1️⃣
*_చాగంటి వారి_*.
*_సుందరకాండ-హనుమ_*
*_1 వ భాగం_*
*_సుందరకాండలో_*
*_స్వామి హనుమ పాత్ర_*
*_శ్రీమద్రామాయణంలో ప్రధాన పాత్ర కధానాయకుడు శ్రీరామచంద్రమూర్తి, కాని అత్యంత సౌందర్యమైన సుందరకాండలో ప్రముఖ పాత్ర పోషించినది స్వామి హనుమ_*.
*_సుందరకాండకు స్వామి హనుమే కధానాయకుడు. సుందరకాండలో శ్రీరామచంద్రమూర్తి కనిపించరు కాని రామ కధా గమనం కనిపిస్తుంది. రామనామము యొక్క బలం కనిపిస్తుంది._*
*_ఎవ్వరూ సాధించలేని కార్యాన్ని_*
*_స్వామి సాధించుకుని వచ్చారు._*
*_నూరు యోజనముల సముద్రాన్ని దాటి లంకకు చేరి సీతమ్మ తల్లి జాడ తెలుసుకోవడమే కాకుండా అశోకవనాన్ని ధ్వంసం చేసి రావణుని కలిసి జరగబోయే పరిణామాలను వివరించి హెచ్చరించి మరీ వచ్చారు స్వామి_*.
*_పూజ్య గురువులు శ్రీ చాగంటి వారి సుందరకాండ ప్రవచనములో స్వామి హనుమ యొక్క సౌందర్యాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు_*.
*_సుందరకాండలో ఏ పాత్ర కూడా తమ గొప్పతనాన్ని తాము చెప్పుకోవు. తాము చేస్తున్నటువంటి కర్మల ద్వారా వారి గొప్పతనం ఆవిష్కరింపబడుతుంది._*
*_అమ్మ సీతమ్మ తల్లి తన పాతివ్రత్యాన్ని నిరూపించుకున్న కాండ సుందరకాండ_*.
*_ఒక సందర్భంలో రావణాసురునితో.._*
*_“నా భర్త ఆజ్ఞ లేదు ఒక వేళ వుండి వుంటే నా పాతివ్రత్య శక్తితో నిన్ను బూడిద చేసేదాన్ని!” అని చెబుతుంది సీతమ్మ తల్లి_* *_మనుష్యకాంతగా జన్మించి పాతివ్రత్యమనే వ్రతాన్ని చేపట్టిన జగన్మాత యొక్క గొప్పతనాన్ని ఆవిష్కరించిన కాండ సుందరకాండ._*
*_సుందరకాండ ప్రారంభంలో వాల్మీకి మహర్షి చెప్పిన ఒక శ్లోకంలో.. “సుందరే సుందరం కపి” స్వామి హనుమ వానరుడే అయినా అత్యంత సౌందర్యం కలవాడు అని మహర్షి తెలియజేసారు_*.
*_సౌందర్యము పైకి కనిపించే రూపం కాదు అంతర్గతమైన గొప్పదైనటువంటి గుణము వలన భాసిస్తుంది. భగవంతుని నిత్యం స్మరిస్తూ తనకు ఎన్ని శక్తులున్నా కూడా తన కొరకు ఎప్పుడూ ఆ శక్తులను ఉపయోగించకుండా పరుల సేవకై, అభ్యున్నతికై వినియోగించేవాడే అత్యంత సౌందర్యవంతుడు. స్వామి హనుమ కన్నా సౌందర్యవంతుడు ఈ ప్రపంచంలో లేడు._*
*_జితేంద్రియం బుద్ధిమతాంవరిష్టం_*
*_స్వామి హనుమ వ్యాకరణ పండితుడు, బుద్ధిమంతులలో స్వామి కన్నా అగ్రగణ్యుడు లేడు._* *_అత్యంత తేజోవంతుడు. స్వామి ఆవిర్భావ సమయమున సూర్యభగవానుడు స్వామి వాక్వైభవాన్ని ప్రసాదించి తన తేజములో నూరవ అంశను ధారపోసి అత్యంత విద్వాంసునిగా తయారుచేస్తానని ఆశీర్వదించారు_*.
*_ఆ విధముగా సకల దేవతలనుండి వరములను పొందిన ధీరుడు స్వామి హనుమ._*
*_ఇన్ని శక్తులు కలిగినటువంటి హనుమ తనను స్తోత్రం చేస్తే కనిపించరు. కాని ఎక్కడ రాముడిని స్మరిస్తారో ఎక్కడ రామకధ వినిపిస్తుందో ఎక్కడ శ్రీరామ నామ జపం జరుగుతుందో అక్కడ స్వామి హనుమ తప్పక కొలువై వుంటారు_*.
*వాఙ్మయంలో అత్యంత సౌందర్యవంతులు_* *_ఇద్దరే ఇద్దరు, ఒకరు స్వామి_* *_హనుమ, మరియు సాక్షాత్తు ఈశ్వర_* *_ప్రతిరూపమైన_*
*_శ్రీ శంకరాచార్యులు వారు_*.
*_వీరిరువురు తమ యొక్క శక్తులను కాని బుద్ది బలాన్ని తమకోసం ఏనాడు వుపయోగించలేదు, లోకోద్ధారణ కొరకు లోకకళ్యాణం కొరకు ఉపయోగించారు. నిత్యం రామ నామ స్మరణ చేస్తూ భక్తి పారవశ్యంతో వుండే స్వామి హనుమ కన్నా సుందరమూర్తి వేరొకరు లేరు_* #మన సంప్రదాయాలు సమాచారం


