ShareChat
click to see wallet page
search
#😇My Status #🙏🏻💥ఏడు పాయల వన దుర్గా దేవి 💥🙏🏻 #ఏడు పాయల దుర్గ అమ్మవారిని దర్శించుకోండి ఏడుపాయల అసలు కధ : ఏడుపాయలు అనేది మంజీరా నది ఘనపూర్ నుండి ప్రవహిస్తూ , ఇప్పుడు ఎక్కడైతే గుడి ఉందొ ఆ ప్రదేశము వెనుక మూడు , దిగువన మూడు భాగాలు గా అంటే పాయలుగా విడిపోయి మరల పేరూరు దగ్గర కలసిన చోటును పసుపులేరు అని పిలుస్తుంటారు. అయితే ఈ ప్రదేశము కు అతి దగ్గర నాగసన్పల్లి , లక్ష్మి నగర్ పొడిచిన పల్లి , కొత్తపల్లి గ్రామాలు ఉండేవి. కొత్తపల్లి పూర్వ టీడీపీ మంత్రి కరణం రామచంద్ర రావు గారి గ్రామము . ఆ సమయములో అక్కడ వక్క చెట్లుండేవి . నాగసన్ పల్లికి చెందిన మల్లేశము అనే వ్యక్తి ఒకరోజు మేకలను కాసుకుంటూ, కట్టెలు కొట్టుకుని వక్క పండ్లకోసము వెళితే నదికి మొదటి పాయ ఆవల పెద్ద పెద్ద బండరాళ్ల మధ్య ఒక పెద్దపులి గాండ్రిస్తూ కనబడింది. అప్పుడతను పరుగున వెళ్లి గ్రామస్తులను తీసుకువచ్చేప్పటికీ ఆ పులి కనబడలేదు . మరల మరుసటి అమావాస్య శివరాత్రి రోజు కట్టెలకోసము పొతే ఆ పులి అక్కడే కూర్చుని ఉందట . మరల మల్లేశం గ్రామస్తులతో వెళ్తే మరల కనబడలేదంట . మల్లేశము భయముతో ఉంటున్నాడు. ఆరోజే మల్లేశము కలలోకి ఆ పులి వచ్చి నేను వనదేవతను నా కు అమావాస్య రోజు పోతూ రాజుగా వచ్చి మేకను బలి ఇవ్వు , నా బొమ్మపెట్టి పూజలు చేయండి అని చెప్తే అప్పటినుండి మల్లేశము వారి వారసులు పూజలు చేయడము, అమావాస్య రోజు పోతరాజుగా వచ్చి మేకను బలి ఇవ్వుడము మొదలు పెట్టారట. మల్లేశము ఎనిమిది మంది వారసులు పూజారులు గా చేస్తూ వచ్చారు. అప్పటినుండి ఆ చుట్టుప్రక్కల గ్రామస్తులు కూడా ఆ వనదేవతను పూజిస్తూ, మేకలను ,కోడి పుంజులను బలులు ఇవ్వడము చేస్తూ వస్తున్నారు. ప్రతి శివరాత్రికి సమీప గ్రామాల ప్రజలు జాతర చేసే వాళ్ళు . ఎప్పుడైతే( 2014) గుడిని ఎండోమెంటు తీసుకుందో అప్పటినుండి మల్లేశము వారసులను పక్కకు నెట్టి 2014 లో పద్మా దేవేందర్ రెడ్డి బ్రాహ్మణులను నియమించి వనదేవతకు గుడి కట్టించి సహజ ప్రదేశమును,పూర్వ సహజత్వాన్ని మార్చి,మార్చి పెద్దఎత్తున ఉత్సవాలు చేస్తూ వస్తున్నారు . ఇది అసలు కధ . నేను చిన్నపుడు 1990 వరకు కూడా అక్కడ పులి , పులి పైన దుర్గ విగ్రహము మాత్రమే ఉండేవి . మల్లేశము వారసులు రోజుకు ఒకసారి నాగసాని పల్లి నుండి వచ్చి పూజ చేసి వెళ్లేవారు . కానీ ఇప్పుడు అక్కడ అడవి లేదు , వక్క చెట్టు ఉంది . పాపము ఆ మల్లేసు వారసులు అక్కడే కొబ్బరి కాయలు అమ్ము కుంటు బ్రతుకు వెళ్లదీస్తున్నారు . ఇది అసలు చరిత్ర తెలుసుకోవాలంటే ఆ నాగాసాం పల్లి , కొత్తపల్లి , పొడిచిన పల్లి , లక్ష్మి నగర్ లలో వృద్ధులను ఎవరిని అడిగినా చెప్తారు . అయితే నేటి పూజారులు వారి స్థిరత్వము కోసము ఏనాడో ఫలానా ఋషి తపస్సు చేసాడు , మహర్షి ఇక్కడుండేవాడు , అని సోషల్ మీడియాలో కధలు కధలుగా అల్లి, అసలు చరిత్రను అబద్దాలతో వక్రీకరించి, పాపము అసలైన వారసత్వముగా వచ్చే గ్రామ పూజారులను పక్కకు నెట్టేశారు. ఎంత దారుణము కదా ? ఈ వాస్తవాల మూలాలు ఇప్పటికి అక్కడ ఉన్నాయి .
😇My Status - ShareChat