ShareChat
click to see wallet page
search
అయ్యవారు వచ్చేదాకా, అమావాస్య ఆగాల్సిందేనా?? ఇది మన దేశంలో నిత్య సమస్య.. అధికార దరిద్రం. ట్రాఫిక్ రద్దీ ఉన్న నగరాలు, పట్టణాల్లో కూడా ఇదే సమస్య. విఐపి వస్తున్నారంటే ట్రాఫిక్ ఆపేస్తారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కులు, అధికారాలు, అవకాశాలు ఉన్నప్పటికీ ఇలా గంటలు తరబడి ఎండలో, వానలో ట్రాఫిక్ ఆపేసి , ప్రజలను ఇబ్బంది పెట్టడం అలవాటైపోయింది. బెంగళూరులో ఓ సామాన్యుడు పరిస్థితి చూడండి. భార్య గర్భంతో నొప్పులు పడుతుంటే , అత్యవసరంగా కారులో హాస్పిటల్ కు తీసుకుబోతున్నాడు. అయితే మధ్యలో గవర్నర్ కాన్వాయ్ వస్తుందంటూ ఆపేశారు. నిమిషాలు దాటిపోతున్నాయి. అరగంటపైగా సమయం గడిచిపోయినా, పోలీసులు ట్రాఫిక్ క్లియరెన్స్ ఇవ్వలేదు. కాన్వాయ్ రాలేదు .కారులో భార్య పురిటి నొప్పులు పడుతోంది. ఏం చేస్తాడు..? పాపం, సామాన్యుడు , నిస్సహాయంగా కిందకు దిగి పోలీసుల్ని అడిగితే సమాధానం చెప్పకపోవడంతో ఎండలో నడిరోడ్డులో ధర్నాకు దిగాడు. ఒకే ఒక్కడుగానే రోడ్డుపై కూర్చున్నాడు. ఎవరూ మాటసాయం కూడా చేయలేదు. పోలీసులు తమ మీద ఎక్కడి కేసులు పెడతారన్న భయంతో అందరూ అలాగే ఉండిపోయారు . అయితే అతడు కూర్చున్న తర్వాత గాని పోలీసుల్లో కదలిక రాలేదు. పరుగులు తీస్తూ వచ్చి , అతడిని పక్కకు తీసుకుపోయారు.. ఇదే పరిస్థితి, ఈ. దుస్థితి మారేదెన్నడో..?? #💗నా మనస్సు లోని మాట #నేటి ప్రపంచంలో జరుగుతుంది ఇదే...😇 #నేటి లోకం తీరు...!! #sad reality of life😔
💗నా మనస్సు లోని మాట - వీఐపీ కాన్వాయ్ పోయేదాకా భార్యపురిటి నొప్పులు ఆగుతాయా? వీఐపీ కాన్వాయ్ పోయేదాకా భార్యపురిటి నొప్పులు ఆగుతాయా? - ShareChat