గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టిన రోజు సందర్భంగా గౌరవ మంత్రివర్యలు శ్రీ నారా లోకేష్ గారి సహకారంతో తాడేపల్లి నారా లోకేష్ క్రీడా ప్రాంగణంలో నిర్వహించిన మంగళగిరి వాలీబాల్ లీగ్-4 పోటీల బహుమతి ప్రధానోత్సవ సభలో విధ్యుత్ శాఖ మంత్రివర్యులు శ్రీ గొట్టిపాటి రవి కుమార్,ఎమ్మెల్యేలు ఏలూరి సాంబశివరావు కలిసి గిద్దలూరు శాసనసభ్యులు శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారు పాల్గొని, విన్నర్గా నిలిచిన రెడ్ చిల్లీస్ కొలనుకొండ టీమ్, రన్నరప్గా నిలిచిన 6వ బెటాలియన్ ఏపీఎస్పి లయన్స్ టీమ్కు నగదు బహుమతితో పాటు ట్రోఫీలు అందజేయడం జరిగింది. అలాగే క్రీడాకారులకు నగదు, ట్రోఫీలతో పాటు టోర్నమెంట్లో పాల్గొన్న ప్రతి జట్టుకు వాలీబాల్ కిట్టు అందజేశారు. నియోజకవర్గ స్థాయి క్రీడాకారుల్లోని నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు మంత్రి నారా లోకేష్ క్రీడా పోటీలను నిర్వహిస్తుండడం అభినందనీయం. యువత క్రీడా పోటీల్లో మంచి స్ఫూర్తి కనబరిచారని, ఇదే స్ఫూర్తితో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు...
#GottipatiRavikumar #VolleyBall #Mangalagiri #NaraLokesh #AndhraPradesh #MuthumulaAshokReddy #GiddalurTelugudesamparty #📰ప్లాష్ అప్డేట్స్ #🏛️రాజకీయాలు #🎯AP రాజకీయాలు #📰ఆంధ్రా వాయిస్ #✊నారా లోకేష్


