• 28 shares
More like this
- Dhruv Kapoorజగన్నాథాష్టకం కదాచిత్-కాలిందీ తటవిపిన సంగీతకరవో ముదాభీరీ నారీవదన కమలాస్వాదమధుపః । రమా శంభు బ్రహ్మామరపతి గణేశార్చిత పదో జగన్నాథః స్వామీ నయనపథగామీ భవతు మే ॥ 1 ॥ భుజే సవ్యే వేణుం శిరసి శిఖిపింఛం కటితటే దుకూలం నేత్రాంతే సహచరకటాక్షం విదధతే । సదా శ్రీమద్వృందావనవసతిలీలాపరిచయో జగన్నాథః స్వామీ నయనపథగామీ భవతు మే ॥ 2 ॥ మహాంభోధేస్తీరే కనకరుచిరే నీలశిఖరే వసన్ ప్రాసాదాంతస్సహజ బలభద్రేణ బలినా । సుభద్రా మధ్యస్థస్సకలసుర సేవావసరదో జగన్నాథః స్వామీ నయనపథగామీ భవతు మే ॥ 3 ॥ కృపా పారావారాస్సజల జలద శ్రేణిరుచిరో రమావాణీ రామస్ఫురదమల పంకెరుహముఖః । సురేంద్రైరారాధ్యః శ్రుతిగణశిఖా గీత చరితో జగన్నాథః స్వామీ నయనపథగామీ భవతు మే ॥ 4 ॥ రథారూఢో గచ్ఛన్ పథి మిలిత భూదేవపటలైః స్తుతి ప్రాదుర్భావం ప్రతిపదముపాకర్ణ్య సదయః । దయాసింధుర్బంధుస్సకల జగతా సింధుసుతయా జగన్నాథః స్వామీ నయనపథగామీ భవతు మే ॥ 5 ॥ పరబ్రహ్మాపీడః కువలయ-దలోత్ఫుల్లనయనో నివాసీ నీలాద్రౌ నిహిత-చరణోఽనంత-శిరసి । రసానందో రాధా-సరస-వపురాలింగన-సఖో జగన్నాథః స్వామీ నయనపథగామీ భవతు మే ॥ 6 ॥ న వై యాచే రాజ్యం న చ కనక మాణిక్య విభవం న యాచేఽహం రమ్యాం నిఖిలజన-కామ్యాం వరవధూమ్ । సదా కాలే కాలే ప్రమథ-పతినా గీతచరితో జగన్నాథః స్వామీ నయనపథగామీ భవతు మే ॥ 7 ॥ హర త్వం సంసారం ద్రుతతరమసారం సురపతే హర త్వం పాపానాం వితతిమపరాం యాదవపతే । అహో దీనోఽనాథే నిహితచరణో నిశ్చితమిదం జగన్నాథః స్వామీ నయనపథగామీ భవతు మే ॥ 8 ॥ జగన్నాథాష్టకం పుణ్యం యః పఠేత్ ప్రయతః శుచిః । సర్వపాప విశుద్ధాత్మా విష్ణులోకం స గచ్ఛతి ॥ ఇతి శ్రీమద్ శంకరాచార్యవిరచితం జగన్నాథాష్టకం సంపూర్ణం॥ #🚩జగన్నాథ రథయాత్ర🛕 ##🛕జగన్నాథ రథయాత్ర🙏 #🙏జై జగన్నాథ ✊ #🙏🏻భక్తి సమాచారం😲 #🌅శుభోదయం7247
- Shiv Karthik#🚩జగన్నాథ రథయాత్ర🛕 సుభద్రా బలభద్రా సమేత శ్రీజగన్నాథస్వామినే నమః! భజే శ్రీచక్ర మధ్యస్థాం దక్షిణోత్తరయోస్సదా! శ్యామావార్తాళిసంసేవ్యాం భవానీం లలితాంబికాం!! వైదిక సంస్కృతిలో సృష్టిస్థితిలయలకు కారణమైన పరబ్రహ్మయే జగన్నాథుడుగా చెప్పబడింది. ఆ జగన్నాథుడైన పరబ్రహ్మ త్రిమూర్త్యాత్మకుడై త్రిమూర్త్యాత్మక శక్తితో ఈ అనంతకోటి బ్రహ్మాండాలను నడిపిస్తున్నాడు. ఆ పరబ్రహ్మయే జగన్నాథుడుగా పురుషోత్తమ క్షేత్రమైన పూరీలో నెలకొని ఉన్నాడు. షణ్మతాలైన శైవ, వైష్ణవ, శాక్తేయ సౌర, గాణాపత్య, స్కాందములలో ఏ సాంప్రదాయానికైనా జగన్నాథుడు ఒకరే కనుక ఆ శక్తులన్నిటి కలబోత పూరీలోనున్న జగన్నాథుడు. స్కాందపురాణం ప్రకారం ఆదిలో నీలమాధవుడిగా నున్న నారాయణుడే జగన్నాథ, బలభద్ర, సుభద్ర, సుదర్శన రూపాలుగా భక్తులను వివిధ విధాలుగా అనుగ్రహించడానికి కొలువయ్యారు. ఆషాఢమాసం జగన్నాథస్వామి వారి రథోత్సవంతో ప్రారంభమై 9 రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయి. వారాహీదేవి నవరాత్రులు కూడా ఆషాఢశుద్ధ పాడ్యమినుండి నవమి వరకు అనేది శాస్త్రములో చెప్పబడింది. రెండింటికీ చాలా సంబంధం ఉన్నది. పూరీలో జరిగే అర్చనా పద్ధతులు గమనించినా ఆ విషయం స్పష్టం అవుతోంది. పూరీలో అధివసించియున్న శ్రీ సుభద్రాదేవి భువనేశ్వరి అయిన లలితమ్మే. సుభద్రాదేవి భువనేశ్వరీ యంత్రముపై ప్రతిష్ఠితమై ఉండడం మరో విశేషం. ఆ యంత్రమునందు అధివసించిన దేవతల నామాలు అనంగమదన, మదనాతుర.. ఈవిధంగా ఖడ్గమాలలో వివరింపబడిన దేవతలే. ‘శ్రీకృష్ణః శ్యామలాదేవీ’ అనే ప్రామాణికతను బట్టి శ్రీకృష్ణుడైన జగన్నాథుడే నీలివర్ణంతో ప్రకాశించే శ్యామలా దేవి. నాగలి, ముసలం ఆయుధాలుగా ధరించిన బలభద్రస్వామియే సాక్షాత్తూ శ్రీవారాహీదేవి. వీరి ఇద్దరి ఆయుధాలు అవే. అంతేకాక రథోత్సవంలో సుభద్రాదేవి రథంపై గల దేవతలలో ప్రధాన దేవత వారాహిగా చెప్పబడింది. బలభద్రునియొక్క మరోశక్తి రూపం వారాహిగా సుభద్రాదేవి రథములో నున్నదని అర్థం. లలితా శ్యామలా వారాహీల వలె సుభద్రాదేవి ఇచ్ఛాశక్తిగా, బలభద్రుడు క్రియాశక్తి, జగన్నాథుడు జ్ఞానశక్తి. వరాహావతారమును దాల్చిన నారాయణుని శక్తియే వారాహి కనుక ఆమె సాక్షాత్తూ లక్ష్మీదేవిగా కూడా చెప్పబడింది. వారాహీదేవి భూమిపై నుండే జీవులకోసం భూమిని ఉద్ధరించి, నాగలితో ఆ భూమిని దున్ని వచ్చిన ఆహారాన్ని ఉపయోగకరంగా పరిణామమొనర్చడానికి రోకలి (ముసలం)ని ఉపయోగించి, సిద్ధమైన ఆహారాన్ని బిడ్డలకు అందిస్తుంది. కృతజ్ఞతను ప్రకటించుకోవడానికైనా ఈ తల్లిని ప్రతిరోజూ నమస్కరించుకోవాలి. ఈమె శ్రీ లలితా పరాభట్టారికకు అభిన్న కనుక లలితాదేవికి సంబంధించిన అష్టోత్తర, సహస్రనామ స్తోత్రాదులను వారాహీదేవి ప్రీతికై చదువవచ్చును. వారాహీదేవి గురించి మార్కండేయ, వామన, దేవీభాగవత, వరాహ, మత్స్య, అగ్నిపురాణాదులలోనే కాక విష్ణుధర్మోత్తర పురాణమువంటి ఉపపురాణాలలో కూడా చెప్పబడింది. అంతేకాక ఎన్నో మంత్ర తంత్ర గ్రంథాలు కూడా విస్తృతంగా వర్ణించాయి. వైష్ణవ, శంకర, శాక్త సాంప్రదాయాలన్నింటిలోనూ వారాహీ ఆరాధన ఉన్నది. సప్తమాతృకలలో వైష్ణవి, కౌమారీలతో పాటుగా వారాహీ ఉన్నది. సప్తమాతృకలలో అయిదవ శక్తిగా ‘పంచమి’గా కూడా కొలువబడుతోంది. మనలోనూ, ప్రపంచంలోనూ గల పంచభూతాలకు అధిదేవత కనుక ఈ దేవతను అర్చించే తిథులలో పంచమీతిథి ప్రధానమైనది. అంతేకాక శ్రీచక్రంలో పంచావరణలతో కూడిన యంత్ర స్వరూపమే వారాహి కనుక ఈమెకు పంచమి అని పేరు. పంచకోశాలతో నిండిన దేహచక్రాన్ని నడిపే తల్లిగా కూడా ఈమెను భావించాలి. లలితా ఉపాసనలో సేనాధ్యక్షురాలిగా, క్రియాశక్తిగా ప్రముఖస్థానం వహించింది. ఇచ్ఛా, జ్ఞానశక్తులు కూడా క్రియాశక్తిలో అంతర్భాగాలే కనుక వారాహీదేవి అనుగ్రహం ఉంటే ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తులు కూడా ఉన్నట్లే. వారాహీదేవిగా వరాహవదనంతో శక్తినంతటినీ నాసిక (ముక్కు)లో నిబిడీకృతం చేసింది. అదే ప్రాణశక్తి, సమస్త బ్రహ్మాండాలను ఆ ఊపిరితోనే నిర్వహించే క్రియాశక్తి. షట్చక్రాలలో మణిపూర (జలతత్త్వం), స్వాధిష్ఠాన(అగ్నితత్త్వం), మూలాధార చక్రము (భూతత్త్వం)లకు అధిష్ఠాతృదేవిగా యోగశాస్త్రంలో చెప్పబడింది. అదేవిధంగా లలితమ్మ ఆజ్ఞాచక్రస్థానమైన భృకుటినుండి హల, ముసలాలను తీసి వారాహీదేవికి ఇచ్చిన కారణమున ఆజ్ఞాచక్రాధిష్ఠాన దేవతగా కూడా వారాహీదేవి చెప్పబడుతోంది. లలితాదేవి భక్తులను ఆ అమ్మదగ్గరకు చేర్చడంలో కరుణామయి, ధైర్య వీర్య విజయాలకు ప్రతీక. భూమిని హిరణ్యాక్షుడు బాధించినపుడు ఈ శక్తియే వరాహస్వామిగా భూమిని ఉద్ధరించింది. ముఖ్యంగా భూరక్షణకు, భూమిపై జీవించే మనందరినీ రక్షించేశక్తి శ్రీవారాహీ దేవి. ఆత్మన్యూనతా భావం గలవారు రోజూ వారాహీదేవికి నమస్కరిస్తే చాలు ఆత్మస్థైర్యం వస్తుంది. వారాహీ పంచకంలో చెప్పినట్లు వారాహి కరుణారస హృదయ. అనేక జన్మలకొద్దీ సంసారాదులలో కూరుకుపోతున్న వారిని ఉద్ధరించడానికే అమ్మవారు రెండు కోరలతోనున్న వరాహ వదనముతోనున్న రూపాన్ని దాల్చింది. జగద్గురు శ్రీ ఆదిశంకరులు ఈ విషయాన్నే సౌందర్యలహరిలో ‘జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపు వరాహస్య భవతి” అని చెప్పారు. వారాహి ఆయుధాలను పరిశీలిస్తే వారాహీదేవిలోనే పూరీలోగల జగన్నాథ, సుభద్రా బలభద్రులను దర్శించవచ్చు. శంఖచక్రములు జగన్నాథస్వామికి ప్రతీకలు కాగా నాగలి, రోకలి బలభద్రస్వామి చేతిలోని ఆయుధాలు. ముందుగా చెప్పినట్లు భువనేశ్వరీ దేవి రూపమైన సుభద్రాదేవి శక్తులే పాశము, అంకుశము. ఒకే పరమాత్మ జగన్నిర్వహణ కోసం విభిన్న రూపాలైనట్లు సనాతన సాంప్రదాయం. ‘జ’కారస్తు జగన్నాథః, బలభద్రో ‘గ’కారకః, ‘న’కారో సుభద్ర రూపా చ; ‘థ’కారోపి సుదర్శనః. పరబ్రహ్మ అయిన జగన్నాథుడే ఈ నాలుగు రూపములలో వ్యక్తమయ్యారు. వారాహీ మంత్రములో ‘గ’కారం ప్రధానమైనది. ఆ రూపమైన బలభద్రుడు ‘గ’కార శబ్దవాచ్యుడన్నది శాస్త్రం. అనాదిగా భారతీయ సంస్కృతి సమన్వయాత్మకంగా చెప్తున్న త్రిమూర్త్యాత్మక శక్తికి వందనములు. #🌅శుభోదయం ##🛕జగన్నాథ రథయాత్ర🙏 #🙏జై జగన్నాథ ✊ #🙏🏻భక్తి సమాచారం😲1610
- Anjaiah Soma#🙏🏾🌹శ్రీ పూరి జగన్నాథ స్వామి 🕉️🔱💫👑 #జగన్నాథ స్వామి.. #జై జగన్నాథ స్వామి🙏🙏 #జగన్నాథ స్వామి #🙏జై జగన్నాథ ✊294325
- Satya Vadapalliజగన్నాథాష్టకం కదాచిత్-కాలిందీ తటవిపిన సంగీతకరవో ముదాభీరీ నారీవదన కమలాస్వాదమధుపః । రమా శంభు బ్రహ్మామరపతి గణేశార్చిత పదో జగన్నాథః స్వామీ నయనపథగామీ భవతు మే ॥ 1 ॥ భుజే సవ్యే వేణుం శిరసి శిఖిపింఛం కటితటే దుకూలం నేత్రాంతే సహచరకటాక్షం విదధతే । సదా శ్రీమద్వృందావనవసతిలీలాపరిచయో జగన్నాథః స్వామీ నయనపథగామీ భవతు మే ॥ 2 ॥ మహాంభోధేస్తీరే కనకరుచిరే నీలశిఖరే వసన్ ప్రాసాదాంతస్సహజ బలభద్రేణ బలినా । సుభద్రా మధ్యస్థస్సకలసుర సేవావసరదో జగన్నాథః స్వామీ నయనపథగామీ భవతు మే ॥ 3 ॥ కృపా పారావారాస్సజల జలద శ్రేణిరుచిరో రమావాణీ రామస్ఫురదమల పంకెరుహముఖః । సురేంద్రైరారాధ్యః శ్రుతిగణశిఖా గీత చరితో జగన్నాథః స్వామీ నయనపథగామీ భవతు మే ॥ 4 ॥ రథారూఢో గచ్ఛన్ పథి మిలిత భూదేవపటలైః స్తుతి ప్రాదుర్భావం ప్రతిపదముపాకర్ణ్య సదయః । దయాసింధుర్బంధుస్సకల జగతా సింధుసుతయా జగన్నాథః స్వామీ నయనపథగామీ భవతు మే ॥ 5 ॥ పరబ్రహ్మాపీడః కువలయ-దలోత్ఫుల్లనయనో నివాసీ నీలాద్రౌ నిహిత-చరణోఽనంత-శిరసి । రసానందో రాధా-సరస-వపురాలింగన-సఖో జగన్నాథః స్వామీ నయనపథగామీ భవతు మే ॥ 6 ॥ న వై యాచే రాజ్యం న చ కనక మాణిక్య విభవం న యాచేఽహం రమ్యాం నిఖిలజన-కామ్యాం వరవధూమ్ । సదా కాలే కాలే ప్రమథ-పతినా గీతచరితో జగన్నాథః స్వామీ నయనపథగామీ భవతు మే ॥ 7 ॥ హర త్వం సంసారం ద్రుతతరమసారం సురపతే హర త్వం పాపానాం వితతిమపరాం యాదవపతే । అహో దీనోఽనాథే నిహితచరణో నిశ్చితమిదం జగన్నాథః స్వామీ నయనపథగామీ భవతు మే ॥ 8 ॥ జగన్నాథాష్టకం పుణ్యం యః పఠేత్ ప్రయతః శుచిః । సర్వపాప విశుద్ధాత్మా విష్ణులోకం స గచ్ఛతి ॥ ఇతి శ్రీమద్ శంకరాచార్యవిరచితం జగన్నాథాష్టకం సంపూర్ణం॥ #🚩జగన్నాథ రథయాత్ర🛕 ##🛕జగన్నాథ రథయాత్ర🙏 #🙏జై జగన్నాథ ✊ #🙏🏻భక్తి సమాచారం😲 #🌅శుభోదయం5841
- Satya Vadapalli#🚩జగన్నాథ రథయాత్ర🛕 విశాలమైన రథాలపై విహరించనున్న శ్రీ జగన్నాథ స్వామి ఒడిశాలోని పూరీ క్షేత్రంలో జరిగే ప్రపంచ ప్రఖ్యాత శ్రీ జగన్నాథ రథయాత్ర జూలై 16 నుంచి ప్రారంభమవుతోంది. ఆలయ సంప్రదాయం ప్రకారం ఆషాఢ శుక్ల ద్వితీయ తిథికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే ఈ రోజే శ్రీ జగన్నాథ రథయాత్ర ప్రారంభమవుతుంది. ఈ సంవత్సరం రథయాత్ర జూలై 16, గురువారం ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా శ్రీ జగన్నాథ స్వామి తన అన్నయ్య శ్రీ బలభద్రుడు, చెల్లెలు శ్రీ సుభద్రాదేవితో కలిసి మూడు వేర్వేరు రథాలపై కొలువై భక్తులకు దర్శనమిస్తారు. వారు తమ మేనత్త గుండిచా దేవాలయానికి మహా వైభవంగా ప్రయాణిస్తారు. శ్రీ జగన్నాథ స్వామి నందిఘోష రథంపై, శ్రీ బలభద్రుడు తాళధ్వజ రథంపై, శ్రీ సుభద్రాదేవి దర్పదళన రథంపై విహరిస్తారు. ప్రపంచ ప్రఖ్యాత ఈ రథయాత్ర జూలై 16 నుంచి జూలై 27 వరకు కొనసాగుతుంది. మొత్తం కార్యక్రమం 12 రోజుల పాటు జరుగుతుంది. అయితే రథయాత్ర ఏర్పాట్లు ఎంతో ముందుగానే ప్రారంభమవుతాయి. ఇప్పుడు రథయాత్రకు సంబంధించిన శుభ ముహూర్తం, ప్రధాన విశేషాలు, పూర్తి కార్యక్రమ వివరాలను తెలుసుకుందాం. శ్రీ జగన్నాథ రథయాత్ర 2026 – తేది మరియు శుభ ముహూర్తం శ్రీ జగన్నాథ రథయాత్ర ఆషాఢ శుక్ల ద్వితీయ రోజున ప్రారంభమవుతుంది. శ్రీ జగన్నాథ రథయాత్ర: 16 జూలై 2026 (గురువారం): రథయాత్ర ప్రారంభం 20 జూలై 2026: హేరా పంచమి 24 జూలై 2026 : బహుదా యాత్ర (తిరుగు రథయాత్ర) 25 జూలై 2026 : సునా బేష (స్వర్ణ అలంకారం) 27 జూలై 2026 : నీలాద్రి బిజే – శ్రీ జగన్నాథ రథయాత్ర ముగింపు శ్రీ జగన్నాథ రథయాత్రలో శ్రీ జగన్నాథ స్వామి, శ్రీ బలభద్రుడు, శ్రీ సుభద్రాదేవి ముగ్గురూ మూడు వేర్వేరు రథాలలో విహరిస్తారు. దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చి, భారీ తాళ్లతో ఆ విశాల రథాలను లాగుతారు. ఈ రథాలు శ్రీ జగన్నాథ ఆలయం నుంచి గుండిచా ఆలయం వరకు తీసుకెళ్లబడతాయి. అనంతరం స్వామివారు తిరిగి తమ ఆలయానికి చేరుకున్నప్పుడు పూరీ గజపతి మహారాజు సంప్రదాయబద్ధంగా బంగారు చీపురుతో రథ వేదికను శుభ్రపరిచే "ఛేరా పహారా" (Chhera Pahanra) సేవను నిర్వహిస్తారు. ఇది రథయాత్రలో అత్యంత పవిత్రమైన, విశిష్టమైన ఆచారంగా భావించబడుతుంది. #🙏🏻భక్తి సమాచారం😲 #🙏జై జగన్నాథ ✊ ##🛕జగన్నాథ రథయాత్ర🙏 #🌅శుభోదయం1516
- Satya Vadapalli#🚩జగన్నాథ రథయాత్ర🛕 సుభద్రా బలభద్రా సమేత శ్రీజగన్నాథస్వామినే నమః! భజే శ్రీచక్ర మధ్యస్థాం దక్షిణోత్తరయోస్సదా! శ్యామావార్తాళిసంసేవ్యాం భవానీం లలితాంబికాం!! వైదిక సంస్కృతిలో సృష్టిస్థితిలయలకు కారణమైన పరబ్రహ్మయే జగన్నాథుడుగా చెప్పబడింది. ఆ జగన్నాథుడైన పరబ్రహ్మ త్రిమూర్త్యాత్మకుడై త్రిమూర్త్యాత్మక శక్తితో ఈ అనంతకోటి బ్రహ్మాండాలను నడిపిస్తున్నాడు. ఆ పరబ్రహ్మయే జగన్నాథుడుగా పురుషోత్తమ క్షేత్రమైన పూరీలో నెలకొని ఉన్నాడు. షణ్మతాలైన శైవ, వైష్ణవ, శాక్తేయ సౌర, గాణాపత్య, స్కాందములలో ఏ సాంప్రదాయానికైనా జగన్నాథుడు ఒకరే కనుక ఆ శక్తులన్నిటి కలబోత పూరీలోనున్న జగన్నాథుడు. స్కాందపురాణం ప్రకారం ఆదిలో నీలమాధవుడిగా నున్న నారాయణుడే జగన్నాథ, బలభద్ర, సుభద్ర, సుదర్శన రూపాలుగా భక్తులను వివిధ విధాలుగా అనుగ్రహించడానికి కొలువయ్యారు. ఆషాఢమాసం జగన్నాథస్వామి వారి రథోత్సవంతో ప్రారంభమై 9 రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయి. వారాహీదేవి నవరాత్రులు కూడా ఆషాఢశుద్ధ పాడ్యమినుండి నవమి వరకు అనేది శాస్త్రములో చెప్పబడింది. రెండింటికీ చాలా సంబంధం ఉన్నది. పూరీలో జరిగే అర్చనా పద్ధతులు గమనించినా ఆ విషయం స్పష్టం అవుతోంది. పూరీలో అధివసించియున్న శ్రీ సుభద్రాదేవి భువనేశ్వరి అయిన లలితమ్మే. సుభద్రాదేవి భువనేశ్వరీ యంత్రముపై ప్రతిష్ఠితమై ఉండడం మరో విశేషం. ఆ యంత్రమునందు అధివసించిన దేవతల నామాలు అనంగమదన, మదనాతుర.. ఈవిధంగా ఖడ్గమాలలో వివరింపబడిన దేవతలే. ‘శ్రీకృష్ణః శ్యామలాదేవీ’ అనే ప్రామాణికతను బట్టి శ్రీకృష్ణుడైన జగన్నాథుడే నీలివర్ణంతో ప్రకాశించే శ్యామలా దేవి. నాగలి, ముసలం ఆయుధాలుగా ధరించిన బలభద్రస్వామియే సాక్షాత్తూ శ్రీవారాహీదేవి. వీరి ఇద్దరి ఆయుధాలు అవే. అంతేకాక రథోత్సవంలో సుభద్రాదేవి రథంపై గల దేవతలలో ప్రధాన దేవత వారాహిగా చెప్పబడింది. బలభద్రునియొక్క మరోశక్తి రూపం వారాహిగా సుభద్రాదేవి రథములో నున్నదని అర్థం. లలితా శ్యామలా వారాహీల వలె సుభద్రాదేవి ఇచ్ఛాశక్తిగా, బలభద్రుడు క్రియాశక్తి, జగన్నాథుడు జ్ఞానశక్తి. వరాహావతారమును దాల్చిన నారాయణుని శక్తియే వారాహి కనుక ఆమె సాక్షాత్తూ లక్ష్మీదేవిగా కూడా చెప్పబడింది. వారాహీదేవి భూమిపై నుండే జీవులకోసం భూమిని ఉద్ధరించి, నాగలితో ఆ భూమిని దున్ని వచ్చిన ఆహారాన్ని ఉపయోగకరంగా పరిణామమొనర్చడానికి రోకలి (ముసలం)ని ఉపయోగించి, సిద్ధమైన ఆహారాన్ని బిడ్డలకు అందిస్తుంది. కృతజ్ఞతను ప్రకటించుకోవడానికైనా ఈ తల్లిని ప్రతిరోజూ నమస్కరించుకోవాలి. ఈమె శ్రీ లలితా పరాభట్టారికకు అభిన్న కనుక లలితాదేవికి సంబంధించిన అష్టోత్తర, సహస్రనామ స్తోత్రాదులను వారాహీదేవి ప్రీతికై చదువవచ్చును. వారాహీదేవి గురించి మార్కండేయ, వామన, దేవీభాగవత, వరాహ, మత్స్య, అగ్నిపురాణాదులలోనే కాక విష్ణుధర్మోత్తర పురాణమువంటి ఉపపురాణాలలో కూడా చెప్పబడింది. అంతేకాక ఎన్నో మంత్ర తంత్ర గ్రంథాలు కూడా విస్తృతంగా వర్ణించాయి. వైష్ణవ, శంకర, శాక్త సాంప్రదాయాలన్నింటిలోనూ వారాహీ ఆరాధన ఉన్నది. సప్తమాతృకలలో వైష్ణవి, కౌమారీలతో పాటుగా వారాహీ ఉన్నది. సప్తమాతృకలలో అయిదవ శక్తిగా ‘పంచమి’గా కూడా కొలువబడుతోంది. మనలోనూ, ప్రపంచంలోనూ గల పంచభూతాలకు అధిదేవత కనుక ఈ దేవతను అర్చించే తిథులలో పంచమీతిథి ప్రధానమైనది. అంతేకాక శ్రీచక్రంలో పంచావరణలతో కూడిన యంత్ర స్వరూపమే వారాహి కనుక ఈమెకు పంచమి అని పేరు. పంచకోశాలతో నిండిన దేహచక్రాన్ని నడిపే తల్లిగా కూడా ఈమెను భావించాలి. లలితా ఉపాసనలో సేనాధ్యక్షురాలిగా, క్రియాశక్తిగా ప్రముఖస్థానం వహించింది. ఇచ్ఛా, జ్ఞానశక్తులు కూడా క్రియాశక్తిలో అంతర్భాగాలే కనుక వారాహీదేవి అనుగ్రహం ఉంటే ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తులు కూడా ఉన్నట్లే. వారాహీదేవిగా వరాహవదనంతో శక్తినంతటినీ నాసిక (ముక్కు)లో నిబిడీకృతం చేసింది. అదే ప్రాణశక్తి, సమస్త బ్రహ్మాండాలను ఆ ఊపిరితోనే నిర్వహించే క్రియాశక్తి. షట్చక్రాలలో మణిపూర (జలతత్త్వం), స్వాధిష్ఠాన(అగ్నితత్త్వం), మూలాధార చక్రము (భూతత్త్వం)లకు అధిష్ఠాతృదేవిగా యోగశాస్త్రంలో చెప్పబడింది. అదేవిధంగా లలితమ్మ ఆజ్ఞాచక్రస్థానమైన భృకుటినుండి హల, ముసలాలను తీసి వారాహీదేవికి ఇచ్చిన కారణమున ఆజ్ఞాచక్రాధిష్ఠాన దేవతగా కూడా వారాహీదేవి చెప్పబడుతోంది. లలితాదేవి భక్తులను ఆ అమ్మదగ్గరకు చేర్చడంలో కరుణామయి, ధైర్య వీర్య విజయాలకు ప్రతీక. భూమిని హిరణ్యాక్షుడు బాధించినపుడు ఈ శక్తియే వరాహస్వామిగా భూమిని ఉద్ధరించింది. ముఖ్యంగా భూరక్షణకు, భూమిపై జీవించే మనందరినీ రక్షించేశక్తి శ్రీవారాహీ దేవి. ఆత్మన్యూనతా భావం గలవారు రోజూ వారాహీదేవికి నమస్కరిస్తే చాలు ఆత్మస్థైర్యం వస్తుంది. వారాహీ పంచకంలో చెప్పినట్లు వారాహి కరుణారస హృదయ. అనేక జన్మలకొద్దీ సంసారాదులలో కూరుకుపోతున్న వారిని ఉద్ధరించడానికే అమ్మవారు రెండు కోరలతోనున్న వరాహ వదనముతోనున్న రూపాన్ని దాల్చింది. జగద్గురు శ్రీ ఆదిశంకరులు ఈ విషయాన్నే సౌందర్యలహరిలో ‘జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపు వరాహస్య భవతి” అని చెప్పారు. వారాహి ఆయుధాలను పరిశీలిస్తే వారాహీదేవిలోనే పూరీలోగల జగన్నాథ, సుభద్రా బలభద్రులను దర్శించవచ్చు. శంఖచక్రములు జగన్నాథస్వామికి ప్రతీకలు కాగా నాగలి, రోకలి బలభద్రస్వామి చేతిలోని ఆయుధాలు. ముందుగా చెప్పినట్లు భువనేశ్వరీ దేవి రూపమైన సుభద్రాదేవి శక్తులే పాశము, అంకుశము. ఒకే పరమాత్మ జగన్నిర్వహణ కోసం విభిన్న రూపాలైనట్లు సనాతన సాంప్రదాయం. ‘జ’కారస్తు జగన్నాథః, బలభద్రో ‘గ’కారకః, ‘న’కారో సుభద్ర రూపా చ; ‘థ’కారోపి సుదర్శనః. పరబ్రహ్మ అయిన జగన్నాథుడే ఈ నాలుగు రూపములలో వ్యక్తమయ్యారు. వారాహీ మంత్రములో ‘గ’కారం ప్రధానమైనది. ఆ రూపమైన బలభద్రుడు ‘గ’కార శబ్దవాచ్యుడన్నది శాస్త్రం. అనాదిగా భారతీయ సంస్కృతి సమన్వయాత్మకంగా చెప్తున్న త్రిమూర్త్యాత్మక శక్తికి వందనములు. #🌅శుభోదయం ##🛕జగన్నాథ రథయాత్ర🙏 #🙏జై జగన్నాథ ✊ #🙏🏻భక్తి సమాచారం😲17373
- Satya Vadapalliఆషాఢ శుద్ధ విదియ నాడు మోక్ష క్షెత్రమైన "పూరీ" లో జగన్నాధ బలభద్ర సుభద్ర రధయాత్ర అత్యంత వైభవం గా జరుగుతుంది. జగత్ప్రసిద్ధమైన ఈ రధయాత్ర పరమ పావనం. "రధస్థం వామనం ద్రుష్ట్వా పునర్జన్మ న విద్యతే " -- రధాన్న ఉన్న వామనుని చుసిన వారికి పునర్జన్మ ఉండదు . ఈ రోజునే శ్రీ రాముని రథోత్సవం అని ధర్మశాస్త్ర వచనం ! విష్ణువునకు అత్యంత ప్రీతికరమైన రోజు ఇది . హరె రామ హరె రామ రామ రామ హరె హరె హరె కృష్ణ హరె కృష్ణ కృష్ణ కృష్ణ హరె హరె #🌺🙏పూరీ జగన్నాథ స్వామి రథయాత్ర🎪🚩 ##🛕జగన్నాథ రథయాత్ర🙏 #🙏జై జగన్నాథ ✊ #🙏🏻భక్తి సమాచారం😲 #దేవుళ్ళ స్టేటస్3332
- Anjaiah Soma#🍚పవిత్ర మహాప్రసాదం🌸 #జై జగన్నాథ స్వామి🙏🙏 #శ్రీ శ్రీ జగన్నాథ బలదేవ్ సుబద్ర మహారాణి కీ జై 🙏🙏🌷💐🌷💐 #🙏జై జగన్నాథ ✊106174
- Krishna Reddy#జై జగన్నాథ స్వామి🙏🙏 #శ్రీ శ్రీ జగన్నాథ బలదేవ్ సుబద్ర మహారాణి కీ జై 🙏🙏🌷💐🌷💐 #🙏జై జగన్నాథ ✊ #భక్తి స్పెషల్1311