: అర్ధరాత్రి రైలులో దొంగల బీభత్సం..
పోలీసులపై ఎదురుకాల్పులు!
బాపట్ల జిల్లాలో అర్ధరాత్రి రైలులో దొంగలు బీభత్సం సృష్టించారు. చెంగల్పట్టు నుంచి కాకినాడ వెళ్తున్న సర్కార్ ఎక్స్ప్రెస్పై అప్పికట్ల-మాచవరం మధ్య 2:30 సమయంలో దుండగులు దాడి చేశారు. ప్రయాణికుల నుంచి బంగారు ఆభరణాలు లాక్కున్నారు. బాధితులు కేకలు వేయడంతో చైన్ లాగి పరారయ్యారు. వీరిని అడ్డుకునేందుకు GRP పోలీసులు కాల్పులు జరపగా, దొంగలు కూడా ఎదురుకాల్పులు చేశారు. ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది.
#📰ఈరోజు అప్డేట్స్ #🆕Current అప్డేట్స్📢 #🆕షేర్చాట్ అప్డేట్స్ #👉నేరాలు - ఘోరాలు🚨


