనా తగ్గు ముఖం పట్టడంతో తిరిగి మళ్ళీ హిందూ భక్త ప్రభంజనం ఈ ఏడుకొండలవాని,నారాయణుని వద్దకు పోటేత్తడం ప్రారంభం అయ్యింది,మొదలయింది ఈ గోపాలుని, అందచందాల వాడైనా,గోవిందుని దర్శనార్థం,ఆయన లీలలతో ఎంతో విలువైన తమ జీవితాలను ఆనందమయం చేసుకోవడానికి.ఏమైన నిత్యం కనివీని ఎరుగని విధంగా ఆ గోవిందుని,అదిశేషుని దర్శనార్థం విచ్చేసే భక్త జన సౌకర్యార్థం వారికి సుఖమైన రీతిలో, సురక్షితంగా దర్శన భాగ్యం కలిగించేందుకు ప్రతి రోజు, ఎల్లవేళలా దాదాపు 20,000 మంది దాక అహోరాత్రులు నిధులు అత్యంత నిజాయితీ గా నిర్వర్తిస్తున్న వారి సేవా తత్పరతకు,వారి అంకుటిత దీక్షకు ఒక్కసారి మనమంతా అంటే అశేష హిందూ భక్త జన కోటి అయిన మనమందరం వారికి జేజేలు పలుకుదాం,వారికి శతకోటి ధన్యవాదములు తెలియజేద్దాం!ఏడుకొండలవాడ వెంకటరమణ, అనాదదరక్షక,ఆపద్భాందవ,దీన జన వల్లభుడా,ఆపదల మొక్కులవాడ గోవిందా గోవిందా!🕉️🕉️🕉️🙏🙏🙏✍️✍️✍️
- బుగ్గన మధుసూదనరెడ్డి,సామాజిక విశ్లేషకుడు,బేతంచెర్ల,నంద్యాల జిల్లా! #శుభ శనివారం


