ShareChat
click to see wallet page
search
*ఆనారోగ్యంతో బాధపడే వారికీ, ఆపన్న హస్తం.. ముఖ్యమంత్రి సహాయనిధి..* *గిద్దలూరు నియోజకవర్గంలోని 33 మందికి రూ. 21,68,570-00 లు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణి చేసిన ఎమ్మెల్యే ముత్తుముల* *గిద్దలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గిద్దలూరు ఎమ్మెల్యే శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారు ఆదివారం ఉదయం నియోజకవర్గంలో ఆనారోగ్యంతో బాధపడుతున్న 33 మందికీ 18 వ విడతగా మంజూరు అయిన, రూ,21,68,570-00 లు (అక్షరాల ఇరవై ఒక్క లక్ష అరవై ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై రూపాయలు) ముఖ్యమంత్రి సహాయ నిధి, చెక్కులను అందచేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆనారోగ్యంతో బాధపడే వారికీ ముఖ్యమంత్రి సహాయనిధి అనేది ఒక ఆపన్న హస్తం అని, పేదలకు నాణ్యమైన వైద్యం అందించటమే ఎన్డీయే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, ప్రస్తుతం పట్టణాల్లోని కార్పొరేట్ హాస్పిటల్స్ లో పేదవారు నాణ్యమైన వైద్యం పొందవచ్చునని, వారికీ అయిన ఖర్చును ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా పొందవచ్చునన్నారు.. అనారోగ్య సమస్యలతో బాధపడుతూ అనేకమంది పేద ప్రజలు ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొనుచున్నారని వారికీ అండగా నిలవాలన్నదే చంద్రన్న కూటమి ప్రభుత్వ ధ్యేయమన్నారు. పేద ప్రజలకు ఎటువంటి సమస్య వచ్చిన కూటమి ప్రభుత్వం తక్షణమే స్పందిస్తుందన్నారు. ఇప్పటి వరకు నియోజకవర్గంలోని 1043 మంది నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా రూ. 8,68,14,620 -00 లు (అక్షరాల ఎనిమిది కోట్ల అరవై ఎనిమిది లక్షల పధ్నాలుగు వేల ఆరు వందల ఇరవై రూపాయలు) అందచేయటం జరిగిందన్నారు. ప్రభుత్వం చేసిన మంచి ప్రతీ ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతీ హామీని నెరవేరుస్తుందని రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమన్నారు.. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.* #📰ఆంధ్రా వాయిస్ #✊నారా లోకేష్ #🏛️రాజకీయాలు #📰ప్లాష్ అప్‌డేట్స్ #🎯AP రాజకీయాలు
📰ఆంధ్రా వాయిస్ - auifitauabಣiuಯgrfiin ' IIIG   ا =|={3353 శిబగురేశి  PERM 06 a He ஐ55டி থ০০U auifitauabಣiuಯgrfiin ' IIIG   ا =|={3353 శిబగురేశి  PERM 06 a He ஐ55டி থ০০U - ShareChat