Mohan
6K views • 4 days ago
#🌍నా తెలంగాణ #📰ఈరోజు అప్డేట్స్ #🆕Current అప్డేట్స్📢 #BRS party 👨🏻🌾 రైతులు రక్తం చల్లినా రేవంత్ మనసు కరుగుతలేదు 🆘
🚨 కాలం తెచ్చిన కరువు కాదిది. కాంగ్రెస్ తెచ్చిన కరువు ✅
🎯 నాలుగుసార్లు రైతుబంధు ఎగ్గొట్టిన వంచకుడు రేవంత్
📢 కావాలనే కాళేశ్వరం నీళ్లెత్తకుండా సతాయిస్తున్నారు
📣 రైతుల పాలిట దగాకోరు కాంగ్రెస్ ను తరిమికొట్టాలె
🔹 నాలుగు రైతు కుటుంబాలకు పార్టీ నుంచి ఆర్థికసాయం
🔸 దళితవాడలో పర్యటన. కార్యకర్త ఇంట్లో భోజనం
💥 లక్సెట్టిపేటలో సభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
గోడ కూలి నలుగురు రైతులు చనిపోతే ఒక్క రైతుకే రూ.5 లక్షలు వచ్చినయ్. ఆ 5 లక్షలు కూడా కేసీఆర్ పెట్టిన రైతుబీమా నుంచి ఇచ్చిండ్రు. మిగిలిన ముగ్గురికి ఐదు లక్షలో.. ఐదు వేలో కాదు గదా.. ఐదు పైసలు కూడా ప్రభుత్వం నుంచి సాయమందలేదు. ఇంత దుర్మార్గ, కిరాతకమైన ప్రభుత్వం ఇవాళ రాష్ట్రంలో ఉన్నది. పంటలకు కాపలా కాసి నలుగురు రైతులు చనిపోయినా రేవంత్రెడ్డికి చీమ కుట్టినట్టు కూడా లేదు.
రేవంత్రెడ్డి ప్రభుత్వం వచ్చి 32 నెలలైంది. ఇప్పటికీ మేడిగడ్డలో పిల్లర్లకు రిపేర్ చేస్తలేరు. రేవంత్ దొంగనాటకం ఎక్కడ బయటపడుతుందోనని ఎల్ అండ్ టీ కంపెనీని బెదిరించి ఎల్లగొట్టిండు.
రైతులు చనిపోయినా సోయిలేదు. పంటలు కొనాలని రైతులు రోడ్లెక్కి ధర్నాలు చేసినా బుద్ధి రాలేదు. సూర్యాపేట జిల్లాలో గిరిజన రైతులు రక్తం జల్లిండ్రు. రేవంత్రెడ్డి చెప్తున్నడు కదా? పొలాల మీద రక్తం చల్లుమంటున్నడు కదా? అని మేం రక్తం చల్లితే కూడా ఈ ముఖ్యమంత్రి మనసు కరుగుతలేదు.
తెలంగాణలో ఉన్నయ్ రెండేరెండు జాతులు. ఒకటి తెలంగాణను ప్రేమించే జాతి.. రెండోది రాష్ర్టానికి ద్రోహం చేసే జాతి. ఎవడిది ఏ జాతో తెలంగాణ ప్రజలకు బాగా తెలుసు. ఎవరు తెలంగాణ తెచ్చిండ్రో.. ఎవడు తెలంగాణను ఇయ్యాల వంచిస్తున్నడో.. ఎవడు తెలంగాణకు అన్యాయం చేస్తున్నడో అందరికీ తెలుసు.
67 likes
45 shares