ShareChat
click to see wallet page
search
అణగారిన వర్గాల ఆశాదీపం ఈ మహాత్మా జ్యోతిరావు పూలే గారు! లేదా సత్య శోధక్ సమాజ్ ను స్థాపించి ఆధునిక భారత సామాజిక సంస్కరణలకు మార్గదర్శకుడిగా నిలిచిన జ్యోతిరావు పూలే గారి 199వ జయంతిని పురస్కరించుకొని! ( 11 - 4 - 2026)! 19వ శతాబ్దపు ప్రముఖ భారతీయ సంఘ సంస్కర్త, విద్యావేత్త మరియు కుల వివక్ష వ్యతిరేఖ పోరాట యోధుడు - మహాత్మా జ్యోతిరావు పూలే గారి ( 1827 - 1890) 199వ జయంతి నేడు.ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకొని బాలిక విద్య,మహిళా సాధికారత,అట్టడుగు వర్గాల హక్కుల కోసం అవిరళకృషి చేస్తూ,1848లో పూణేలో బాలికల కోసం మొదట పాఠశాలను స్థాపించిన గొప్ప చరిత్ర ఈ పూలే గారిది.అంతేకాదు ఆయన జీవిత అద్యంతం ' సమానత్వం ' కోసం ఓ అలుపెరుగని పోరాటం సల్పడమే కాదు 1873లో సత్య శోధక్ సమాజ్ ను స్థాపించి ఆధునిక భారత సామాజిక సంస్కరణలకు మార్గదర్శకుడిగా సైతం నిలిచాడు.ఇక జ్యోతిరావు పూలే ప్రత్యేకతలు మరియు సేవల విషయానికి వస్తే మహిళ విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ,భార్య సావిత్రి బాయ్ పూలేతో కలిసి 1848లో ఆయన స్థాపించిన మొదటి పాఠశాల ద్వారా స్ర్రీలకు విద్య అనేది ఎంత అవసరమో తన మహోన్నత సేవ ద్వారా ఈ భరతజాతికి చాటి చెప్పాడు.ఇక ఆయన స్థాపించిన సత్య శోధక్ సమాజ్ స్థాపన ( 1873) ప్రదాన ఉద్దేశ్యం ఏమంటే అణగారిన వర్గాలు,సూద్రులు మరియు అతిసూద్రుల ఆత్మగౌరవం,హక్కుల కోసం పోరుబాట సల్పాలనే ఏకైక లక్ష్యంతోనే,ఎజెండాతోనే ఈ ప్రతిష్టాత్మక సంస్థను స్థాపించి జాతి గర్వించదగ్గ వ్యక్తిగా నిలబడ్డాడు ఈ జ్యోతిరావు పూలే గారు.ఇక ఆయన ప్రదానంగా కులవివక్షను,అంటరానితనాన్ని తీవ్రంగా ఖడించారు కూడా,ఓక విధంగా చెప్పాలంటే మానవ హక్కులు స్ర్రీ,పురుష సమానత్వం కోసం తన యావత్ అమూల్యమైన జీవితాన్ని సైతం వెచ్చించాడు ఈ పూలే గారు. ఏదిఏమైనా ఈ మహాత్మా జ్యోతిరావు పూలే గారు వితంతు పునర్వివాహల విషయంలో కూడా ఎంతో మానవతా దృక్పథంతో ప్రత్యేక శ్రద్ధాశక్తులు కనబరచి వితంతువుల కోసం గృహలను సైతం స్థాపించి వారి జీవితాల్లో కోటి వెలుగులు ప్రసరించడానికి అవిరళ కృషి సల్పారు కూడా.ఇక ఆయన రచనలు - ఆలోచనల విషయానికి వస్తే ' గులాంగిరి ' ( బానిసత్వం ) వంటి పుస్తకాల ద్వారా సామాజిక అసమానతలను ఏ మాత్రం బేషజాలం లేకుండా ప్రశ్నించడమే కాదు,జ్ఞానమే శక్తి అని మనసా,వాచ,కర్మణ నమ్మిన ఓక ఆదర్శ,స్ఫూర్తిదాయక సంఘ సంస్కర్త ఈ మహాత్మా జ్యోతిరావు పూలే గారు అనే మాట అక్షర సత్యం. ఏమైనా ఎట్టకేలకు సామాజిక అన్యాయాలపై ఆయన చేసిన అవిశ్రాంత పోరాటాన్ని గుర్తించి,1888లో బొంబాయికి చెందిన రావు బహదూర్ వడేకర్ గారు ఆయనకు ' మహాత్మా ' బిరుదును ప్రదానం చేశారు. అమర్ రహే,అమర్ రహే జ్యోతిరావు పూలే! జోహార్ ఓక మహా కార్యదీక్షపరుడు,కారణజన్ముడు అయిన మహాత్మా జ్యోతిరావు పూలే గారు!జైహింద్! మేరా హిందూస్తాన్ మహాన్!🇮🇳🇮🇳🇮🇳✍️✍️✍️ - బుగ్గన మధుసూదనరెడ్డి,సామాజిక విశ్లేషకుడు, బేతంచెర్ల,నంద్యాల జిల్లా! #🇮🇳జ్యోతిరావు🎂పూలే🙏జయంతి
🇮🇳జ్యోతిరావు🎂పూలే🙏జయంతి - Wayeneus ne ಜಾನಂ ಶನ ಅಏಂಣ ನಲಯಾಜನಂಗ (( 3 ఆచరణ లేని జ్ఞునం వ్యర్థం' సంఘ సంస్కర్త సామాజిక తత్వవేత్త ತಿರಾವು ಫಾಲೆ జయంఠి : వప్రిల 11 బుగ్గన మధుసూదనరెడ్డి గా వెస్ార్సీపీ పారీ నాయకుడు Wayeneus ne ಜಾನಂ ಶನ ಅಏಂಣ ನಲಯಾಜನಂಗ (( 3 ఆచరణ లేని జ్ఞునం వ్యర్థం' సంఘ సంస్కర్త సామాజిక తత్వవేత్త ತಿರಾವು ಫಾಲೆ జయంఠి : వప్రిల 11 బుగ్గన మధుసూదనరెడ్డి గా వెస్ార్సీపీ పారీ నాయకుడు - ShareChat