Andhra: ఏపీలోని వారికి అదిరిపోయే గుడ్ న్యూస్.. ఖాతాల్లో రూ.20 వేలు జమ.. ఎప్పుడంటే
ఆంధ్రప్రదేశ్లోని మత్స్యకార కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి శుభవార్త చెప్పింది. ‘మత్స్యకారుల సేవలో’ పథకం కింద 1.30 లక్షలకుపైగా కుటుంబాల ఖాతాల్లో రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం జమ చేయనుంది. వేట నిషేధ కాలంలో జీవనోపాధి ఇబ్బందులు ఎదుర్కొంటున్న మత్స్యకారులకు ఈ సాయం అందించనున్నారు. నెల్లూరు జిల్లా తుమ్మలపెంటలో జరిగే కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నిధులను విడుదల చేయనున్నారు.