#📰ఈరోజు అప్డేట్స్
హనుమకొండ జిల్లా
ఐనవోలు మండలం
మక్కల కొనుగోలు కేంద్రాలను సందర్శించిన పాక్స్ చైర్మన్ మార్నేని రవీందర్ రావు
ఐనవోలు మండలం నందనం రైతు సేవా సహకార సంఘం పరిధిలోని పంతిని, రాంనగర్, ఒంటిమామిడిపల్లి , అయినవోలు లోని మక్కల కొనుగోలు కేంద్రాలను మాజీ టీజీ క్యాబ్ & డీసీసీబీ చైర్మన్ ప్రస్తుత పాక్స్ చైర్మన్ మార్నేని రవీందర్ రావు గారు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన రైతులకు మాట్లాడుతూ
కొనుగోలు కేంద్రాల్లో మక్కలను ప్రభుత్వం నిర్ణయించిన క్వింటాల్కు రూ. 2,400 మద్దతు ధరతోనే ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, తెలిపారు కొనుగోలులో ఆలస్యం జరుగుతోందని వస్తున్న ఫిర్యాదులపై తక్షణమే.పై అధికారుల దృష్టికి తీసుకెళ్తూ రైతులకు ఇబ్బంది కలగకుండా చూస్తున్నామన్నారు మధ్యవర్తులను నమ్మకుండా నేరుగా కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలనీ రైతుల కోరారు


