*_26/06/2026 - జ్యేష్ట శుక్ల ద్వాదశి- రామలక్ష్మణ ద్వాదశీ, చంపక ద్వాదశి_*
*_జ్యేష్ఠశుద్ధ ద్వాదశి రామలక్ష్మణ ద్వాదశి, చంపక ద్వాదశి, ఆదిశంకర కైలాస గమనం_*
*_ఏకాదశ్యాం సౌవర్ణరామలక్ష్మణౌ సంపూజ్య ద్వాదశమ్యాం బ్రాహ్మణాయ దద్యాత్| తథా చోక్తం వరాహపురాణే-_*
*_జ్యైష్ఠమాసేఽప్యేవమేవ సంకల్ప్య విధినా నరః|_*
*_అర్చయేత్ పరమం దేవం పుష్పైర్నానావిధైశ్శుభైః॥_*
*_స్రగ్వస్త్రయుగసంచ్ఛన్నౌ సౌవర్ణౌ రామలక్ష్మణౌ|_*
*_అర్చయిత్వా విధానేన ప్రభాతే బ్రాహ్మణాయ తౌ॥_*
*_దాతవ్యౌ మనసా కామమీహతాం పురుషేణ తు॥ ఇతి|_*
*_తస్మాత్ ఏవ ద్వాదశ్యా రామలక్ష్మణద్వాదశీతి సంజ్ఞా స్యాత్|_*
*_జ్యేష్ఠశుద్ధ ఏకాదశినాడు బంగారముతో రామలక్ష్మణ విగ్రహములను తయారుచేయించి, పూజించి మరునాడు అనగా ద్వాదశి నాడు బ్రాహ్మణులకు దానముచేయవలెనని వరాహపురాణము చెప్పుచున్నది. కనుకనే ఆ ద్వాదశికి రామలక్ష్మణ ద్వాదశి అని పేరుగల్గినది._*
*_ఈ రోజున రామలక్ష్మణులను పూజిస్తే రామానుగ్రహం కలుగుతుంది. ఉత్కళ రాష్ట్రము మొదలైన కొన్ని ప్రాంతాలలో ప్రత్యేకంగా చంపక ద్వాదశి అను పేరిట , జగన్నాథునకు సంపెంగలు మొదలైన అనేక పువ్వులతో విశేష అర్చనాదులు చేస్తారు. కనుక ఏ ప్రాంతంలోని వారైనా సంపెంగలు మొదలైన పూలతో విష్ణువును ఆరాధించాలి_*.
*_షణ్మతస్థాపనాచార్యులైన జగద్గురువులు శ్రీ ఆదిశంకరులు కైలాసగమనం చేసిన రోజు కూడా ఇదే కావడం వలన వారి స్మరణ, పూజాదులు గుర్వనుగ్రహాన్ని కలుగజేస్తాయి_* #మన సంప్రదాయాలు సమాచారం


