Mohan
633 views 11 hours ago
#🌍నా తెలంగాణ #📰ఈరోజు అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢 #BRS party కాంగ్రెస్‌పై నిరుద్యోగి చార్జ్‌షీట్‌.. ఖమ్మం యువకుడి వాంగ్మూలం.. దౌర్భాగ్యపు పాలనకు తిరస్కారం: కేటీఆర్‌ KTR | డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నియోజకవర్గ పరిధికి చెందిన నిరుద్యోగి వేణు కుమార్‌ రాసిన సూసైడ్‌ నోటు.. కాంగ్రెస్‌ చేతగాని, అసమర్థ పాలనపై వేసిన చార్జ్‌షీట్‌ అని బీఆర్‌ఎస్‌ వరింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అభివర్ణించారు. నిరుద్యోగి రాసిన సూసైడ్‌ నోటుకు రాహుల్‌గాంధీ, రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు నోటిఫికేషన్లు ఇవ్వకుండా కాంగ్రెస్‌ దగా చేసింది ‘ప్రతి సంవత్సరం జాబ్‌ క్యాలెండర్‌ ఇస్తామని కాంగ్రెస్‌ చెప్తే నమ్మి ఓట్లేసినం. కానీ ఇప్పటివరకు జాబ్‌ క్యాలెండర్‌ అమలు చేయలేదు. పంచవర్ష ప్రణాళిక మాదిరిగా నోటిఫికేషన్స్‌ ఇస్తే నాలాంటి ఎందరో నిరుద్యోగులు ఎదురుచూపుల్లోనే విలువైన సమయాన్ని, వయసును పోగొట్టుకుంటున్నారు. ప్రతి సంవత్సరం నోటిఫికేషన్లు విడుదల చేస్తే నిరుద్యోగులకు ఈ దుస్థితి వచ్చేది కాదు. రేవంత్‌రెడ్డే క్రిమినల్‌ వేస్ట్‌! ఇంజినీరింగ్‌ విద్యార్థులను ‘క్రిమినల్‌ వేస్ట్‌’గా పేర్కొన్న సీఎం రేవంత్‌రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని బీఆర్‌ఎస్‌ నేతలు డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో వచ్చే ఎన్నికల్లో కొడంగల్‌ నుంచి లక్ష మంది విద్యార్థులతో నామినేషన్‌ వేయిస్తామని స్పష్టంచేశారు. ఈ మేరకు తెలంగాణభవన్‌ వద్ద మీడియా సమక్షంలో ప్లకార్డులను ప్రదర్శించారు రేవంత్‌రెడ్డి ఏం చదివిండో నాకైతే డౌటే. ఎలా పాసైండో అందరికీ డౌటే. నకల్‌ కొట్టి పాసైన బాపతే అయ్యుంటది. మిస్టర్‌ రేవంత్‌.. నీ ఎలక్షన్‌ ఫామ్‌ నింపగలుగుతవా? నీ జీవితంలో ఒక పోటీ పరీక్షయినా రాసినవా? ఎప్పుడైనా ఒక ఇంటర్వ్యూకు హాజరైనవా? గోడలపై సున్నాలేసుకునే నువ్వు.. గొప్ప విశ్వవిద్యాలయాల్లో కష్టపడి చదివిన ఇంజినీర్లను విమర్శిస్తవా ? కాంగ్రెస్‌ వచ్చిన తర్వాత తెలంగాణలో ఐటీ పరిశ్రమ తీవ్రంగా దెబ్బతిన్నది. ఇప్పటివరకు 7,000 ఐటీ ఉద్యోగాలు పోయినయ్‌. ఎందుకు ఉద్యోగాలు తగ్గినయో ప్రభుత్వం చెప్పాలి. అధికారంలోకి వస్తే పోటీ పరీక్షలకు ఫీజులు ఉండవని చెప్పిండ్రు. కానీ, ఫీజులు పెంచిమరీ వసూలు చేస్తున్నరు
5 likes
10 shares

More like this