తెలుగుదేశం పార్టీ అంటే కార్యకర్తలకు ఎంత ప్రాణమో, ఇంకెంత అభిమానమో వనపర్తి జిల్లా, కిలా ఘనపూర్ మండలానికి చెందిన బండారి యాదగిరిని చూస్తే తెలుస్తుంది. పార్టీ కార్యక్రమాలు ఎక్కడ జరిగినా పసుపు రంగు పల్సర్ బైక్పై, పసుపు దుస్తులతో హాజరవుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తారు. టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు, నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ గార్లపై ఉన్న అభిమానానికి గుర్తుగా వారి చిత్రాలను తన ఛాతీపై పచ్చబొట్టుగా వేయించుకున్నారు. మహబూబ్ నగర్ టీడీపీ పార్లమెంట్ సమావేశంలో యాదగిరిని పార్టీ నేతలు సన్మానించారు.
#TeluguDesamParty #🆕షేర్చాట్ అప్డేట్స్
00:12

