*ఒంగోలు నగరంలో అమృత్ 2.0 సమగ్ర తాగునీటి పథకo భూమిపూజ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ముత్తుముల*
*ఒంగోలు నగర పాలక సంస్థ పరిధిలో రూ.424.42 కోట్ల నిధులతో చేపట్టనున్న అమృత్ 2.0 సమగ్ర తాగునీటి పథకం భూమిపూజ కార్యక్రమంలో గిద్దలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారు పాల్గొన్నారు.*
*ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం పట్టణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా అమృత్ 2.0 పథకం ద్వారా భారీ స్థాయిలో నిధులు కేటాయించి అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతోందన్నారు.*
*424.42 కోట్ల రూపాయలతో అమలు కానున్న ఈ సమగ్ర తాగునీటి పథకం ద్వారా ఒంగోలు నగర ప్రజలకు నాణ్యమైన, నిరంతర తాగునీటి సరఫరా అందుబాటులోకి వస్తుందని, నగరాభివృద్ధికి ఈ ప్రాజెక్టు ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు.*
*ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారు తెలిపారు.* #✊నారా లోకేష్ #📰ప్లాష్ అప్డేట్స్ #📰ఆంధ్రా వాయిస్ #🎯AP రాజకీయాలు #🏛️రాజకీయాలు


