ShareChat
click to see wallet page
search
అలసినవానిని ఊరడించు మాటలు 🍞🍞🍞🍞🍞🍞🍞🍞🍞 DAILY MEDITATIONS FROM THE MINISTRY OF Bro. BAKTH SINGH 🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇 🌷🌷🌷 Thursday, April 23 🌷🌷🌷 *''మారుమనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును'' (లూకా 15:7).* ప్రభువు యొక్క ఆనందము పరలోకములో ఆరంభమగును, భూమిమీద కాదు (లూకా 15:10). ఒక మానవుని హృదయములో పరిశుద్ధాత్మ, దేవుని వాక్యము ద్వారా బలమైన ఒప్పుదలను, నిజమైన పశ్చాత్తాపమును కలిగించును. అతడు నిజముగా తన పాపములను ఒప్పుకొని, తనకు బదులుగా యేసుక్రీస్తు ప్రభువు మరణించెనని విశ్వసించిన యెడల పరలోకమందు దేవుని దూతలందరి యెదుట గొప్ప సంతోషము కలుగును. ఒక పాపి పశ్చాత్తాపపడిన వెంటనే దేవుడు, పరలోకపు వాయిద్యములతో పాటలు పాడుటకు దూతలనందరిని పిలుచును. పశ్చాత్తాపపడిన పాపి హృదయములో కూడా అదే పరలోకపు ఆనందము పోయబడును. కాబట్టి ఇఇ పరలోకమునుండి కలిగిన ఆనందము. ఒకవేళ అది బోధకుని నుండి వచ్చిన భూసంబంధమైన ఆనందమైన యెడల, అది వెంటనే వాడిపోవును. ఒక దినమున ఒక కూడికలో కొందరు చేతిని పైకెత్తి మేము తిరిగి జన్మించితిమని చెప్పవచ్చును. ఆ తరువాతి దినము ఒక కష్టతరమైన విషయములో వారు మనస్సు నొప్పించుకొందురు గాని పరలోకము నుండి ఒక వ్యక్తిలోనికి వచ్చిన సంతోషము ఎన్నటికి వాడిపోదు. అందుచేతనే ప్రభువైన యేసుక్రీస్తుకు ముందుగా వచ్చిన బాప్తిస్మమిచ్చు యోమాను మారుమనస్సును గురించి బోధించి, ''మారుమనస్సుకు తగిన ఫలము ఫలించుడి'' అని చెప్పెను. యేసు ప్రభువు ''పరలోక రాజ్యము సమీపించి యున్నది గనుక మారుమనస్సు పొందుడి'' అని చెప్పుచు ప్రకటించెను (మత్తయి 4:17). బాప్తిస్మమిచ్చు యోహాను, యేసుక్రీస్తు ప్రభువు ఇద్దరు కూడా పరిశుద్ధాత్మచే నింపబడుటను గూర్చి బోధించిరి. ప్రజలు తమ పాపములను ఒప్పుకొనిన యెడల అది హృదయములో నుండి రావలెను, గాని పెదవుల నుండి కాదు. పశ్చాత్తాపమనునది సరియైనదని నిశ్చయించుకొనుటకు, భయమును బట్టి మనము ఒప్పుకొనుట లేదని, లేక ప్రజలు మన గురించి ఏమనుకొందురని గాని, లేక మంచి పేరు కొరకు ఒప్పుకొనుట లేదని మనము నిశ్చయించుకొనవలెను. కొంతమందికి పశ్చాత్తాపమును గురించి సరియైన గ్రహింపు ఉండదు. వారు చాలా తేలికగా, ''ఓ దేవా! నేనొక వేళ ఇది చేసిన యెడల, లేక అది చేసిన యెడల, దయచేసి నన్ను క్షమించుము'' అని చెప్పుదురు. వారి పాపముల విషయమై వారికి నిజమైన ఒప్పుదల, విచారము ఉండవు. యోబుకు దేవుని ప్రత్యక్షత కలిగినది. మునుపెన్నడును కలుగని విధముగా యోబుకు దేవుని మహిమా సౌందర్యములు, ఆయన సర్వశక్తిని గూర్చిన ప్రత్యక్షత కలిగినది. అది అతనిని దేవుని సన్నిధిలో తనను తాను అసహ్యించుకొని, ద్వేషించుకొనునట్లు చేసినది. మనము లూకా 5:8లో సీమోను పేతురు, యేసు మోకాళ్ల ఎదుట సాగిలపడదది, ''ప్రభువా, నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడనని చెప్పెను''. మన ప్రభువు సీమోను పాపములు బయటకు కనబడచుట గాని లేక గద్దించుట గాని చేయనవసరము లేదు. పేతురు యేసుక్రీస్తు ప్రభువు యొక్క గొప్ప శక్తిని, గొప్పతనమును చూచి బహుగా ఒప్పించబడెను. మరల లూకా 19:8లో జక్కయ్య ఎంత నమ్మకముగా పశ్చాత్తాపపడెనో చూచుచున్నాము. అతడు డబ్బు విషయములో అవినీతిపరుడు అని చూపించవలసిన అవసరత ప్రభువునకు లేదు. ప్రభువు యొక్క సన్నిధియే అతనిలో నిజమైన పశ్చాత్తాపమును, హృదయములో మార్పును తీసికొని వచ్చినది. అందుచేతనే అతడు ''ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదల కిచ్చుచున్నాను. నేనెవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసికొనిన యెడల అతనికి నాలుగంతలు మరల చెల్లింతును'' అని ప్రభువుతో చెప్పెను. నిజమైన పశ్చాత్తాపము ద్వారా ఏవిధముగా పరలోకము నుండి సంతోషము మనకు కలుగునో చూచుచున్నాము. ఎవరైతే నిజముగా పశ్చాత్తాపపడుదురో వారి హృదయములలో కూడా ఇట్టి సంతోషము కుమ్మరించబడును. Download Daily Devotions by Brother Bakht Singh Mobile App, using link: https://rb.gy/iv32b1 #📀యేసయ్య కీర్తనలు🎙 #😇My Status Download Songs Book Songs of Zion Mobile App, using link: https://rb.gy/ua3tlm Listen to Songs of Zion by visiting Hebron World Youtube Channel: https://www.youtube.com/@Hebron_World To Read Books written by Brother Bakht Singh, visit: https://hebronworld.com