*అసలు శాస్త్రం ఏం చెబుతుందో*
#మీకు తెలుసా 🤔❓
కాశికి వెళ్తే ఒక కాయ, ఒక పండు వదిలేయాలని అంటారు కదా?
చాలామంది వంకాయనో, మామిడి పండునో వదిలేసి, ఇక
జీవితాంతం వాటిని తినడం మానేస్తారు.
కానీ శాస్త్రంలో ఎక్కడా ఇలా చెప్పలేదు..
కాశీలో వదలాల్సింది *'కాయాపేక్ష'* మరియు *'ఫలాపేక్ష'*.
కాయాపేక్ష అంటే - ఈ కాయం (శరీరం) పై ఉన్న మితిమీరిన మోహం.
ఫలాపేక్ష అంటే - మనం చేసే పనుల వల్ల వచ్చే ఫలితంపై ఉండే స్వార్థం.
ఈ రెండింటినీ గంగలో వదిలేసి, నిర్మలమైన భక్తితో విశ్వనాథుడిని దర్శించుకోమని పెద్దల మా..
కాలక్రమేణా 'కాయాపేక్ష' కాస్తా 'కాయ'గా, 'ఫలాపేక్ష' కఠిస్తా 'పండు'గా మారిపోయాయి. కేవలం వంకాయనో, అరటిపండునో వదిలేస్తే పుణ్యం రాదు.
మనలోని అహంకారాన్ని, స్వార్థాన్ని వదిలినప్పుడే నిజమైన ఆధ్యాత్మిక జ్ఞానం సిద్ధిస్తుంది..🤗


