ShareChat
click to see wallet page
search
*రేపు లక్షల ఫోన్లలో ఒకేసారి సైరన్ శబ్దం భయపడొద్దంటున్న కేంద్రం.. ఎందుకో తెలుసా*? రేపు (మే 2న) దేశవ్యాప్తంగా లక్షలాది మంది మొబైల్ ఫోన్లలో ఒక్కసారిగా పెద్ద సైరన్ శబ్దం వినిపించవచ్చు. అయితే దీని గురించి ప్రజలు భయపడడం లేదా కంగారు పడాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. భవిష్యత్తులో ఏదైనా ప్రకృతి విపత్తులు అంటే వరదలు, తుఫానులు, భూకంపాలు వంటివి వచ్చినప్పుడు, ప్రజలందరినీ ఒకేసారి అప్రమత్తం చేయడానికి ప్రభుత్వం 'సాచెట్' (SACHET_ అనే కొత్త సిస్టం తయారు చేసింది. ఇది సరిగ్గా పనిచేస్తుందో లేదో తెలుసుకోవడానికి టెలికమ్యూనికేషన్ శాఖ, విపత్తు నిర్వహణ సంస్థ (NDMA) కలిసి ఈ పరీక్షను నిర్వహిస్తున్నాయి. ఏం జరుగుతుంది? మీ మొబైలు ఒక మెసేజ్ వస్తుంది. దాంతో పాటు పెద్ద సైరన్ శబ్దం వినిపిస్తుంది. ఇది కేవలం ఒక 'టెస్ట్' మాత్రమే. కాబట్టి ఈ మెసేజ్ లేదా శబ్దం చూసి మీరు ఏమీ చేయక్కర్లేదు. ఈ అత్యవసర హెచ్చరిక వ్యవస్థ Common Alerting Protocol (CAP) ఆధారంగా పనిచేస్తుంది. అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ యూనియన్ (ITU) సిఫార్సు చేసిన ఈ టెక్నాలజీ ప్రస్తుతం దేశంలోని 36 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో అమల్లో ఉంది. దీనివల్ల లాభం ఏంటంటే *ఏదైనా ప్రమాదం పొంచి ఉన్నప్పుడు సెకన్ల వ్యవధిలో వేలమందికి సమాచారం చేరుతుంది. *వరదలు లేదా తుఫానులు వచ్చే ముందు హెచ్చరికలు పంపడం ద్వారా ప్రాణ నష్టాన్ని తగ్గించవచ్చు. *ప్రమాదం ఉన్న ప్రాంతంలో ఉన్న ఫోన్లకు మాత్రమే ఈ మెసేజ్ లు వెళ్లేలా ఈ టెక్నాలజీని రూపొందించారు. #తెలుసుకుందాం
తెలుసుకుందాం - ಗೆಗ లక్షలఫోన్లలే ఒకేసరి సైరన్ శీద్దిం భియవదెద్దంటున్నకేంద్రం ఎందుకో తెలుసా? దేశవ్యాప్తంగా మొబ్టెర్ ఫోన్లలో సైరన్ లలర్ల ఆపద సమయంలో ఎలా స్పందించాలో అవగాహన కేంద్రం కీలక ముందడుగు మీ భర్రత కోసం ಗೆಗ లక్షలఫోన్లలే ఒకేసరి సైరన్ శీద్దిం భియవదెద్దంటున్నకేంద్రం ఎందుకో తెలుసా? దేశవ్యాప్తంగా మొబ్టెర్ ఫోన్లలో సైరన్ లలర్ల ఆపద సమయంలో ఎలా స్పందించాలో అవగాహన కేంద్రం కీలక ముందడుగు మీ భర్రత కోసం - ShareChat