chaitu
545 views 2 days ago
ఆత్మగౌరవం … వైసీపీలోకి రీఎంట్రీ కోసం విజయసాయిరెడ్డి పెట్టిన కండిషన్! తీవ్ర సంక్షోభంలో ఉన్న వైసీపీని గట్టెక్కించేందుకు విజయసాయిరెడ్డి అవసరం గుర్తించిన జగన్, ఆయనతో రాయబారాలు నడుపుతున్నారని క్లారిటీ వచ్చింది. "రాష్ట్ర ప్రజాప్రయోజనాలే లక్ష్యంగా, ఆత్మగౌరవంతో నిర్ణయం తీసుకుంటాను" అన్న సాయిరెడ్డి ప్రకటన వెనుక.. తాడేపల్లి ప్యాలెస్‌తో జరుగుతున్న చర్చలు నిజమేనని అర్థం చేసుకోవచ్చు. ఆత్మగౌరవం అనే మాటే ఇక్కడ కీలకం. సజ్జల రామకృష్ణారెడ్డి కోటరీకి చెక్ పెట్టి, పార్టీ కీలక వ్యవహారాల నుంచి ఆయనను పూర్తిగా పక్కన పెడితే తప్ప తిరిగి అడుగుపెట్టేది లేదనేది సాయిరెడ్డి ప్రధాన డిమాండ్‌గా తెలుస్తోంది! ఢిల్లీ స్థాయిలోనూ, పార్టీ అంతర్గత వ్యవహారాల్లోనూ మళ్లీ పాత రోజుల్లోలాగా పూర్తి స్థాయిలో పవర్స్ ఇస్తేనే వస్తానని, సజ్జల నీడ కూడా పడకూడదని అంటున్నట్లుగా చెబుతున్నారు. సాయిరెడ్డి ట్వీట్ కేవలం సాధారణ ప్రకటన కాదు, ఒక పక్కా పొలిటికల్ డిజైన్. పార్టీ ఉనికి కోసం జగన్ రెడ్డి సజ్జలను పక్కన పెట్టి సాయిరెడ్డి కండిషన్లకు తలొగ్గుతారో లేదో వేచి చూడాలి! #VijayasaiReddy #SajjalaRamakrishnaReddy #YSRCP #APPolitics #📖బిజినెస్ #📖జనరల్ ఇన్ఫర్మేషన్👩‍💼 #🌾రైతు సమాచారం #🟢వై.యస్.జగన్ #🔵వై‌యస్‌ఆర్‌సీ‌పీ
18 likes
9 shares

More like this