Mohan
625 views • 20 hours ago
#🌍నా తెలంగాణ #📰ఈరోజు అప్డేట్స్ #🆕Current అప్డేట్స్📢 #BRS party యాదగిరిగుట్ట దేవస్థానం పాలక మండలి (బోర్డు మెంబర్) పదవి ఇప్పిస్తానని చెప్పి ఒక కాంగ్రెస్ పార్టీ కీలక నేత, హైదరాబాద్కు చెందిన ఒక ప్రముఖ వ్యాపారవేత్త నుండి రూ. 1 కోటి వసూలు చేసినట్లు సంచలన వార్తలు వస్తున్నాయి
అసలు ఏం జరిగింది?వ్యాపారి ఆశ: హైదరాబాద్కు చెందిన ఒక బడా వ్యాపారవేత్తకు ధార్మిక సేవలు చేయడంపై ఆసక్తి ఎక్కువ. యాదగిరిగుట్ట ఆలయ పాలక మండలిలో సభ్యత్వం పొందితే సామాజికంగా, వ్యాపారపరంగా మంచి గుర్తింపు వస్తుందని ఆశపడ్డాడు.రాజకీయ నేత ఎంట్రీ: సదరు వ్యాపారవేత్త తనకు తెలిసిన వ్యక్తుల ద్వారా తెలంగాణ అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక ముఖ్య నేతను ఆశ్రయించారు.రూ. కోటి డీల్: కొన్ని షరతులతో కూడిన కండీషన్లు పెట్టిన సదరు రాజకీయ నేత, బోర్డు మెంబర్ పదవి ఇప్పిస్తానని హామీ ఇచ్చి అడ్వాన్స్గా రూ. 1 కోటి వసూలు చేసినట్లు సమాచారం.లబోదిబోమంటున్న బాధితుడుఇటీవలే ప్రభుత్వం యాదగిరిగుట్ట ఆలయ నూతన పాలక మండలి జాబితాను అధికారికంగా విడుదల చేసింది.ఆ లిస్టులో తన పేరు లేకపోవడంతో సదరు వ్యాపారవేత్త తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాడు."డబ్బులు పోయాయి.. పదవీ రాలేదు" అంటూ సదరు బాధితుడు తన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేయడంతో ఈ 'గుట్ట' పోస్టుల గుట్టు కాస్తా బయటపడి రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారం రేపుతోంది.
5 likes
13 shares