ShareChat
click to see wallet page
search
🪷159లింగ మహాపురాణం🪷 🍀షడక్షర, పంచాక్షర శివ మంత్రాలు - మహిమ🍀 #నూటయాభైతొమ్మిదవభాగం# పరమేశ్వరుడి షడక్షర మంత్రమైన "ఓం నమః  శివాయ" సర్వ సిద్ది ప్రదాయకమైనది.  పంచాక్షరమైన "శివతరాయ" మయస్కరాయ" కూడా శుభకరమైన దివ్య మంత్రాలు. ప్రధాన పురుషుడైన రుద్రుని మంత్రము "ఓం నమో శంకరాయ" అనే సప్తాక్షర మంత్రము. బ్రహ్మ విష్ణు ఇంద్రాది దేవతలు, మహర్షులు, దేవర్షులు, మునులు, బ్రాహ్మణులు ఈ శివ మంత్రములతో నిత్యం శంకరుని పూజిస్తారు. నిరంతరం " నమః శివాయ,  నమః శంకరాయ, రుద్రాయ శివతరాయ" మొదలైన మంత్రాల జపము చేయడం వలన బ్రహ్మహత్యాది ఘోర పాపముల నుండి విముక్తి పొందుతున్నారు. ఇందుకు సంబంధించిన పురాతన కథ ఒకటి మీకు చెబుతాను. విశాలుడు అను వ్యక్తి ఘోరపాపముల నుండి శివమంత్ర జపము వలన విముక్తి పొందటం ఈ కథ తెలియజేస్తుంది. పూర్వము మేఘవాహన అనే కల్పము ఉన్నది.  ఆ కల్పములో విష్ణువు రుద్రుని యొక్క అతి భారము చేత దుఖితుడై ఉన్నాడు. దుఖం తొలగించుకోవడానికి విష్ణువు మేఘ రూపం దాల్చి శివుని ప్రసన్నుడిని చేసుకోవడానికి ఘోర తపము చేసాడు. శివుడు ప్రసన్నుడై తమముతో విష్ణువుకి దుఖము తట్టుకునేంత అద్భుత బలము, ఐశ్వర్యం ప్రసాదించాడు. మేఘరూపంలో ఉండటం వలన ఆ కల్పానికి మేఘవాహన కల్పము అని పేరు వచ్చింది. మేఘవాహన కల్పములో మూడవ మన్వంతరం లోని త్రేతాయుగంలో దుందుముఖుడు అనే శక్తిశాలి అయిన బ్రాహ్మణుడు ఉండేడి వాడు. అతడు ముని శాపము పొంది దుష్ట ప్రవర్తన కలవాడు అయ్యాడు. అమావాస్య తిథినాడు పగటి సమయంలో రుద్రదేవత ముహుర్తంలో భార్య వద్దంటున్నా దాంపత్య సుఖం అనుభవించాడు. ఫలితంగా వారికి విశాలుడు అనే పుత్రుడు జన్మించాడు. మిత్రుడు, వరుణుడు అనే ఋషులు విశాలుని జాతకం చూసి దుందుముఖునితో "నీ పుత్రుడు దుష్టుడై నీచ ప్రవర్తన కలవాడు అవుతాడు. అయినా బృహస్పతి ప్రభావంతో దుష్ట ప్రవర్తన నుండి విముక్తి పొంది మంచివాడై మీకు సద్గతులు కలుగ చేస్తాడు" అని ఏకాంతంగా చెప్పి వెళ్లి పోయారు. దుందుముఖుడు కుమారుడికి జాతకర్మాది సంస్కారాలు చేశాడు. ఉపనయనం చేసి తనే వేద విద్యలు బోధించాడు. యుక్తవయస్సుడైన విశాలునికి తగిన కన్యను ఇచ్చి వివాహం చేసి తన ఆశ్రమంలో ఉంచి చెడుబుద్దులు రాకుండా జ్రాగ్రత్తగా చూసుకుంటున్నాడు. ఒకసారి పని మీద వెళ్లిన విశాలుడికి అరణ్యదారిలో ఆటవిక స్త్రీ పరిచయం అయ్యింది. ఆమె మోహంలో పడిన విశాలుడు తన ఇంటిని, భార్యను, ఆచార వ్యవహారాలను వదలి వేసాడు. మద్యపాన లోలుడై ఆ స్త్రీతో కలసి అడవిలో ఉండసాగాడు. అరణ్యంలో  స్త్రీతో ఉంటున్న విశాలుడు ఒకరోజు మద్యపాన మత్తులో కోపం చెంది ఆ స్త్రీని చంపి పారిపోయాడు . ఈ సంగతి తెలిసిన ఆ స్త్రీ సోదరులు విశాలుడి కోసం వెతికి దొరకకపోతే, ప్రతీకారేశ్చతో విశాలుడి తల్లి తండ్రులను, ధర్మపత్నిని చంపివేశారు. ఆ సోదరులను రాజభటులు పట్టుకుని రాజు వద్దకు తీసుకెళ్లగా వారికి మరణశిక్ష వేసి అమలు పరిచారు. ఆ విధంగా కుటుంబం మొత్తం సర్వనాశనం అవ్వడంతో విశాలుడు విరక్తుడై అడవులలో ఒంటరిగా తిరుగ సాగాడు. కొంతకాలానికి రుద్ర జపములో ఉన్న ఒక ముని ఆశ్రమం చేరాడు. ఆ మంత్రాల శబ్దం విశాలుని ఆకర్షించింది. గమనించిన ముని అతనికి శివుని షడక్షర, పంచాక్షర మంత్రాలు ఉపదేశం చేశాడు. పాశుపత వ్రత విధానము బోధించాడు. ఆ ముని ఆశ్రమంలో ఉంటూ విశాలుడు విధి పూర్వకంగా పాశుపత వ్రతము పన్నెండు నెలలు చేశాడు. వ్రత సమయంలో పంచాక్షర, షడక్షర శివ మంత్రాలను నూరు వేల సార్లు లక్ష లక్ష చొప్పున చేశాడు. మంత్ర సిద్ది పొందిన విశాలుడు మరణించినప్పుడు యముడు స్వయంగా వచ్చి గౌరవంగా తీసుకెళ్లి స్వర్గం వెళ్లడానికి దివ్య విమానం ఎక్కించాడు. విశాలుడి శివ మంత్ర జప మహిమతో విశాలుని తల్లి తండ్రులు, ధర్మపత్నితో బాటు విశాలునితో గడిపిన స్త్రీ, ఆమె సోదరులు కూడా నరకం నుండి విముక్తులై ఆ దివ్య విమానంలోకి వచ్చి యున్నారు. విశాలుడు తనవారందరితో కలసి స్వర్గలోకం చేరగా, ఇంద్రుడు స్వయముగా వచ్చి స్వాగతం పలికి తీసుకెళ్ళాడు. విశాలునికి గణాధిపత్యం ఇచ్చి శివుని ప్రియభక్తునిగా చేసారు. మునులారా! శివుని  పంచాక్షర, షడక్షర, సప్తాక్షర మంత్రాలు, విష్ణువు యొక్క అష్టాక్షర, ద్వాదశాక్షర మంత్రాలు అత్యంత మహిమ కలవి అనడంలో సందేహం లేదు. యజ్ఞయాగాదుల కంటే మంత్ర జపం, స్మరణం కోటి రెట్లు పుణ్యము ఇస్తుంది" అని సూత మహర్షి ఆ రోజుకి భాషణం ముగించాడు. https://chat.whatsapp.com/DnFG7pWG3BkH6MKxaSFRFb #🌅శుభోదయం #🙏శుభాకాంక్షలు #🙏ఓం నమః శివాయ🙏ૐ .*తరువాత కధ రేపటి భాగంలో చదువుదాం*. 🌹శ్రీకాంత్ గంజికుంట కరణంగారి సౌజన్యంతో🌹 💜   ఓం శ్రీఉమా మహేశ్వరాయ నమ:💜 🙏లోకా:సమస్తాః సుఖినోభవన్తు🙏 రేపటి తరానికి బ్రతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*      (సర్వం శ్రీశివార్పణమస్తు)                 🌷🙏🌷 శుభమస్తు 🌹 🌷 ♥️ 🙏 స్వస్తి. 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺
🌅శుభోదయం - ShareChat
భగవాన్ రమణ
Convite para grupo do WhatsApp