ShareChat
click to see wallet page
search
*బిజెపి పార్టీ వ్యవస్థపక సభ్యులు సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి నిన్న మీడియా సాక్షిగా మోదీపై పరోక్షంగా విరుచుకుపడ్డారు.* *"మనం విశ్వగురువులం అని డబ్బాలు కొట్టుకోవడం ఆపండి..అంటూ ఒకప్పుడు మనం విశ్వగురువులం , ఇప్పుడు అస్సలు కాదు" అంటూ మోదీ బృందం చేస్తున్న అతి ప్రచారాన్ని కడిగిపారేశారు.* *జోషి అగ్రహానికి ప్రధానకారణం 2014లో అధికారం దక్కగానే మోదీ, అమిత్ షా ద్వయం తెలివిగా 75 ఏళ్ల నిబంధనను తెరపైకి తెచ్చి, బీజేపీ పార్టీని జీరో నుండి అధికార స్థాయికి చేర్చిన అద్వానీ, జోషి వంటి సీనియర్ నాయకులను రాజకీయంగా సమాధి చేశారు. '* *మార్గదర్శక్ మండల్' అనే పేరుతో ఒక చెత్త బుట్టను తయారు చేసి అందులో పాత నేతలను పడేశారు. కనీసం మర్యాద ఇవ్వకుండా, సంప్రదించకుండా 2019లో వారి టికెట్లు కట్ చేసి రోడ్డున పడేశారు.* *కానీ అసలు ఆట ఇప్పుడే మొదలైంది. ఇతరులకు రిటైర్మెంట్ రూల్స్ పెట్టిన మోదీకి 2025లో 75 ఏళ్లు నిండినా, తానూ మాత్రం కుర్చీ వదలడం లేదు. "* *మాకు ఒక నీతి.. నీకు ఒక నీతా?" అన్నదే ఇప్పుడు జోషి వంటి సీనియర్ల ఆగ్రహం. బిజెపి అంటే మోదీ, మోదీ అంటే బిజెపి అనే రేంజ్‌లో తన వ్యక్తిగత ఇమేజ్ పెంచుకుంటూ, సెకండ్ లైన్ లీడర్లు ఎవరూ ఎదగకుండా గొంతు నొక్కేస్తున్నారని వారు గుర్రుగా ఉన్నారు*. *పార్టీని ప్రాణం పోసి పెంచిన తమను అవమానించి, ఇప్పుడు మొత్తం పార్టీని తన గుప్పెట్లోకి తీసుకోవడం పట్ల తీవ్ర అసహనం వ్యక్తంచేస్తున్నారు*. *ఈ పరిణామాలన్నీ ఆరెస్సెస్ వర్గాల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. మోదీ ఇమేజ్ పార్టీ సిద్ధాంతం కంటే పెద్దదిగా మారిపోవడం*, *పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం చచ్చిపోవడం పట్ల సంఘ్ పెద్దలు మండిపడుతున్నారు. అందుకే ఇప్పుడు సీనియర్ నేతలను ఉసిగొల్పి మోదీ ఇమేజ్‌ను డ్యామేజ్ చేసే పనిలో ఉన్నారు*. *క్షేత్రస్థాయిలో ధరల పెరుగుదల, నిరుద్యోగంతో పాటు మోడీ పబ్లిసిటీ పిచ్చి అబద్దాలు జనాలు నమ్మకపోవడం మోదీ గ్రాఫ్ పడిపోతుండటం కూడా ఈ తిరుగుబాటుకు ప్రధాన కారణం*. *మోదీ ఇమేజ్ అనే బుడగ ఎప్పుడైనా పేలవచ్చు, కానీ పార్టీ పునాదులు కదిలిపోకూడదని సంఘ్ భావిస్తోంది* *అనేది* *జోషి మాటల వెనుక ఉన్న అసలు విషయం* #😁Hello🙋‍♂️
😁Hello🙋‍♂️ - ShareChat