నందీశ్వరుడి చెవిలో - కోరికలు ఎందుకు చెబుతాం ?🐂📖
అసలు కథ ఏంటంటే
పూర్వం కైలాసంలో శివపార్వతులు ఏకాంతంగా కూర్చుని లోక కళ్యాణం గురించి మాట్లాడుకుంటున్నారు. ఆ టైంలో నందీశ్వరుడు గుమ్మం దగ్గర కాపలాగా ఉన్నాడు.
ఇంతలో దేవతలు, ఋషులు శివుడి దర్శనానికి వచ్చారు. కానీ శివుడు ధ్యానంలో ఉండటం వల్ల నంది వాళ్లని లోపలికి పంపలేదు.
దేవతలు బాధపడుతూ "నందీ! మా మొర స్వామికి వినిపించు" అని వేడుకున్నారు. అప్పుడు నంది "మీ బాధలు నా చెవిలో చెప్పండి, నేను స్వామి ధ్యానం ముగిసిన తర్వాత విన్నవిస్తాను" అన్నాడు.
దేవతలు నంది చెవిలో తమ కష్టాలు చెప్పుకున్నారు. శివుడు ధ్యానం నుండి లేచిన వెంటనే నంది అన్నీ వివరించాడు. శివుడు వెంటనే దేవతల కష్టాలు తీర్చాడు 🙏
శివుడు ఇచ్చిన వరం
శివుడు సంతోషించి నందితో ఇలా అన్నాడు:
"నందీశ్వరా! ఇవాళ్టి నుండి కలియుగంలో నా భక్తులు నిన్ను దర్శించుకుని, నీ చెవిలో తమ కోరికలు చెబితే, అవి నాకు చెప్పినట్టే భావిస్తాను. నువ్వు నా ప్రతినిధివి. కానీ ఒక షరతు - భక్తుడు చెప్పేది రహస్యంగా ఉండాలి, స్వచ్ఛమైన మనసుతో ఉండాలి"
#తెలుసుకుందాం ##పురాణాలూ_కథలు #హర హర మహాదేవ 🙏 #హర హర మహాదేవ శంభో శంకర #🛕శివాలయ దర్శనం


