Vinni
*పవిత్రోత్సవాలు రెండో రోజు – స్నపన తిరుమంజనం*
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు సోమవారం రెండో రోజుకు చేరుకున్నాయి. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య పాలు, పెరుగు, తేనె, చందనం తదితర సుగంధ ద్రవ్యాలతో స్వామి, అమ్మవార్లకు విశేష అభిషేకం నిర్వహించారు.#🙏శ్రీ వెంకటేశ్వర స్వామి