ShareChat
click to see wallet page
search
ప్రజల సంక్షేమం, సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే జారె ఆదినారాయణ గారు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఈరోజు శ్రీ చెలికాని ఆదెమ్మ గారి ఫంక్షన్ హాల్ సమావేశ మందిరంలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఎమ్మెల్యే గారు స్థానిక ప్రజాప్రతినిధులు, నియోజకవర్గ అధికారులతో కలిసి పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం ప్రజల వద్దకే పాలనను తీసుకెళ్లే దిశగా ఈ 99 రోజుల ప్రత్యేక కార్యాచరణను ప్రారంభించింది. ఈ ప్రణాళిక కేవలం ఒక కార్యక్రమం కాదు, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే ఉద్యమం అని ఎమ్మెల్యే గారు పేర్కొన్నారు. ప్రతి అధికారి బాధ్యతతో, ప్రతి ప్రజాప్రతినిధి అంకితభావంతో పనిచేస్తేనే ఈ కార్యక్రమం ఫలవంతం అవుతుందని తెలిపారు. గ్రామాల నుండి పట్టణాల వరకు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ 99 రోజుల ప్రణాళికలో పారిశుధ్యం, ఆరోగ్యం, రోడ్డు భద్రత (అరైవ్ అలైవ్), సంక్షేమ పథకాలు, పిల్లల రక్షణ, డ్రగ్స్ నిర్మూలన, రైతు సంక్షేమం, విద్య, యువత & క్రీడలు, మహిళా సాధికారత, పర్యావరణ పరిరక్షణ వంటి ముఖ్య అంశాలకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం పార్టీ భేదాలు పక్కనపెట్టి అందరూ కలిసి పనిచేయాలని, ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి ప్రతిపాదనలు అందజేస్తే ప్రభుత్వం ప్రాధాన్యతతో నిధులు కేటాయిస్తుందని స్పష్టం చేశారు. ఈ శిక్షణాత్మక సమావేశం నూతన ప్రజాప్రతినిధులకు మార్గదర్శకంగా నిలుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు, అధికారులు, మండల నాయకులు, ప్రజలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. “ప్రజల భాగస్వామ్యంతోనే ప్రగతి సాధ్యం” ✨ #కాంగ్రెస్ #కాంగ్రెస్ పార్టీ తెలంగాణ #🔹కాంగ్రెస్ #🌍నా తెలంగాణ #🏛️రాజకీయాలు
కాంగ్రెస్ - సణలిక [ದಜಾಿದ ~ய பய்பப ulalel సణలిక [ದಜಾಿದ ~ய பய்பப ulalel - ShareChat