ShareChat
click to see wallet page
search
#పూరిధామ్ - శ్రీక్షేత్రం - పూరి జగన్నాథ్ స్వామి దివ్యధామ్ #మీకు తెలుసా! పూరీ జగన్నాథ్ స్వామి వారి 'హోమ్ క్వారంటైన్' / స్వామి వారికి జ్వరం వచ్చింది #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత #ఆధ్యాత్మికం - ఆనందం 🚩 డైలీ విష్ 🚩 #జగన్నాధ్ రధయాత్ర *శ్రీ జగన్నాథ స్వామివారికి మహాస్నానోత్సవం* *జగన్నాథా స్వామికి పూరీలో స్నాన పౌర్ణిమ* 🪔 *108 బంగారు కలశాలతో శ్రీజగన్నాథ స్వామివారికి మహాస్నానం* 🪔 🪔 *15 రోజుల పాటు అనారోగ్య విశ్రాంతి... జూలై 16న రథయాత్ర* 🪔 ఒడిశాలోని జగన్నాథ పూరీలో ప్రతి సంవత్సరం జ్యేష్ఠ పౌర్ణిమ రోజున స్నాన పౌర్ణిమ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఈ రోజున శ్రీజగన్నాథుడు, అన్నయ్య శ్రీబలభద్రుడు, చెల్లెలు దేవి సుభద్రమ్మతో కలిసి భక్తుల సమక్షంలో మహాస్నానం చేస్తారు. సంవత్సరంలో ఇదొక్కరోజే ఈ ముగ్గురు దేవతలకు ఆలయం వెలుపల 108 బంగారు కలశాల్లోని పవిత్ర జలాలతో అభిషేకం నిర్వహిస్తారు. అందుకే దీనిని స్నాన పౌర్ణిమ అని పిలుస్తారు. స్నానం అనంతరం శ్రీజగన్నాథ స్వామివారికి జ్వరమొచ్చినట్లు భావించి 15 రోజుల పాటు విశ్రాంతి కల్పిస్తారు. ఈ కాలంలో భక్తులకు స్వామివారి ప్రత్యక్ష దర్శనం ఉండదు. ఆ తరువాత రథయాత్ర సందర్భంగా భక్తులకు తిరిగి దర్శనమిస్తారు. ఈ సమయంలో భగవంతుడు అనారోగ్యంతో ఉన్నారని విశ్వసించి, భక్తులు ఆలార్నాథ ఆలయాన్ని దర్శిస్తారు. జగన్నాథ స్వామివారి దర్శనానికి సమానమైన పుణ్యం ఆలార్నాథ స్వామివారి దర్శనంతో లభిస్తుందని విశ్వాసం. ఆలార్నాథుడు శ్రీజగన్నాథుని పరమభక్తుడిగా ప్రసిద్ధి చెందాడు. జగన్నాథ ఆలయ అర్చకుల ప్రకారం, సాధారణ రోజుల్లో స్వామివారికి గర్భగృహంలోనే స్నానం చేయిస్తారు. అయితే ఇప్పుడు ప్రతిరోజూ అద్దం ద్వారా స్నానం చేయించే ప్రత్యేక సంప్రదాయం ఉంటుంది. స్వామివారి ఎదుట పెద్ద అద్దాలను ఉంచి, వాటిపై పవిత్ర జలాలను పోస్తారు. ఆ అద్దాల్లో ప్రతిబింబించిన స్వామివారికి స్నానం చేసినట్లుగా భావిస్తారు. ఇలా చేయడానికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి. జగన్నాథుని విగ్రహాలు చెక్కతో తయారైనవి. ప్రతిరోజూ నేరుగా నీటితో స్నానం చేయిస్తే చెక్క దెబ్బతినే అవకాశం ఉంటుంది. స్వామివారు అత్యంత సుకుమారులు అనే భావనతో ప్రతిరోజూ పూర్తిస్థాయిలో స్నానం చేయించకుండా ఈ సంప్రదాయాన్ని పాటిస్తారు. ఈ కారణంగానే రథయాత్రకు 16 రోజుల ముందు వచ్చే జ్యేష్ఠ పౌర్ణిమ రోజున మాత్రమే స్వామివారిని ఆలయం వెలుపలికి తీసుకొచ్చి ప్రత్యేక స్నాన మండపంలో మహాస్నానం నిర్వహిస్తారు. 📿🛕🏮 *108 బంగారు కలశాలతో మహాస్నానం* 🏮🛕📿 స్నాన పౌర్ణిమ రోజు ఉదయం ఆలయంలోని బంగారు బావిని (స్వర్ణకూపం) తెరిచి పవిత్ర జలాలను తీస్తారు. వేద మంత్రోచ్చారణ మధ్య శ్రీజగన్నాథుడు, శ్రీబలభద్రుడు, దేవి సుభద్రమ్మ, సుదర్శన చక్రానికి 108 బంగారు కలశాలతో అభిషేకం నిర్వహిస్తారు. ఈ కలశాల్లోని నీటిలో కస్తూరి, కుంకుమపువ్వు (కేసర్), చందనం, కర్పూరం మరియు అనేక ఔషధ మూలికలు కలుపుతారు. అనంతరం మూడు పెద్ద చెక్క సింహాసనాలపై స్వామివారిని ఆసీనులుగా ఉంచి అభిషేకం చేస్తారు. ఈ సందర్భంగా శ్రీజగన్నాథ స్వామివారికి 35 కలశాలు, శ్రీబలభద్రునికి 33 కలశాలు, దేవి సుభద్రమ్మకు 22 కలశాలు, సుదర్శన చక్రానికి 18 కలశాలు తో అభిషేకం నిర్వహిస్తారు. ఈ బంగారు బావి సుమారు 4–5 అడుగుల వెడల్పు గల చతురస్రాకార బావి. ఇది జగన్నాథ ఆలయంలో గర్భగృహం మరియు వాహనమైన సింహ విగ్రహం మధ్య భాగంలో ఉంది. ఈ బావి చుట్టూ గంగవంశ రాజు ఇంద్రద్యుమ్నుడు బంగారు ఇటుకలను అమర్చినట్లు చెబుతారు. ఈ బావిలో అనేక పవిత్ర తీర్థాల జలాలు కలిసివున్నాయని విశ్వాసం. బావి మూతను సిమెంట్, ఇనుముతో తయారు చేశారు. సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే, స్నాన పౌర్ణిమ సందర్భంగా సుమారు 12 నుండి 15 మంది సేవకులు కలిసి మూతను తొలగిస్తారు. బావిలోకి తొంగిచూస్తే బంగారు ఇటుకలు కనిపిస్తాయని భక్తుల నమ్మకం. సంప్రదాయం ప్రకారం మహాస్నానం అనంతరం శ్రీజగన్నాథ స్వామివారు అనారోగ్యానికి గురవుతారు. అందువల్ల భక్తులకు ప్రత్యక్ష దర్శనం ఉండదు. ఈ సమయంలో స్వామివారిని ప్రధాన సింహాసనం నుంచి ప్రత్యేక గదికి తీసుకెళ్లి చెక్క మంచంపై విశ్రాంతి కల్పిస్తారు. సుమారు 56 రకాల ఔషధ మూలికలు, పాలు, పంచదార, తేనె తదితర పదార్థాలతో నైవేద్యం సమర్పిస్తారు. స్వామివారి అవయవాలకు ప్రత్యేక ఆయుర్వేద తైలంతో మర్దన చేస్తారు. దీనిని ఫులురి తేల్ అంటారు. ఈ తైలంతో స్వామివారి ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతుందని విశ్వాసం. దశమి నాడు స్వామివారిని రత్న సింహాసనంపై తిరిగి ప్రతిష్ఠిస్తారు, స్వామివారి శరీరానికి ప్రత్యేక ఔషధ లేపనం చేస్తారు. దీనిని ఖలి లాగి అంటారు. జూలై 14: స్వామివారి నేత్రాలకు మళ్లీ రంగులు అద్ది అందంగా అలంకరిస్తారు. జూలై 15: నవయౌవన దర్శనం నిర్వహిస్తారు. ఈ రోజున భక్తులు అనారోగ్యం నుంచి కోలుకున్న స్వామివారిని తొలిసారిగా దర్శిస్తారు. జూన్ 16: మహా వైభవంగా శ్రీజగన్నాథ రథయాత్ర ప్రారంభమవుతుంది. భక్తులకు ఎంతోకాలంగా ఎదురుచూసే ఈ మహోత్సవం ద్వారా శ్రీజగన్నాథుడు తన అన్నయ్య, చెల్లెలుతో కలిసి రథాలపై విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు. *🚩 ┈┉┅━❀~ ॐ డైలీ విష్ ॐ ~❀━┅┉┈ 🚩* _ఆధ్యాత్మికం ఆనందం_
పూరిధామ్ - శ్రీక్షేత్రం - పూరి జగన్నాథ్ స్వామి దివ్యధామ్ - &55=0959 9 ಜ್ತಗ ನ್ಡಿೊಸನಾಣತ 623825880 Follow Daily Wish on &55=0959 9 ಜ್ತಗ ನ್ಡಿೊಸನಾಣತ 623825880 Follow Daily Wish on - ShareChat